Twitter: యాపిల్తో పంచాయితీ.. ట్విటర్ బ్లూ మరింత ఆలస్యం!
మస్క్ చేతిలో ట్విటర్ సురక్షితం కాదని మాజీ ఉన్నతోద్యోగి ఆరోపించారు. మరోవైపు ట్విటర్ బ్లూ యూజర్లు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్లో వెరిఫైడ్ యూజర్లకు ఇచ్చే బ్లూ టిక్ పునఃప్రారంభం మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. ఇందుకు యాపిల్తో తలెత్తిన వివాదమే కారణమని తెలుస్తోంది. ట్విటర్ యాప్లో యాపిల్ ప్రకటనలు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దాంతోపాటు యాప్ స్టోర్లో యాప్లకు 30 శాతం రుసుము వసూలు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా యాప్ స్టోర్ నుంచి ట్విటర్ యాప్ను తొలగిస్తామని యాపిల్ బెదిరిస్తోందని మస్క్ ఆరోపించారు. యాప్ స్టోర్ విధివిధానాలు వాక్ స్వాతంత్ర్యానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 2 నుంచి యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్న బ్లూ టిక్ వెరిఫికేషన్ ప్రక్రియను వాయిదా వేసినట్లు సమాచారం.
ట్విటర్కు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువభాగం యాపిల్ నుంచే వస్తోంది. తాజా గణాంకాల ప్రకారం యాపిల్ అక్టోబరు 16 నుంచి 22 వరకు ప్రకటనల కోసం ట్విటర్లో 2,20,800 డాలర్లు వెచ్చించగా, నవంబరు 10 నుంచి నవంబరు 16 మధ్య కాలంలో ఈ మొత్తం 1,31,600 డాలర్లకు తగ్గించింది. మస్క్ ట్విటర్ బాధ్యతలు చేపట్టాక చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో యాపిల్ ప్రకటనల కోసం కేటాయిస్తున్న మొత్తాన్ని తగ్గిస్తూ వస్తోందని మార్కెటింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్ యూజర్లకు ప్రధాన గేట్వేగా ఉన్న యాపిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మస్క్ ఆరోపిస్తున్నట్లు ట్విటర్ను యాప్ స్టోర్ నుంచి తొలగిస్తే ఐఫోన్ యూజర్లు ట్విటర్కు దూరం కావాల్సిందే.
మస్క్ చేతిలో ట్విటర్ సురక్షితం కాదు!
ట్విటర్ పగ్గాలు మస్క్ చేపట్టిన తర్వాత యాప్లో డేటా భద్రత కొరవడిందని ట్విటర్ మాజీ ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ యోయెల్ రోథ్ ఆరోపించారు. ప్రస్తుతం ట్విటర్ భద్రత గురించి పనిచేసేందుకు తగినంత మంది సిబ్బంది లేకపోవడమే ప్రధాన కారణమని తెలిపారు. ‘‘గతంలో ట్విటర్లో పోస్ట్ అయ్యే కంటెంట్ నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా 2,200 మంది ఉద్యోగులు పనిచేసేవారు. ప్రస్తుతం దీనిపై ఎంత మంది పనిచేస్తున్నారో తెలియదు. ఉద్యోగుల రాజీనామాతో కంటెంట్ నియంత్రణ తగ్గిపోయింది’’ అని రోథ్ తెలిపారు. ట్విటర్ బ్లూ వెరిఫికేషన్ విషయంలో ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగం చేసిన హెచ్చరికలను మస్క్ లెక్కచేయలేదని రోథ్ ఆరోపించారు. అందువల్లే నకిలీ ఖాతాలు సైతం రుసుము చెల్లించి బ్లూ వెరిఫికేషన్ పొందగలిగాయని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్మన్కు 25 ఏళ్ల జైలు శిక్ష
Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎఫ్టీఎక్స్ సహ వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
స్టాక్స్ లాభాలు బల్లే బల్లే
ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరాన్ని సూచీలు లాభాలతో ముగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 1% రాణించాయి. -
షియామీ ఎస్యూ7 ఈవీ
షియామీ తన తొలి విద్యుత్ కారు (ఈవీ) ఎస్యూ7ను (ఎస్యూ అంటే స్పీడ్ అల్ట్రా) గురువారం విడుదల చేసింది. -
నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
దేశీయంగా 8 కీలక మౌలిక రంగాల వృద్ధి గత నెలలో నెమ్మదించింది. ఎరువుల వంటి రంగాల బలహీన పని తీరుతో ఫిబ్రవరిలో కీలక రంగాల వృద్ధి 6.7 శాతానికి పరిమితమైంది. -
ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లు
ఫిబ్రవరి చివరి నాటికి ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యం రూ.17.35 లక్షల కోట్లలో ఇది 86.5 శాతమని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగ వృద్ధి 8-10% : ఇక్రా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో, 25 దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 8- 10 శాతానికి మించకపోవచ్చని రేటింగ్ సేవల సంస్థ ఇక్రా లిమిటెడ్ అంచనా వేసింది. -
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై విదేశాల్లో మోసపూరిత లావాదేవీలు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదార్లలో చాలా మంది మోసపూరిత విదేశీ లావాదేవీలకు బలయ్యారు. -
అంబానీ, అదానీ తొలిసారి కలిశారు
సంపద పరంగా దేశంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కుబేరులు అంబానీ, అదానీ మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. గుజరాత్కే చెందిన వారిద్దరి మధ్య, కనిపించని పోటీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటాయి. -
ఎంఎస్డీతో కాంట్రాక్టు తయారీ చర్చల కొనసాగింపు
ఔషధాల కాంట్రాక్టు తయారీ ఒప్పందాల నిమిత్తం బహుళ జాతి ఫార్మా కంపెనీ ఎంఎస్డీ (మెర్క్ షార్ప్ అండ్ దోహ్మే సింగపూర్ ట్రేడింగ్ పీటీఈ లిమిటెడ్), తమ అనుబంధ సంస్థ క్యూరాటెక్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరుగుతున్న సంప్రదింపులు మరో 2 నెలలు కొనసాగుతాయని అరబిందో ఫార్మా వెల్లడించింది. -
యూఏఈలో యూపీఐ చెల్లింపులకు నియోపే టెర్మినళ్లు వాడొచ్చు: ఫోన్పే
తమ వినియోగదార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు (యూఏఈ) వెళ్లినప్పుడు.. అక్కడి మాష్రెఖ్ బ్యాంకుకు చెందిన నియోపే టెర్మినళ్ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చని ఫోన్పే తెలిపింది. -
చెన్నై రిఫైనరీలో ఐఓసీ వాటా పెంపు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), దాని అనుబంధ సంస్థ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్మిస్తున్న 9 మిలియన్ టన్నుల రిఫైనరీలో తన వాటాను 75 శాతానికి పెంచుకోనుంది. -
సంక్షిప్తవార్తలు (5)
సూక్ష్మరుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ లిమిటెడ్ను కోటక్ మహీంద్రా బ్యాంకు రూ.537 కోట్లకు కొనుగోలు చేసింది. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ