Credit Suisse: క్రెడిట్ సూయిజ్ పతనానికి ‘యూబీఎస్’తో విరుగుడు!
UBS to buy Credit Suisse: బ్యాంకింగ్ వ్యవస్థలో మరింత అస్థిరతను నివారించడం కోసం ఈ కీలక ఒప్పందం దోహదం చేస్తుందని నిపుణులు ఆశిస్తున్నారు.
జెనీవా: ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న స్విట్జర్లాండ్ బ్యాంక్ క్రెడిట్ సూయిజ్ (Credit Suisse)ను కొనుగోలు చేసేందుకు ఆ దేశంలోని దిగ్గజ బ్యాంకు యూబీఎస్ ముందుకు వచ్చింది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ 3.2 బిలియన్ డాలర్లు. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తోన్న ఆందోళనలకు తెరపడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వమే ముందుండి..
క్రెడిట్ సూయిజ్ (Credit Suisse) పతనం ఖాయమనే విషయం ఇటీవలే తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దాన్ని రక్షించేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం సహా ఆ దేశ నియంత్రణా సంస్థలు తీవ్రంగా కృషి చేశాయి. అందులో భాగంగా యూబీఎస్తో చర్చలు జరిపాయి. ఎట్టకేలకు ఒప్పందం ఖరారయ్యేలా చూశాయి. 166 ఏళ్ల చరిత్ర ఉన్న క్రెడిట్ సూయిజ్ ఒకప్పుడు స్విట్జర్లాండ్ ప్రతిష్ఠకు మకుటంలా నిలిచింది. అలాంటిది గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఇది కేవలం స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవస్థకేగాక యావత్ ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థను కుదుపులకు లోను చేసే అవకాశం ఉందని ప్రభుత్వం గ్రహించింది.
(ఇదీ చదవండి: నివురుగప్పిన ముప్పు..మరో పెను సంక్షోభాన్ని పొదుగుతున్న అమెరికా..!)
ఒకప్పుడు స్విస్ ప్రతిష్ఠకు మకుటం..
స్విట్జర్లాండ్ రైల్ నెట్వర్క్కు నిధులు సమకూర్చడమే లక్ష్యంగా 1856లో క్రెడిట్ సూయిజ్ (Credit Suisse) ఏర్పాటైంది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆర్థిక రంగంలో కీలక సంస్థగా మారింది. ఓ దశలో అమెరికా దిగ్గజమైన జేపీ మోర్గాన్ చేజ్తో పోటీ పడింది. కానీ, గతకొన్ని దశాబ్దాలుగా అనేక కుంభకోణాలు ఈ బ్యాంకులో వెలుగులోకి వచ్చాయి. సమస్యల నుంచి గట్టెక్కించే సంస్కరణల ఫలాల్ని నిర్వహణ లోపాలు నీరుగార్చాయి. మరోవైపు అనేక వివాదాలు చుట్టుముట్టి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఫలితంగా సంస్థ ప్రతిష్ఠ మసకబారింది. ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లింది.
ఎస్వీబీతో తెరపైకి..
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనంతో అందరి కళ్లూ క్రెడిట్ సూయిజ్ (Credit Suisse)పైకి మళ్లాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న సౌదీ నేషనల్ బ్యాంక్.. ఇకపై క్రెడిట్ సూయిజ్కు నిధులు సమకూర్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆందోళన తీవ్రమైంది. స్టాక్ మార్కెట్లలోని షేర్ల పతనం ఊపందుకుంది. స్విస్ కేంద్ర బ్యాంకు ఆఫర్ చేసిన 54 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం సైతం ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపలేకపోయింది. చేసేదిలేక ప్రభుత్వమే రంగంలోకి దిగింది.
వడ్డీరేట్ల పెంపు గందగోళానికి సాక్షి..
క్రెడిట్ సూయిజ్ (Credit Suisse) ప్రపంచంలోనే కీలక 30 బ్యాంకుల్లో ఒకటి. కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపుతో ఆర్థిక వ్యవస్థలో ప్రారంభమైన గందరగోళానికి ఇది సాక్షిగా నిలిచింది. కఠిన విధాన నిర్ణయాల ప్రతికూల ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, తాజా డీల్ వల్ల ఉన్నపళంగా బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం మాత్రం తప్పిందని విశ్లేషిస్తున్నారు.
బ్యాంకులు స్విట్జర్లాండ్కు కీలకం..
2008 నాటి ఆర్థిక సంక్షోభానికి ముందుకు క్రెడిట్ సూయిజ్ (Credit Suisse) ఆస్తులు 1 ట్రిలియన్ డాలర్లుగా ఉండేవి. అవి ప్రస్తుతం 580 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఈ బ్యాంకు మిగిలిన వాటికి భిన్నంగా 2008 నాటి ఆర్థిక సంక్షోభం సమయంలో ఎలాంటి బెయిలవుట్ ప్యాకేజీ అవసరం లేకుండానే మనుగడ సాగించడం విశేషం. అలాంటిది ఇప్పుడు కష్టాల్లో కూరుకుపోవడం స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి పెద్ద దెబ్బే. ఆ దేశంలో 243 బ్యాంకింగ్ గ్రూపులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 24 విదేశీ బ్యాంకుల శాఖలు ఉన్నాయి. ఇలా ఆ దేశానికి ఆర్థిక పరిశ్రమ చాలా కీలకంగా మారింది. యూబీఎస్, క్రెడిట్ సూయిజ్ ఆస్తులే.. ఆ దేశ జీడీపీ కంటే రెట్టింపు కావడం గమనార్హం.
యూబీఎస్- క్రెడిట్ సూయిజ్ ఒప్పందంలోని కీలకాంశాలు..
- క్రెడిట్ సూయిజ్ పూర్తి షేర్లను 3 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్తో యూబీఎస్ కొనుగోలు చేస్తుంది.
- దీని కోసం 100 బిలియన్ ఫ్రాంక్ల క్రెడిట్ లైన్ను స్విస్ నేషనల్ బ్యాంక్ సమకూరుస్తుంది.
- క్రెడిట్ సూయిజ్ ఆస్తుల వల్ల సంభవించబోయే నష్టాలకుగానూ స్విస్ ప్రభుత్వం 9 బిలియన్ ఫ్రాంక్ల గ్రాంట్ ద్వారా పూచీకత్తు అందజేస్తుంది.
- 16 బిలియన్ ఫ్రాంక్లు విలువ చేసే క్రెడిట్ సూయిజ్ బాండ్లు విలువను కోల్పోతాయి.
- క్రెడిట్ సూయిజ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగాన్ని యూబీఎస్ క్రమంగా కుదిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె