UNDP: 52 దేశాలు అప్పుల బాధల్లో..! ఐరాస విభాగం హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు ఆర్థిక కష్టాల్లో చిక్కుకుపోయినట్లు ఐరాస అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) చీఫ్ అచిమ్ స్టెయినర్ తెలిపారు. అవి ప్రభుత్వ ఆదాయంలో అధిక శాతం రుణాల నిర్వహణకే ఖర్చు చేస్తున్నాయని చెప్పారు.
దోహ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం(Recession) భయాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం 52 దేశాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు ఐరాస అభివృద్ధి కార్యక్రమం(UNDP) అధిపతి అచిమ్ స్టెయినర్ వెల్లడించారు. రుణ చెల్లింపు సమస్యల(Debt Distress)ను ఎదుర్కొంటున్న ఈ దేశాలకు సాయం చేసేందుకు అత్యవసర చర్యలు అవసరమని పేర్కొన్నారు. మొత్తం 52 దేశాల్లోని 25 దేశాలు.. ప్రభుత్వ ఆదాయంలో అయిదో వంతు కంటే ఎక్కువ కేవలం రుణాల నిర్వహణకే ఖర్చు చేస్తున్నాయని చెప్పారు. 46 అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశాల(LDCs) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా స్టెయినర్ ఈ మేరకు మాట్లాడారు.
‘జాతీయ రుణాల విషయంలో ప్రస్తుతం అభివృద్ధి చెందుతోన్న దేశాల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. యూఎన్డీపీ అంచనా ప్రకారం.. 52 దేశాలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. వాటిలో కొన్ని దివాలా తీసేందుకు ఒక అడుగు దూరంలోనే ఉన్నాయి. ఈ దేశాల విదేశీ రుణాల విలువ అంతర్జాతీయ విదేశీ రుణంలో కేవలం మూడు శాతం మాత్రమే. కానీ, ఈ దేశాలు ప్రపంచ జనాభాలో ఆరోవంతు కలిగి ఉన్నాయి. అయినప్పటికీ.. ఆర్థిక మార్కెట్లు ఈ దేశాలపై తగినంత శ్రద్ధ చూపడం లేదు’ అని స్టెయినర్ చెప్పారు. ఈ 52 దేశాల్లో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, అర్జెంటీనా, ఉక్రెయిన్లతోపాటు సబ్-సహారా ఆఫ్రికా, లాటిన్ అమెరికా తదితర ప్రాంతాల్లోని దేశాలున్నాయి.
‘రుణాల పునర్వ్యవస్థీకరణతోపాటు ఆర్థిక సాయం చేసేందుకు అత్యవసర మార్గాలను అన్వేషించాలని మేం ఇప్పటికే స్పష్టంగా పిలుపునిచ్చాం. లేనిపక్షంలో ఒక దేశం తర్వాత మరో దేశం అప్పుల్లో చిక్కుకుపోతాయి’ అని స్టెయినర్ హెచ్చరించారు. ‘ఉక్రెయిన్లో యుద్ధంతో ఆహార, ఇంధన ధరలపై ప్రభావం పడుతోంది. పెరుగుతున్న ఇంధన వ్యయాలు.. అప్పుల్లో కూరుపోయిన దేశాలకు షాక్గా పరిణమిస్తున్నాయి. ద్రవ్యోల్బణం ప్రభావం వడ్డీ రేట్లను పెంచుతోంది’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. కరోనా పరిస్థితులు, పెరుగుతోన్న ఆహార, ఇంధన వ్యయాలు, ఆర్థిక సంక్షోభాల కారణంగా పేద దేశాల రుణాలు గత దశాబ్ద కాలంలో రెట్టింపు అయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్