Unacademy Layoffs: అన్అకాడమీలో మరో 12% ఉద్యోగుల తొలగింపు
Unacademy Layoffs: వ్యయనియంత్రణ చర్యల్లో భాగంగా అన్అకాడమీ మరో 380 మంది ఉద్యోగులను తొలగించింది. గత ఏడాది వ్యవధిలో ఇలా ఉద్యోగులను తొలగించడం ఇది నాలుగోసారి.
దిల్లీ: సాఫ్ట్బ్యాంకు పెట్టుబడులున్న ఎడ్టెక్ సంస్థ అన్అకాడమీ (Unacademy) మరో 380 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 12 శాతానికి సమానం. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
2021లో భారీగా పెట్టుబడులను ఆకర్షించిన విద్యాసాంకేతిక రంగానికి.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో, నిధుల రాక నెమ్మదించొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల సిబ్బంది వ్యయాలను తగ్గించుకోవాలని అన్అకాడమీ (Unacademy) నిర్ణయించుకుందని సమాచారం. కంపెనీ లాభదాయకత దిశగా పయనించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ సీఈఓ గౌరవ్ ముంజల్ తెలిపారు. అయినప్పటికీ.. మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని పేర్కొన్నారు. 12 శాతం సిబ్బంది తగ్గించాలని నిర్ణయించామన్నారు.
అన్అకాడమీ (Unacademy) ఇలా ఉద్యోగులను తొలగించడం ఏడాది వ్యవధిలో ఇది నాలుగోసారి. చివరిసారి గత ఏడాది నవంబరులో 350 మందిని తొలగించింది. అంతుకుముందు ఏప్రిల్లో 600 మందిని లేఆఫ్ చేసింది. మరోవైపు అనుబంధంగా పనిచేస్తున్న కోడ్చెఫ్ సంస్థను పూర్తిగా తమ వ్యాపారం నుంచి వేరు చేసింది. ప్రస్తుతం కోడ్చెఫ్ పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తోంది. అయితే, దాంట్లో అన్అకాడమీకి ఉన్న 30 శాతం వాటా మాత్రం కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమాఅందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.