Aadhaar: ఆధార్ ధ్రువీకరణ.. రాష్ట్రాలకు ఉడాయ్ కీలక సూచన!
నకిలీ ఆధార్లకు అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను ఉడాయ్ కీలక సూచన చేసింది. దీంతో ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించడంతోపాటు, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరడంలో పారదర్శకత ఉంటుందని తెలిపింది.
దిల్లీ: ఆధార్ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు, సంబంధిత సంస్థలకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI)) కీలక సూచన చేసింది. ఈ మేరకు ఆధార్ను భౌతికంగా లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆమోదించడానికి ముందు దాన్ని ధ్రువీకరణను తనిఖీ చేయాలని కోరింది. ఈ-ఆధార్, ఆధార్ లెటర్, ఆధార్ పీవీసీ, ఎం-ఆధార్.. ఇలా ఏ పద్ధతిలోనైనా వ్యక్తిగతంగా ఆధార్ను సమర్పిస్తే, ఆధార్ నంబర్ సాయంతో అది అసలైనదా? నకిలీదా? అనేది తనిఖీ చేయాలని ఉడాయ్ కోరింది. ఈ ప్రక్రియవల్ల ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతతోపాటు, నకిలీ ఆధార్లను నియంత్రించవచ్చని ఉడాయ్ భావిస్తోంది. ఈ మేరకు ఆధార్ ధ్రువీకరణ అవసరాన్ని వివరిస్తూ.. అందుకు రాష్ట్రాలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
- ఎవరైనా తమ పేరు, వయస్సు, చిరునామా ధ్రువీకరణ పత్రంగా ఆధార్ సమర్పిస్తే, దాన్ని అనుమతించకుండా.. ఆధార్ నంబర్తో అందులోని వివరాలు సరిచూడాలని సూచించింది. ఆన్లైన్తోపాటు, ఆఫ్లైన్లోను ఆధార్ తనిఖీ చేయవచ్చని తెలిపింది.
- ఇందుకోసం ఎమ్ఆధార్ (mAashaar) యాప్, క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్తో వెరిఫై చేయొచ్చని వెల్లడించింది. ఎమ్ఆధార్ యాప్లో వెరిఫై ఆధార్ సెక్షన్లోకి వెళ్లి ఆధార్ నంబర్ టైప్ చేస్తే యాక్టివ్లో ఉందో? లేదో? చూపిస్తుంది.
- మొబైల్లో క్యూఆర్ కోడ్ ఆన్ చేసి ఆధార్ కార్డ్పై ఉన్న కోడ్ను స్కాన్ చేసినా.. ఆధార్ వివరాలు కనిపిస్తాయి. ఆ వివరాలు, ఆధార్ కార్డ్పై ఉన్న వివరాలతో సరిపోలితే.. ఆ కార్డు ఒరిజినల్ అని భావించాలి. ఒకవేళ వివరాలు సరిపోలకుంటే అది నకిలీ కార్డుగా పరిగణించాలి.
- అనుమతి లేకుండా మార్పులు చేయడం, నకిలీ ఆధార్ సృష్టించడం వంటివి ఆధార్ చట్టం సెక్షన్ 35 ప్రకారం శిక్షార్హమైన నేరాలుగా ఉడాయ్ పేర్కొంది. అసాంఘిక శక్తులు అనైతిక అంశాల్లో ఆధార్ను ఉపయోగించకుండా అడ్డుకునేందుకు రాష్ట్రాలు ఈ సూచనలు అనుసరించాలని కోరింది.
- ఆధార్ కేవలం12 అంకెల నంబర్తో ఉన్న కార్డుగా మాత్రమే కాకుండా, విశిష్ఠ గుర్తింపు పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు ఖాతాలు, సిమ్కార్డు కొనుగోలు ఇలా ప్రతి పనికి ఆధార్ తప్పనిసరైంది. సుమారు వెయ్యికిపైగా ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పథకాల అమలులో ఆధార్ ధ్రువీకరణ అనుమతించే దిశగా రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు ఉడాయ్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం