Govt vs RBI: ఉర్జిత్పై మోదీ ఆగ్రహం.. పాముతో పోలిక: పుస్తకంలో సుభాష్ గార్గ్
నాటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్పై ప్రధాని మోదీ ఆగ్రహించారని, ఆయనను పాముతో పోల్చారని సుభాష్ గార్గ్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
దిల్లీ: గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), భారత ప్రభుత్వం (Govt) మధ్య పొడచూపిన వివాదాల గురించి తాజాగా మరో పుస్తకంలో ప్రచురితమైంది. ఆర్బీఐ నిధుల బదిలీ గురించి ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య తన పుస్తకంలో ప్రస్తావించగా.. తాజాగా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అందులో మరో కోణాన్ని బయటపెట్టారు. ఉర్జిత్ పటేల్ (Urjit Patel) గవర్నర్గా ఉన్నప్పుడు ఆర్బీఐ అనేక అంశాల్లో ప్రభుత్వంతో విభేదించిందని పేర్కొన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్లు, డిజిటల్ పేమెంట్స్ వంటి విషయాల్లో ఆర్బీఐ అడ్డుపుల్ల వేసిందని తెలిపారు. ఈ మేరకు ‘వియ్ ఆల్సో మేక్ పాలసీ’ పేరిట ఆయన రాసిన పుస్తకంలో పలు విషయాలు పేర్కొన్నారు.
2017-2019 మధ్య సుభాష్ గార్గ్ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. పంటలకు మద్దతు ధర, ఎలక్ట్రోరల్ బాండ్స్, బ్యాంకులకు నిధుల సమకూర్చడం, ఎయిర్ పోర్టుల మానిటైజేషన్ వంటి అంశాల్లో కీలకంగా వ్యవహరించారు. తాజాగా ఆయన అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్కు ప్రభుత్వానికి మధ్య ఉన్న విభేదాలను తన పుస్తకంలో ప్రస్తావించారు. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల్లో విభేదించడంతో పాటు కొన్ని విషయాల్లో నాడు ఆర్బీఐ ఏకపక్షంగా వ్యవహరించిందని గార్గ్ పేర్కొన్నారు. పేమెంట్ సిస్టమ్ డేటా లోకలైజేషన్ విషయంలో పూర్తి ఏకపక్షంగా ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. అదే విధంగా ఆర్బీఐ నగదు నిల్వలను ప్రభుత్వానికి బదిలీ చేసే విషయంలోనూ పటేల్ అయిష్టత కనబరిచారని గార్గ్ పేర్కొన్నారు.
ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినా ఆర్బీఐ తలొగ్గలేదు: విరాల్ ఆచార్య
‘‘దేశ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న సమయంలో 2018 సెప్టెంబర్లో దేశ ఆర్థిక పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ప్రధాని ఉర్జిత్ పట్ల ఆగ్రహంగా చూశారు. అంతటి కోపం నేను ఎప్పుడూ చూడలేదు. నిరర్థక ఆస్తుల విషయంలో ఆర్బీఐ వైఖరి, పరిష్కారాలను కనుగొనడంలో ఆర్బీఐ అస్థిరమైన విధానాలను మోదీ తప్పుబట్టారు. అదే సమయంలో ఉర్జిత్ పటేల్ చేసిన ఎల్టీసీజీ ట్యాక్స్ను ఉపసంహరణ ప్రతిపాదననూ మోదీ వ్యతిరేకించారు ’ అని గార్గ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే ఆర్బీఐ నిల్వలలను ఎందుకూ వినియోగించడానికి వీల్లేని విధంగా ‘డబ్బుల గుట్టపై కూర్చున్న పాము’లా ఉర్జిత్ను మోదీ పోల్చారని గార్గ్ పేర్కొన్నారు.
ప్రభుత్వానికి చెప్పకుండానే రాజీనామా
ఒకరోజు తాను నార్త్ బ్లాక్లో మీటింగ్ పూర్తి చేసుకుని తన రూమ్లోకి వచ్చేటప్పుడు.. ఉర్జిత్ రాజీనామా వార్త తాను టీవీల్లో చూశానని పేర్కొన్నారు. రాజీనామా విషయంలోనూ ఆయన నిబంధనలు పాటించలేదన్నారు. ప్రభుత్వానికి రాజీనామా లేఖ పంపించకుండా ఆర్బీఐ వెబ్సైట్లో ఆ ప్రతిని ఉంచి ఆయన ఇంటికెళ్లిపోయారని, వ్యక్తిగత కారణాలతో వైదొలుగుతున్నట్లు అందులో పేర్కొన్నారని గార్గ్ తెలిపారు. నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సైతం ఈ విషయంలో ముందస్తు సమాచారం లేదని తెలిపారు. ఆయన సైతం వెంటనే రాజీనామాకు ఆమోదం తెలిపారని గార్గ్ తన పుస్తకంలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 20,120
Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 77 పాయింట్ల లాభంతో 66,979 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 26 పాయింట్లు పెరిగి 20,123 వద్ద కొనసాగుతోంది. -
మదుపర్ల సంపద @ 4 లక్షల కోట్ల డాలర్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో మరో రికార్డు నమోదైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ)లో నమోదైన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మొదటిసారిగా 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయికి చేరింది. -
ప్రపంచ అగ్రగామి 20 మంది కుబేరుల్లోకి అదానీ
గౌతమ్ అదానీ.. అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ ఇచ్చిన ఒకే ఒక్క నివేదికతో భారీ స్థాయిలో సంపదను కోల్పోయిన వ్యక్తి. ఈ ఏడాది మొదట్లో ప్రపంచ అగ్రగామి కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న ఆయన, హిండెన్బర్గ్ నివేదిక అనంతరం నెల రోజుల్లోనే.. -
స్థిరాస్తిలోకి వచ్చే ఏడాది భారీ పెట్టుబడులు
ఆసియా పసిఫిక్ ప్రాంతం (ఏపీఏసీ)లో భారత్, దక్షిణ కొరియాలలోని వివిధ స్థిరాస్తి ప్రాజెక్టుల్లోకి విదేశీ పెట్టుబడులు వస్తాయని స్థిరాస్తి కన్సల్టెంట్ సంస్థ కొలియర్స్ ఇండియా అంచనా వేసింది. -
వచ్చే ఏడాది ప్రపంచం మందగమనమే
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ఆశ్చర్యకరరీతిలో బలంగానే కనిపించినా.. వచ్చే ఏడాది మాత్రం మందగమనం పాలు కావొచ్చని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా వేస్తోంది. -
డిజిటల్ లావాదేవీలు పెరిగినా నగదు దాచుకోవడం కొనసాగుతోంది
కొవిడ్-19 పరిణామాల అనంతరం డిజిటల్ లావాదేవీలు పుంజుకోవడం వల్ల, దేశంలో భౌతిక రూపంలో నగదు వినియోగానికి గిరాకీ నెమ్మదించింది. అయితే పొదుపు, అత్యవసరాల కోసం ముందుజాగ్రత్తగా దాచిపెట్టుకునే విషయంలో.... -
2030కి రూ.29 లక్షల కోట్లకు దేశీయ ఐటీ రంగం
దేశీయ ఐటీ రంగం 2030 నాటికి 350 బిలియన్ డాలర్ల (సుమారు రూ.29 లక్షల కోట్ల) స్థాయికి చేరే అవకాశం ఉందని అక్సిలార్ వెంచర్స్ ఛైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ అంచనా వేశారు. -
రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు మెరుగ్గానే ఉండొచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో మనదేశ వృద్ధి రేటు మెరుగ్గానే ఉండే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ బుధవారం తెలిపారు. -
వారెన్ బఫెట్ వ్యాపార భాగస్వామి చార్లీ మంగర్ కన్నుమూత
అమెరికా దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్కు కుడిభుజంగా, ఆయన సంస్థ బెర్క్షైర్ హాతవేకు వైస్ఛైర్మన్గా వ్యవహరించిన చార్లీ మంగర్(99) కన్నుమూశారు. దీంతో అమెరికా కార్పొరేట్ రంగంలో ఒక శకం ముగిసింది. -
ఉపగ్రహ ప్రయోగాలకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సిద్ధం
ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విడిభాగాలు అందించే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్(టీఏఎస్ఎల్), నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ-శాటెల్లాజిక్ ఇంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. మనదేశంలో స్పేస్ టెక్నాలజీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీఏఎస్ఎల్ వెల్లడించింది. -
భారతీయ సంస్థలతో భాగస్వామ్యానికి ఐఏజీ కార్గో ఆసక్తి
భారత్లో వృద్ధి అవకాశాలపై సానుకూల ధోరణితో ఉన్న ఐరోపా దిగ్గజ సంస్థ ఐఏజీ కార్గో, ఇక్కడి క్యారియర్లు, లాజిస్టిక్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు ఆసక్తిగా ఉంది. ఇక్కడి సంస్థల నుంచి సరైన -
రూ.45,000 కోట్ల ఖనిజాల వేలం
రూ.45,000 కోట్ల విలువైన 20 కీలక ఖనిజాల వేలాన్ని బొగ్గు, ఖనిజాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం ప్రారంభించారు. ఇందులో రెండు లిథియం బ్లాక్(జమ్ము-కశ్మీర్, చత్తీస్గఢ్)లు కూడా ఉన్నాయని ఆయన వివరించారు. -
సంక్షిప్త వార్తలు
సంస్థలకు క్లౌడ్, ఏఐతో పాటు ఆధునిక సాంకేతిక సేవలను అందించే సీ1 (కన్వర్జ్వన్) హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్, కేపబిలిటీ సెంటర్ (జీఐసీసీ)ని 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. -
LIC Jeevan Utsav: ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం
LIC jeevan utsav full details: ఎల్ఐసీ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఐదేళ్లు కడితే జీవితాంతం 10 శాతం చొప్పున గ్యారెంటీ ఆదాయం పొందొచ్చు. -
Smart watches: SOS సదుపాయంతో నాయిస్ రెండు కొత్త వాచ్లు
Noise Smart watches: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ నాయిస్ SOS కనెక్టివిటీతో రెండు సరికొత్త స్మార్ట్వాచ్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి...


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 20,120
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
AP Liquor: బ్రాండ్ విచిత్రం.. పురుగు ఉచితం!
-
Kidnap: 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
-
YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?
-
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?