Twitter: ‘బ్లూ టిక్’కు నెలకు 8 డాలర్లు.. మరిన్ని ప్రయోజనాలూ ఉంటాయ్!
Twitter: ట్విటర్లో బ్లూటిక్కు డబ్బు చెల్లించాల్సిందేనంటూ వచ్చిన ఊహాగానాలను మస్క్ నిజం చేశారు. నెలకు 8 డాలర్లు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. మరిన్ని ప్రయోజనాలూ ఉంటాయన్నారు.
న్యూయార్క్: ట్విటర్ (Twitter)లో కీలక మార్పులకు ఉపక్రమించిన కొత్త యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వచ్చిన ఊహాగానాలను నిజం చేస్తూ ‘బ్లూ టిక్ (Blue Tick)’కు డబ్బులు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. నెలకు 8 డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ధర దేశాన్ని బట్టి మారుతుందని చెప్పారు. ఆయా దేశాల ‘పర్చేజింగ్ పవర్ పారిటీ’కి అనుగుణంగా ధరను నిర్ణయిస్తామని తెలిపారు.
డబ్బులు చెల్లించే వారికి బ్లూ టిక్ (Blue Tick)తో పాటు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉంటాయని మస్క్ (Elon Musk) తెలిపారు. రిప్లై, మెన్షన్, సెర్చ్ వంటి ఫీచర్లలో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. స్పామ్ను నివారించడానికి ఈ ఫీచర్లు అవసరమని తెలిపారు. అలాగే ఎక్కువ నిడివి గల వీడియో, ఆడియోను పోస్ట్ చేసే వెసులుబాటూ ఉంటుందన్నారు. ప్రకటనలూ సగానికి తగ్గుతాయన్నారు. అలాగే తమతో ఒప్పందం కుదుర్చుకొన్న పబ్లిషర్ల ఆర్టికల్స్కు ‘పేవాల్ బైపాస్’ కూడా ఉంటుందన్నారు. అంటే కొన్ని సంస్థలు అందించే పెయిడ్ కంటెంట్కు ఎలాంటి రుసుము చెల్లించకుండానే ట్విటర్ (Twitter)లో చదివే వెసులుబాటు ఉంటుంది. మరోవైపు ప్రముఖుల ట్విటర్ (Twitter) ఖాతాలో పేరు కింద సెకండరీ ట్యాగ్ ఉంటుందని తెలిపారు. ఇలా సమకూరిన ఆదాయంతో కంటెంట్ క్రియేటర్లకు చెల్లించేందుకు ట్విటర్కు అవకాశం కలుగుతుందని తెలిపారు.
నెలకు 8 డాలర్లు వసూలు చేయడంపై ట్విటర్ (Twitter)లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వీటికీ మస్క్ (Elon Musk) స్పందించారు. ఎంత ఫిర్యాదు చేసినా బ్లూ టిక్ (Blue Tick) కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందే అని గట్టిగా బదులిచ్చారు. పైగా తన ట్విటర్ బయోను ‘ట్విటర్ కంప్లైంట్ హాట్లైన్ ఆపరేటర్’గా మార్చుకోవడం గమనార్హం.
మరికొంతమంది గుడ్బై..
ట్విటర్ మస్క్ (Elon Musk) చేతికి వెళ్లాక.. భవిష్యత్తు ఏంటన్నది అర్థమవడం లేదని పలువురు ఉద్యోగులు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు తమకు ఎలాంటి సమాచారం అందడం లేదని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు ప్రత్యామ్నాయ ఉద్యోగాలను చూసుకుంటున్నారు. సీఈఓ పరాగ్ అగర్వాల్ సహా మరికొంత మంది ఉన్నతోద్యోగులను మస్క్ (Elon Musk) తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరికొంతమంది కీలక వ్యక్తులు కూడా తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. చీఫ్ కస్టమర్ ఆఫీసర్, ప్రకటనల విభాగాధిపతి సారా పర్సొనెటె, చీఫ్ పీపుల్ అండ్ డైవర్సిటీ ఆఫీసర్ డలానా బ్రాండ్, కోర్ టెక్ జనరల్ మేనేజర్ నిక్ కాల్డ్వెల్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లెస్లీ బెర్లాండ్ తాజాగా కంపెనీని వీడిన ప్రముఖుల్లో కొందరని సమాచారం.
పెరుగుతున్న అభ్యంతరకర కంటెంట్..
కొనుగోలు ఒప్పందం పూర్తయినప్పటి నుంచి ట్విటర్లో విద్వేషపూరిత, అభ్యంతరకర కంటెంట్ పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంగ్ల అక్షరం ‘ఎన్’ తో ప్రారంభమయ్యే అభ్యంతరకర పదాల వాడకం ఇటీవల ట్విటర్లో 500 శాతం పెరిగినట్లు ‘నెట్వర్క్ కంటేజియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ తెలిపింది. ఎన్ఏఏసీపీ, ఫ్రీ ప్రెస్ సహా దాదాపు 40 ప్రముఖ అడ్వొకసీ సంస్థలు ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ట్విటర్లో అత్యధికంగా ప్రకటనలు ఇస్తున్న తొలి 20 సంస్థలకు బహిరంగ లేఖ రాశాయి. కంటెంట్ విషయంలో మస్క్ (Elon Musk) రాజీపడితే ప్రకటనల్ని నిలిపివేయాలని కోరాయి. మరోవైపు ట్విటర్లో యూజర్ల భద్రత, విశ్వసనీయతపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించే వరకు ప్రకటల్ని ఆపేయాలని మీడియాబ్రాండ్స్ తమ క్లయింట్లను కోరింది.
ట్విటర్కు టెస్లా ఉద్యోగులు..
ట్విటర్లో పనిచేయడానికి ఎలాన్ మస్క్ తన నేతృత్వంలోని ఇతర కంపెనీల ఉద్యోగులకు అనుమతి ఇస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు టెస్లా ఆటోపైలట్ బృందం నుంచి 50 మంది, బోరింగ్ కంపెనీ నుంచి ఇద్దరు, న్యూరాలింక్ నుంచి ఒకరు ట్విటర్కు వెళ్లినట్లు సీఎన్బీసీ పేర్కొంది. వీరిలో చాలా మంది మస్క్ నమ్మకస్థులుగా ఉన్నవారేనని తెలిపింది. టెస్లా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బృందం డైరెక్టర్ అశోక్ ఎల్లుస్వామి; ఆటోపైలట్, టెస్లాబాట్ ఇంజినీరింగ్ డైరెక్టర్ మిలన్ కోవాక్, మరో సీనియర్ అధికారి మహా విర్దుహగిరి వంటి వారు ట్విటర్కు పనిచేయనున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
Resume Tips: రెజ్యూమె ప్రిపేర్ చేసే సమయంలో చేయకూడని మూడు తప్పుల గురించి మాట్లాడారు గూగుల్ మాజీ రిక్రూటర్ నోలన్ చర్చ్. -
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
కోటక్ మహీంద్రా బ్యాంక్పై ఆర్బీఐ పలు ఆంక్షలు విధించింది. ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో లోపాలు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. -
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
తమ బ్రాండ్ పేరు, లోగోతో కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తున్నారని, వీటితో అప్రమత్తంగా ఉండాలని ఎల్ఐసీ సూచించింది. -
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు, నిఫ్టీ 34 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్కు దీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు ఎలాన్ మస్క్కు చెందిన ‘ఎక్స్’ సిద్ధమవుతోంది. -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
Tesla: భారత్లోకి టెస్లా ప్రవేశం సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. మంగళవారం చేసిన ఓ కీలక ప్రకటనే అందుకు కారణం. ఆ ప్రకటనేంటి? దానికీ.. కంపెనీ భారత ప్రణాళికలకు సంబంధం ఏంటో చూద్దాం! -
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
Anil Agarwal: తన దినచర్యను తెలపడంతో పాటు యువతకు ఆరోగ్య సూత్రాలను పంచుకున్నారు వేదాంత అధిపతి అనిల్ అగర్వాల్. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 159 పాయింట్ల లాభంతో 73,898 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 22,412 దగ్గర కొనసాగుతోంది. -
ఇస్రో కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎస్ఈసీ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) వినియోగించే జీఎస్ఎల్వీ మార్క్-3 లాంచ్ వెహికల్ కోసం ఇంటర్ట్యాంక్ స్ట్రక్చర్ (ఐటీఎస్)ను ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రూపొందించింది. -
మూడో రోజూ ముందుకే
వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు రాణించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో టెలికాం, టెక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చమురు ధరలు పెరగడానికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలతో లాభాలు పరిమితమయ్యాయి. -
మా ఉత్పత్తులపై నిషేధం లేదు
తమ అన్ని ఉత్పత్తులు భద్రమైనవి, అత్యంత నాణ్యమైనవని ఎవరెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్స్ తెలిపింది. ఈ సంస్థ ఎగుమతి చేస్తున్న స్పైస్-మిక్స్ ఉత్పత్తుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, కంపెనీ పై విధంగా స్పందించింది. -
బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు ‘అమరరాజా’ సహా 7 కంపెనీల బిడ్
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద బ్యాటరీ ప్లాంట్లు స్థాపించేందుకు అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సహా 7 కంపెనీల నుంచి బిడ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
కాస్త దిగొచ్చిన బంగారం
ఇటీవలి గరిష్ఠాలతో పోలిస్తే బంగారం, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొంతమేర చల్లారడం ఇందుకు కారణం. -
ఇండిగోలో ఇన్ఫ్లైట్ వినోదం
మే 1 నుంచి దిల్లీ-గోవా విమానాల్లో, తన యాప్ ద్వారా ఇన్-ఫ్లైట్ వినోద కంటెంట్ను విమానయాన సంస్థ ఇండిగో ఆవిష్కరించనుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ద్రవ్యోల్బణానికి వాతావరణ ముప్పు
దీర్ఘకాలం భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం.. వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ముడి చమురు ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్ బులెటిన్ అభిప్రాయ పడింది. -
ఇంటిపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ఇండియన్ బ్యాంక్తో టాటా పవర్ భాగస్వామ్యం
నివాస గృహాల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు, టాటా వపర్ సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
వచ్చే 6 నెలల్లో మ్యాజిక్పిన్లో 250 నియామకాలు
ఫ్యాషన్, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు.. ఇలా వివిధ విభాగాల్లో బ్రాండ్లు, వ్యాపార సంస్థల అన్వేషణకు ఉపయోగపడే ఇ-కామర్స్ సంస్థ మ్యాజిక్పిన్ వచ్చే ఆరు నెలల్లో 250 మందిని నియమించుకునే యోచనలో ఉంది. -
నేటి నుంచి నిఫ్టీ నెక్స్ట్50లో డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్
నిఫ్టీ నెక్స్ట్ 50 సూచీలో డెరివేటివ్ కాంట్రాక్టులను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బుధవారం ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం