ఆదాయపన్ను చెల్లింపు దారులకు దక్కని ఊరట
కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభలో ప్రవేశ పెట్టారు.
దిల్లీ: కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభలో ప్రవేశ పెట్టారు. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఐటీ రిటర్న్ దాఖలుకు మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం తాజా నిర్ణయంతో పింఛను, వడ్డీతో జీవించే వారికి ఐటీ రిటర్న్ దాఖలు నుంచి మినహాయింపు లభించనుంది. ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పన్ను చెల్లింపు దారులను కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసింది.
పన్ను వివాదాల నివారణకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.50లక్షల లోపు ఆదాయం, రూ.10లక్షల లోపు వివాదాలు ఉన్నవారు నేరుగా కమిటీకి అప్పీల్ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆదాయపన్ను చెల్లింపు దారుల సంఖ్య 6.48 కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. పన్ను వివాదాల స్పందన కాలపరిమితి 6 నుంచి మూడేళ్లకు తగ్గిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇవీ చదవండి...
కొవిడ్ వ్యాక్సినేషన్కు రూ. 35వేల కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె