పర్యాటక రంగం కళకళలాడాలంటే..!
కొవిడ్ అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసిన రంగాల్లో పర్యాటకం కూడా ఒకటి. ఇప్పటికీ చాలా పర్యాటకరంగ ప్రదేశాల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలు కాలేదు.
బడ్జెట్పైనే ఆశలు
ఇంటర్నెట్డెస్క్: కొవిడ్ అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసిన రంగాల్లో పర్యాటకం కూడా ఒకటి. ఇప్పటికీ చాలా పర్యాటకరంగ ప్రదేశాల్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలు కాలేదు. ముఖ్యంగా భారీ ఎత్తున టీకా కార్యక్రమం మొదలుపెడితే కానీ.. మళ్లీ కార్యకలాపాలను పుంజుకోలేవు. భారత్లో పర్యాటక రంగం పుంజుకోవాలంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా కొవిడ్ పరిస్థితులు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజమ్ అండ్ హాస్పిటాలిటీ (ఎఫ్ఏఐటీహెచ్) కూడా బడ్జెట్పై ఆశలు పెట్టుకొంది.
ఇప్పటికే ఎఫ్ఏఐటీహెచ్ తన ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచింది. ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రితో కలిపి టూరిజమ్ కౌన్సిల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీనిలో పర్యాటకశాఖ మంత్రి కూడా సభ్యుడిగా ఉండాలని కోరింది. పర్యాటక రంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో చేర్చాలని కోరింది. ఈ రంగంలోని ఎగుమతులను పన్ను రహితంగా మార్చాలని ఆ సంస్థ కోరింది.
ప్రభుత్వం గ్లోబల్ మైస్ బిడ్డింగ్ ఫండ్ ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయించాలని ఎఫ్ఏఐటీహెచ్ కోరింది. సమావేశాలు, కార్యక్రమాలు, సదస్సులు, కన్వెన్షన్స్, ఎగ్జిబిషన్లకు సంబంధించిన పర్యాటక రంగాన్ని ‘మైస్’గా పేర్కొంటారు. భారతీయ కార్పొరేట్లు కూడా దేశీయ ‘మైస్’ రంగాన్ని వినియోగించుకొనేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఆ మేరకు వారికి పన్ను రాయితీలను ప్రకటించాలి. దీంతోపాటు టూరిజంలో భారత్ బ్రాండ్ను ప్రచారం చేసేందుకు వివిధ దేశాల్లోని మన రాయబార కార్యాలయాల కోసం రూ.2,500 కోట్ల నిధులను కేటాయించాలి. భారత్లోని మైస్, అడ్వెంచర్, హెరిటేజ్ పర్యాటకాలను ప్రచారం చేయాలి.
పర్యాటక రంగాన్ని దేశంలో కీలక పరిశ్రమగా గుర్తించాలి. జీఎస్టీ కింద రిజిస్టర్ అయిన టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా భారత్లో పర్యటిస్తే రూ.1.5లక్షల వరకు పన్ను రాయితీలు లభించేలా చర్యలు చేపట్టాలి. దీంతోపాటు పర్యాటక రంగానికి అనుబంధంగా ఉండే రవాణా రంగానికి సంబంధించిన అన్ని ఛార్జీలు ఒకే చోట చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ఫలితంగా ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరిస్థితులు మెరుగుపడతాయని ఎఫ్ఏఐటీహెచ్ పేర్కొంది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు