Budget 2023: పేపర్లెస్ బడ్జెట్ కోసం ప్రత్యేక యాప్.. ఫీచర్లివే..! ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
పార్లమెంట్లో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అందులోని సమాచారం సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు కేంద్రం ప్రత్యేకంగా యూనియన్ బడ్జెట్ అనే వెబ్సైట్, యాప్ను తీసుకొచ్చింది.
దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న బడ్జెట్ 2023-24 (Budget 2023)ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఐదోసారి. గత రెండు విడతల్లో మాదిరే ఈ సారి కూడా పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తయారుచేసిన ట్యాబ్ ద్వారా మంత్రి బడ్జెట్ను చదివి వినిపించనున్నారు. పార్లమెంట్లో మంత్రి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా అందులోని సమాచారం సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేందుకు యూనియన్ బడ్జెట్ (Union Budget) అనే వెబ్సైట్తోపాటు, యాప్ను కేంద్రం తీసుకొచ్చింది. మరి, ఈ యాప్ ద్వారా బడ్జెట్ ప్రతులను ఎలా చూడొచ్చు? అందులో ఏయే వివరాలు ఉంటాయనేది చూద్దాం.
- ఆర్థిక మంత్రి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత యాప్లో బడ్జెట్ పీడీఎఫ్ ప్రతులు విడుదల చేస్తారు. వాటితోపాటు మంత్రి పూర్తి బడ్జెట్ ప్రసంగం, డిమాండ్ ఫర్ గ్రాంట్స్ (DG), ఫైనాన్స్ బిల్లులు, కేటాయింపులు సహా మొత్తం బడ్జెట్కు సంబంధించిన డాక్యుమెంట్లను ఈ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఈ యాప్లో బడ్జెట్ హైలైట్స్ పేరుతో సెక్షన్ ఉంటుంది. ఇందులో మంత్రి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా అందులోని ముఖ్యాంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన తర్వాత ప్రసంగానికి సంబంధిన పూర్తి డాక్యుమెంట్లను సైతం ఇందులో అందుబాటులో ఉంటాయి.
ఎవరు డిజైన్ చేశారు?
డిజిటల్ ఇండియా స్ఫూర్తితో ఆర్థిక వ్యవహారాల శాఖ (DEA) సూచనలతో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) బడ్జెట్ యాప్ను డిజైన్ చేసింది. ఆరోగ్యసేతు (Arogya Setu), ఈకోర్ట్ సర్వీసెస్ (eCourt Services), మైగవర్నమెంట్(MYGOV) వంటి యాప్లను ఎన్ఐసీ డిజైన్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఓఎస్లకు అనుగుణంగా ఈ యాప్ను తీర్చిదిద్దింది.
యాప్ డౌన్లోడ్ ఎలా ?
యూనియన్ బడ్జెట్ యాప్ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేసే ముందు అది ఎన్ఐసీ రూపొందించి యాప్ అవునా? కాదా? అనేది తప్పనిసరిగా సరిచూసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మస్క్(Elon Musk) భారత్ పర్యటన మరింత ఆలస్యం కానుంది. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా