Twitter: ఆఫీసులోనే పడుకొని మరీ కష్టపడింది.. చివరకు ఉద్యోగం పోయింది
Twitter Layoffs: గడువులోగా టార్గెట్ అందుకోవడానికి గతంలో ఎస్తర్ క్రాఫోర్డ్ ఆఫీసులోనే నిద్రించారు. యాజమాన్యం మారిన నేపథ్యంలో కొత్త వేదికను సిద్ధం చేయడానికి ఇలాంటి త్యాగాలు తప్పవంటూ పరోక్షంగా ఎలాన్ మస్క్కు మద్దతుగా నిలిచారు. తాజా తొలగింపుల్లో ఆమె కూడా తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
వాషింగ్టన్: ట్విటర్ (Twitter)లో ఉద్యోగుల తొలగింపుల (Layoffs) పర్వం కొనసాగుతోంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ (Elon Musk) ఇంకా ఉద్యోగులకు ఉద్వాసన (Layoffs) పలుకుతూనే ఉన్నారు. తాజాగా మరో 200 మంది ఉద్యోగులను ఇంటి బాట పట్టించినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం పేర్కొంది. తొలగించిన విషయాన్ని ఉద్యోగులకు కొందరికి ఇ-మెయిల్స్ ద్వారా.. మరికొందరికి లాగిన్ యాక్సెస్ నిరాకరించడం ద్వారా తెలియజేసినట్లు సమాచారం.
తాజాగా తొలగించిన వారిలో ఎస్తర్ క్రాఫోర్డ్ అనే ఉన్నతోద్యోగి కూడా ఉండడం గమనార్హం. పనిచేసే ప్రదేశాన్ని ప్రేమించాలంటూ గతంలో ఆఫీసులో నేలపైనే పడుకొని వార్తల్లో నిలిచిన ఆమెను కూడా మస్క్ తొలగించారు. మస్క్ తొలగింపుల పర్వాన్ని ప్రారంభించిన కొత్తలో ఉద్యోగులకు అనేక లక్ష్యాలను నిర్దేశించిన విషయం తెలిసిందే. అవి అందుకోని వారిని తొలగిస్తానని హెచ్చరిక చేశారు. దీంతో ప్రొడక్ట్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఎస్తర్.. గడువులోగా టార్గెట్ అందుకోవడానికి గతంలో ఆఫీసులోనే నిద్రించారు. యాజమాన్యం మారిన నేపథ్యంలో కొత్త వేదికను సిద్ధం చేయడానికి ఇలాంటి త్యాగాలు తప్పవంటూ పరోక్షంగా ఎలాన్ మస్క్కు ఒకరకంగా మద్దతుగా నిలిచారు. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో పనిచేసే ప్రదేశాన్ని ప్రేమించాలంటూ హితవు పలికారు. కానీ, అవేవీ పరిగణనలోకి తీసుకోకుండా మస్క్ ఇప్పుడు ఆమెను తొలగించేశారు.
తన ఉద్వాసనపై ఎస్తర్ క్రాఫోర్డ్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడడం, ఆశావహ దృక్పథంతో పనిచేయడం తప్పని తెలిసొచ్చిందని వాపోయారు. ఎస్తర్ 2020లో ట్విటర్లో చేరారు. ఆమె గతంలో ‘స్క్వాడ్’ అనే స్క్రీన్ షేరింగ్ సోషల్ మీడియా యాప్నకు సీఈఓగా వ్యవహరించారు. దీన్ని ట్విటర్ కొనుగోలు చేసింది. దీంతో ఎస్తర్ ఈ కంపెనీలో చేరారు. డిజైన్, ఇంజినీరింగ్, ప్రొడక్ట్ విభాగాల్లో పనిచేశారు. తాజాగా ఆమె ప్రొడక్ట్ టీమ్కు నేతృత్వం వహించడంతో పాటు ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్, భవిష్యత్తులో తీసుకురాబోయే ట్విటర్ పేమెంట్స్కూ తన సేవలను అందిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు ట్విటర్ ఎనిమిదిసార్లు ఉద్యోగులను తొలగించింది. పాత యాజమాన్యంలో 7,500 మంది ఉద్యోగులు పనిచేయగా.. ఇప్పుడు ఆ సంఖ్య 2,000కు చేరినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..