Taxi services: త్వరలో ప్రభుత్వ అధికారులకు ఉబర్ సేవలు!
Taxi services: త్వరలో ఉబర్ సేవలు ప్రభుత్వ అధికారులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ విభాగాల్లో ట్యాక్సీ సేవలకు అత్యధిక డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఖర్చుని తగ్గించుకోవడం కోసం ప్రభుత్వం ఉబర్తో భాగస్వామ్య కుదుర్చుకొన్నట్లు తెలుస్తోంది.
దిల్లీ: క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ (Uber) సేవలను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో వివిధ మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉబర్ ట్యాక్సీలను (taxi services) బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వ ఈ-మార్కెట్ప్లేస్ పోర్టల్ (GeM), ఉబర్ మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరినట్లు ఓ అధికారి తెలిపారు. దీన్ని ఉబర్ (Uber) కంపెనీకి చెందిన ఒక ప్రతినిధి కూడా ధ్రువీకరించారు.
ప్రస్తుతం ఈ సేవలు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైనట్లు సదరు అధికారి తెలిపారు. త్వరలోనే వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు అందుబాటులోకి వస్తాయన్నారు. దశలవారీగా దీన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. స్థిర ధరల వద్ద ఉబర్ (Uber) ఈ సేవలను అందించనున్నట్లు వెల్లడించారు. క్యాన్సిలేషన్ ఛార్జీలు, ‘సర్జ్ ప్రైసింగ్’ ఉండవని తెలిపారు. జీఈఎం (GeM) పోర్టల్లో ఉబర్ ఇప్పటికే నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ వస్తువులు, సేవలను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం 2016లో జీఈఎంను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్లో పారదర్శకతను పెంపొందించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చింది.
వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు ట్యాక్సీ సేవల (taxi services) కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. ఉబర్ (Uber)తో భాగస్వామ్యం వల్ల అవి తగ్గుతాయని ప్రభుత్వం యోచిస్తోంది. జీఈఎం (GeM)లో క్యాబ్, ట్యాక్సీ సేవలకే అత్యధిక డిమాండ్ ఉంది. ఉబర్ (Uber) యాప్ ద్వారా సేవలను బుక్ చేసుకునే అధికారులను ఎంపిక చేసేందుకు ప్రతి విభాగంలో ఒకరిని ఎంపిక చేయనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. కొత్త వారిని చేర్చడం, ఉన్నవారిని తొలగించేందుకు వారికే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
క్యాబ్లో ప్రయాణించిన వారు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారి తెలిపారు. నేరుగా బిల్లులు సదరు ప్రభుత్వ విభాగానికి వెళతాయని పేర్కొన్నారు. మరోవైపు ఉబర్ (Uber) యాప్లో జీఈఎం యాత్ర హేచ్, జీఈఎం యాత్ర సెడాన్ విభాగాలను చేర్చినట్లు తెలిపారు. పలుచోట్ల ఆపాల్సిన అవసరం ఉన్నప్పుడు గంటల లెక్కన ట్యాక్సీని బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. -
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
Mark Zuckerberg: మార్కెట్లో ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ఆ స్థాయిలో ప్రొఫెషనల్స్ అందుబాటులో లేరు. దీంతో ఇతర కంపెనీల్లోని వారిని ఆకర్షించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. మెటా సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు సమాచారం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,186
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 73,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 22,186 దగ్గర కొనసాగుతోంది. -
ఈ 25 షేర్లు కొన్న రోజే ఖాతాలోకి వచ్చేస్తాయ్
ఇప్పటివరకు షేర్లు కొనుగోలు చేసినా, అమ్మినా.. అవి మన ఖాతాలో కనపడటం, ఇతరులకు బదిలీ కావడం మరుసటి ట్రేడింగ్ రోజున జరుగుతోంది. -
మన బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మోసాలు
గత 10 ఏళ్లలో భారతీయ బ్యాంకుల్లో రూ.5.3 లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. -
రిలయన్స్.. బ్యాంకింగ్ షేర్లు రాణించాయ్
దేశీయ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు తగ్గిన నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర చమురు సంస్థల షేర్లు దూసుకెళ్లడం, బ్యాంకింగ్, వాహన షేర్లు కొనుగోళ్లతో కళకళలాడటం, సానుకూల స్థూల గణాంకాలతో సెన్సెక్స్ 526 పాయింట్లు, నిఫ్టీ 119 పాయింట్లు పెరిగాయి. -
పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్!
బజాజ్ ఫైనాన్స్లో ఓ విభాగంగా ఉన్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్.. తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
కూకట్పల్లిలో 264 ఎకరాలు రూ.3402 కోట్లు!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్న 264.50 ఎకరాల భూమిని రూ.3402 కోట్లకు విక్రయించనున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జీఓసీఎల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. -
జీడీపీలో 2% వెచ్చిస్తే 1.1 కోట్ల ఉద్యోగాల సృష్టి
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో 2 శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల 1.1 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, ఈ ఉద్యోగాల్లో 70% వరకు మహిళలకే లభిస్తాయని ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. -
హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో 38% వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇళ్ల విక్రయాలు సగటున 14% వృద్ధి చెందాయని, సగటు ధరలూ 10-32% పెరిగినట్లు స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ తాజా నివేదికలో తెలిపింది. -
బాండ్ల ద్వారా రూ.7.5 లక్షల కోట్ల సమీకరణకు నిర్ణయం
2024-25 ఏప్రిల్-సెప్టెంబరులో మార్కెట్ ద్వారా రూ.7.5 లక్షల కోట్ల రుణాలను సమీకరించాలని కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. -
సనోఫి టీకాలను పంపిణీ చేయనున్న డాక్టర్ రెడ్డీస్
సనోఫి హెల్త్కేర్ ఇండియా టీకాలను మనదేశంలో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ పంపిణీ చేయనుంది. -
సంక్షిప్త వార్తలు(6)
జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా పనిచేసే డ్యూయిష్ ఎయిర్క్రాఫ్ట్తో హైదరాబాద్కు చెందిన సైయెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం