Credit Suisse: క్రెడిట్ సూయిజ్ కొనుగోలుకు యూబీఎస్ చర్చలు..!
క్రెడిట్ సూయిజ్ను సంక్షోభం నుంచి బయటపడేయడానికి స్విస్ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకొంటోంది. ఈ క్రమంలో భాగంగా ఆ సంస్థ వ్యాపారాలను మరో దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ కొనుగోలు చేసేలా ఓ డీల్ను సిద్ధం చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: దివాల అంచున కొట్టుమిట్టాడుతున్న స్విస్ దిగ్గజ బ్యాంక్ క్రెడిట్ సూయిజ్(Credit Suisse)ను కొనుగోలు చేసేందుకు యూబీఎస్(UBS) గ్రూప్ ఏజీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. క్రెడిట్ సూయిజ్ (Credit Suisse) సంస్థ మొత్తాన్ని లేదా.. కొన్ని వ్యాపారాలను కొనుగోలు చేసే మార్గాలను ఈ గ్రూప్ అన్వేషిస్తోంది. స్విస్ అధికారుల ప్రోద్బలంతోనే యూబీఎస్ ఈ దిశగా అడుగులు వేస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఓ ఆంగ్ల వార్త సంస్థకు వెల్లడించారు. ఈ వారాంతంలో రెండు బ్యాంకుల బోర్డులు స్విస్ నేషనల్ బ్యాంక్, అక్కడి నియంత్రణ సంస్థ ఫిన్మాతో వేర్వేరుగా భేటీ అయి చర్చలు జరపనున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికి ఈ రెండు బ్యాంకుల మధ్య డీల్ ప్రకటించాలనే లక్ష్యంతో ఈ వ్యవహారం ముందుకు నడుస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వారం క్రెడిట్ సూయిజ్ (Credit Suisse) సంస్థ ఆర్థికంగా బలహీనంగా ఉందనే విషయం బయటకు రావడం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలను సృష్టించింది. దీంతో స్విస్ ప్రభుత్వం, కేంద్ర బ్యాంక్, ఫిన్మా రంగంలోకి దిగి సంస్థను ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటవేయడానికి యత్నాలను మొదలుపెట్టాయి. ఈ క్రమంలో బ్యాంక్ స్విస్ విభాగాన్ని వేరుచేయడం, యూబీఎస్తో డీల్ కుదర్చడం వంటి అంశాలపై దృష్టిపెట్టాయి.
క్రెడిట్ సూయిజ్లో ప్రధాన వాటాదారైన సౌదీ నేషనల్ బ్యాంక్ ఛైర్మన్ అమ్మర్ అల్ కుదైరీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రెగ్యులేటరీ ఇబ్బందుల కారణంగా క్రెడిట్ సూయిజ్లో పెట్టుబడి పెట్టబోమని పేర్కొన్నారు. దీంతో క్రెడిట్ సూయిజ్ స్టాక్ ధర పతనమైంది. 2021 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఈ షేరు 85 శాతం మేర కుంగిపోయింది. ఈ పతనం ఒక్క క్రెడిట్ సూయిజ్కే పరిమితం కాలేదు. యూరోపియన్ మార్కెట్లలో ఇతర బ్యాంకులపైనా పడింది.
స్విస్ సెంట్రల్ బ్యాంక్ నుంచి 54 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.43 లక్షల కోట్ల) రుణం పొందడం ద్వారా తమ ఆర్థిక మూలాలను బలోపేతం చేసుకుంటున్నట్లు గురువారం క్రెడిట్ సూయిజ్ వెల్లడించడంతో, బ్యాంక్ షేరు 30% మేర పుంజుకొంది. కానీ, నిన్న ఈసీబీ వడ్డీరేట్లను మళ్లీ పెంచడంతో క్రెడిట్ సూయిజ్ షేరు ధర మరోసారి 10శాతం వరకు పతనమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు