Twitter: ట్విటర్ 2.0లో పేమెంట్స్, ట్వీట్లో 420 అక్షరాలు.. మస్క్ కొత్త ఆలోచన!
ట్విటర్లో యూజర్లు సరికొత్త ఫీచర్లను పరిచయం చేయనున్నారు. దీనిపై ట్విటర్ కొత్త బాస్ మస్క్ సైతం సానుకూలంగా స్పందించాడు. ఇంతకీ ఆ ఫీచర్లేంటి? వాటితో యూజర్లకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తాయో చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్ యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఓ ఫీచర్ను త్వరలోనే యూజర్లకి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ట్వీట్లో అక్షరాల పరిమితిని 280 నుంచి 420కి పెంచునున్నట్లు సమాచారం. దీనిపై ట్విటర్ కొత్త బాస్ మస్క్ సైతం సానుకూలంగా స్పందించాడు. ఓ నెటిజన్ ‘‘ట్విటర్ 2.0లో అక్షరాల పరిమితిని 280 నుంచి 420గా మారుస్తారా?’’ అనిట్వీట్ చేయగా, ‘మంచి ఆలోచన’ అంటూ మస్క్ సానుకూలంగా బదులు ఇవ్వడంతో నెటిజన్లు దీనిపై చర్చించుకుంటున్నారు.
నోట్స్ ఫీచరేనా!
గతంలో ఒక ట్వీట్లో 140 పదాలకు మించి టైప్ చేయడం సాధ్యపడేదికాదు. 2018లో ఈ సంఖ్యను 280కి పెంచారు. తాజాగా దీన్ని 420కి పెంచుతారని నెట్టింట్లో చర్చ మొదలైంది. మస్క్ ట్విటర్కు సంబంధించి కొత్తగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పోల్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్వీట్లో అక్షరాల పరిమితి పెంచాలా? వద్దా? అనేది నిర్ణయించేందుకు ఆయన పోల్ నిర్వహించవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ట్విటర్ను మస్క్ కొనుగోలు చేయడానికి ముందు నోట్స్/ఆర్టికల్స్ అనే పీచర్లను తీసుకురానున్నట్లు ప్రకటించింది. వీటిలో యూజర్లు బ్లాగ్ తరహాలో తాము చెప్పాలనుకున్న కంటెంట్ను ఒకేదాంట్లో రాసేందుకు వీలుంటుంది. ఇందులో గరిష్ఠంగా 2500 అక్షరాల వరకు రాసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ గురించి తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. మస్క్, తాజా స్పందనతో వీటిలో ఒక ఫీచర్ అందుబాటులోకి వస్తుందని నెటిజన్లు ఆశిస్తున్నారు.
2.0 షురూ..
ట్విటర్ నుంచి దశలావారీగా ఐదువేల మంది ఉద్యోగులను తొలగించిన మస్క్, కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ట్విటర్ 2.0 కోసం కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించాడు. మస్క్ నిర్ణయాలతో విభేదించి కొంతమంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. దీంతో ట్విటర్కు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కోడింగ్ అనుభవం ఉన్న ఉద్యోగులు ఎవరైనా తన కొత్త టీమ్లో చేరొచ్చని మస్క్ ఆహ్వానించాడు. మరోవైపు, ట్విటర్ను పునర్నిర్మించేందుకు ప్రపంచంలోనే పేరున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపాడు.
మస్క్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్విటర్లో ద్వేషపూరిత మెసేజ్ల వ్యాప్తి తగ్గముఖ్యం పట్టడంతోపాటు, కొత్తగా ట్విటర్ ఖాతాలు తెరిచే వారి సంఖ్య గతంలో కంటే పెరిగిందని ఒక ట్వీట్లో పేర్కొన్నాడు. ట్విటర్ 2.0లో ఎక్కువగా వీడియోలు, ప్రకటనలు, ఎంటర్టైన్మెంట్పై దృష్టి సారించనున్నట్లు తెలిపాడు. ఇందులోభాగంగా ట్విటర్లో ఎన్క్రిప్టెడ్ డిస్ప్లే మెసేజ్, పేమెంట్స్, పెద్ద ట్వీట్లు వంటి ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారట. వీటితోపాటు డిసెంబరు 2 నుంచి బ్లూ వెరిఫికేషన్ పునఃప్రారంభించనున్నట్లు తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
Google layoffs: గూగుల్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 334 పాయింట్లు లాభపడి 73,278 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 120 పాయింట్లు పెరిగి 22,268 దగ్గర కొనసాగుతోంది. -
దిగివస్తున్న ముడి ఔషధాల ధరలు
మందుల తయారీలో ఫార్మా కంపెనీలు వినియోగించే కొన్ని ముడి ఔషధాల ధరలు దిగివస్తున్నాయి. దాదాపు 10- 15 రకాల ముడి ఔషధాలను (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రేడియంట్స్/ కీ స్టార్టింగ్ మెటీరియల్స్) ఫార్మా పరిశ్రమ అధికంగా వినియోగిస్తోంది. -
భారత వృద్ధి 6.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల, భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది. -
10 ఏళ్లలో 15 లక్షల వృద్ధుల నివాసాలు
దేశంలో వచ్చే 10 ఏళ్లలో వయోవృద్ధుల నివాసాలు 15 లక్షల మేర నిర్మించాల్సి రావొచ్చని స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ అంచనా వేస్తోంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారి (వయోవృద్ధుల) సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. -
యువశక్తి సద్వినియోగం ఏదీ?
దేశంలో పనిచేసే వయస్సులోని యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, ఆ శక్తిని సద్వినియోగం చేసుకోవడం మాత్రం జరగడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆక్షేపించారు. -
డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ‘ఆర్యభట్ట’ అవార్డు
అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ పావులూరి సుబ్బారావును ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), ‘ఆర్యభట్ట’ అవార్డు తో సత్కరించింది. -
యూపీఐ లావాదేవీల్లో ఫోన్పే, గూగుల్పే వాటా 86%
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విభాగంలో ఫోన్పే, గూగుల్పే సంస్థల ఆధిపత్యం పెరుగుతుండటంపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఫిన్టెక్ అంకుర సంస్థలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఓ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్మాల్క్యాప్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తులు రూ.2.43 లక్షల కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరికి చిన్నతరహా కంపెనీ (స్మాల్ క్యాప్) మ్యూచువల్ఫండ్ల (ఎంఎఫ్) నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.2.43 లక్షల కోట్లకు చేరింది. -
శామ్సంగ్ కృత్రిమ మేధ టీవీలు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో కూడిన అల్ట్రా ప్రీమియం నియో క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలను శామ్సంగ్ బుధవారం విపణిలోకి విడుదల చేసింది. -
యాంకర్ మదుపర్ల నుంచి వొడాఫోన్ ఐడియా రూ.5,400 కోట్ల సమీకరణ
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ)కు ముందు, యాంకర్ మదుపర్ల నుంచి రూ.5,400 కోట్లు సమీకరించినట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్కు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కు అనుబంధంగా ఉన్న ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 140 మెగావాట్ల సొలార్ పీవీ (ఫొటో వోల్టాయిక్) మాడ్యూల్స్ సరఫరా ఎగుమతి కాంట్రాక్టు లభించింది. -
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
Ghazal Alagh: కెరియర్ టిప్స్ పంచుకుంటూ నెట్టింట యాక్టివ్గా ఉండే మామాఎర్త్ సీఈఓ తాజాగా ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. ఉమ్మడి కుటుంబ ప్రాధాన్యం గురించి రాసుకొచ్చారు. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై