Adani Group: రెండు ‘అదానీ’ కంపెనీల ఆర్థిక సౌలభ్యానికి ముప్పు: ఫిచ్
Adani Group: గ్రూప్లోని కంపెనీల్లో ఉన్న పాలనాపరమైన లోపాల వల్ల రెండు అదానీ కంపెనీల ఆర్థిక సౌలభ్యానికి ముప్పు పొంచి ఉందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది.
దిల్లీ: అదానీ గ్రూప్ (Adani Group)నకు చెందిన రెండు కంపెనీలపై ప్రముఖ రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్ (Fitch) కీలక నివేదిక విడుదల చేసింది. గ్రూప్లోని కంపెనీలు, అనుబంధ సంస్థల్లో పాలనాపరమైన బలహీనతలు ఉన్నట్లు పేర్కొంది. దీనివల్ల అదానీ ట్రాన్స్మిషన్ (Adani Transmission), అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (Adani Ports & SEZ)ల ఆర్థిక సౌలభ్యానికి ముప్పు పొంచి ఉందని తెలిపింది.
ఈ కంపెనీల రేటింగ్స్ ‘BBB-’లో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే, ఈ రేటింగ్ను ఇక్కడే పరిమితం చేయబోమని స్పష్టం చేసింది. క్రెడిట్ క్వాలిటీ మెరుగపడేందుకు దోహదం చేసే ఇతర అంశాల్లో పురోగతి ఉంటే రేటింగ్స్లో సానుకూల మార్పు ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పోర్ట్స్ క్రెడిట్ ప్రొఫైల్ బలంగా ఉందని తెలిపింది. అదనపు అప్పులపై పరిమితులు, నిర్దిష్ట నిధుల ప్రవాహ వనరుల వల్లే ఇది సాధ్యమైందని పేర్కొంది.
2022 డిసెంబరు ముగిసే నాటికి అదానీ గ్రూప్ (Adani Group)లో రేటింగ్ పొందిన దేశీయ కంపెనీల రుణాల్లో చాలా వరకు విదేశాల్లోనే ఉన్నాయని.. పైగా అవన్నీ సెక్యూర్డ్ రుణాలని ఫిచ్ తెలిపింది. వీటిలో ఉన్న యూఎస్ డాలర్ బాండ్లు 2024 మధ్య నుంచి మెచ్యూర్ కానున్నాయని పేర్కొంది. 2023 జనవరి నుంచి 2024 మార్చి మధ్య వచ్చే నగదు ప్రవాహం వల్ల రేటెడ్ సంస్థల ద్రవ్య లభ్యత స్థితి మెరుగుపడుతుందని తెలిపింది.
మార్చి 28న స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ గ్రూప్ (Adani Group)లోని నమోదిత సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9 లక్షల కోట్ల కిందకు చేరింది. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య ట్రేడవుతున్న విషయం తెలిసిందే. అయితే, గత నెల రోజుల వ్యవధిలో నష్టాలు కొంత వరకు పరిమితమయ్యాయి. కానీ, ఏసీసీ, అంబుజా సిమెంట్ సంస్థల్ని కొనుగోలు చేసేందుకు తీసుకున్న రుణాలను కంపెనీ సకాలంలో చెల్లించలేదని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. దీంతో గత రెండు రోజుల్లో అదానీ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీనిపై గ్రూప్ వివరణ ఇచ్చింది. రుణాలను గడువులోగా చెల్లించామని దీనికి సంబంధించిన వివరాలు స్టాక్ ఎక్స్ఛేంజీల దగ్గర త్రైమాసికం చివరలో అప్డేట్ అవుతాయని తెలిపింది. దీంతో బుధవారం షేర్లు తిరిగి పుంజుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
Ashwini Vaishnaw: ఈ ఏడాది చివరి నాటికి ‘మేడిన్ ఇండియా’ చిప్ తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2026లోనే బుల్లెట్ రైలు పట్టాలెక్కనున్నట్లు తెలిపారు. -
Stock market: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పతనానికి కారణాలు ఇవే!
Stock market: దేశీయస్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22వేల స్థాయిని కోల్పోయింది. -
Elon Musk: ‘అవును కెటమిన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు గతంలో డ్రగ్స్ వినియోగించినట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. -
‘ఆ వార్తలు అవాస్తవం’: అమెరికా దర్యాప్తు చేపట్టిందన్న కథనంపై అదానీ గ్రూప్ స్పందన
లంచం ఆరోపణల విషయంలో దర్యాప్తు గురించి వెలువడిన మీడియా కథనం అవాస్తవమని అదానీ గ్రూప్(Adani Group) వెల్లడించింది. -
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. -
2024-25లోనూ ఐటీ నియామకాలు అంతంతే
ఐటీ రంగం ఆకర్షణీయ వృద్ధి బాట పట్టేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పరిస్థితి ఉంటుందనే అంశమే కాస్త ఊరట కలిగిస్తోంది. -
దీర్ఘకాలంలో చిన్న, మధ్య షేర్లు బలంగానే
చిన్న, మధ్య స్థాయి షేర్ల విలువలు మరీ అధిక స్థాయికి చేరాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేసిన వ్యాఖ్యలతో ఈ షేర్లు గత 3 వారాల్లో భారీగా కుదేలయ్యాయి. -
ఆఫీసుకు వస్తేనే పదోన్నతులు
కార్యాలయాలకు రాకపోతే పదోన్నతులు ఇవ్వబోమని తమ ఉద్యోగులకు స్పష్టం చేస్తూ ల్యాప్ట్యాప్ల తయారీ కంపెనీ డెల్ లేఖ పంపినట్లు తెలుస్తోంది. -
రూ.1991కే ఫ్లై91 ప్రయాణం
ఫ్లై91 సంస్థ సోమవారం తన విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి విమానం గోవా మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం గం.7.55కు బయలుదేరి వెళ్లింది. -
ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగింది: హైర్ ప్రో
అంతక్రితం ఏడాదితో పోలిస్తే, 2022-23 ప్రాంగణ నియామకాల్లో మహిళల వాటా 5% పెరిగినట్లు ఏఐ పవర్డ్ రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ హైర్ ప్రో నివేదిక వెల్లడించింది. -
అంకురాలకు విలువే సర్వస్వం కాదు
పారదర్శకత, నైతిక ప్రవర్తన కోసం స్వీయ నియంత్రణ విధానాన్ని దేశీయ అంకుర సంస్థలు అవలంబించాలని జీ20లో భారత తరపు ప్రధాన ప్రతినిధి (షెర్పా) అమితాబ్ కాంత్ తెలిపారు. -
మదుపర్ల అప్రమత్తత
ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం వెలువడనున్నందున, మదుపర్లు అప్రమత్తత పాటించారు. -
బీమా రంగంలోకి రూ.54,000 కోట్ల ఎఫ్డీఐ
గత తొమ్మిదేళ్లలో బీమా రంగం రూ.54,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ఆకర్షించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. -
బెంగళూరు- లక్షద్వీప్ విమాన సర్వీసు: ఇండిగో
లక్షద్వీప్కు విమాన సదుపాయాన్ని విస్తరించడంలో భాగంగా ఈనెల 31 నుంచి బెంగళూరు- అగత్తి మధ్య నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో సోమవారం వెల్లడించింది. -
మనవడికి రూ.240 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, తన మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి భారీ బహుమతి ఇచ్చారు. -
సంక్షిప్త వార్తలు
ఈ వేసవిలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అంతర్జాతీయ విమాన సర్వీసులను 20 శాతానికి పైగా పెంచనుంది. దేశ, విదేశీ మార్గాల్లో రోజువారీ 360కి పైగా విమాన సర్వీసులను నడపబోతోంది. -
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
WhatsApp payments: వాట్సప్లో పేమెంట్స్ ఇక మరింత సులువు కానుంది. చాట్ లిస్ట్లోనే ఇకపై క్యూఆర్ కోడ్ స్కానర్ కనిపించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు