డేటా అయిపోతుందని సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం లేదా? ఈ నష్టాల గురించి తెలుసా?
Software update: మొబైల్ ఫోన్కు ఎప్పటికప్పుడు వచ్చే కొత్త సాప్ట్వేర్కి అప్డేట్ చేస్తున్నారా? ఒకవేళ చేయకపోతే కలిగే నష్టాలేంటో తెలుసుకోండి..
ఇంటర్నెట్డెస్క్: స్మార్ట్ఫోన్.. ఇప్పుడిది అందరి జీవితంలోనూ భాగమైపోయింది. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనేంత వరకు చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఎక్కువ సమయం ఇందులోనే గడిపేస్తున్నారు. ఇలా తరచూ వాడే ఫోన్లలో ఛార్జింగ్ ఉందా? డేటా సరిపోతుందా? అని చెక్ చేసుకుంటారే తప్ప.. ఎప్పటికప్పుడు వచ్చే కొత్త సాప్ట్వేర్ను అప్డేట్ (Software update) చేయాలని మాత్రం మనలో చాలామంది అనుకోరు. ఒకవేళ ‘అప్డేట్ యువర్ డివైజ్’ అని వచ్చినా.. ‘తర్వాత చూసుకుందాంలే’ అని పక్కన పెట్టేస్తుంటారు. మరికొందరైతే ‘ఇప్పుడు అప్డేట్ చేస్తే డేటా అంతా తినేస్తుంది. పడుకొనే ముందు మిగిలిపోయిన డేటాతో అప్డేట్ చేద్దాంలే’ అనుకునే వారే మనలో ఎక్కువ. అయినా అప్డేట్ చేయనంత మాత్రాన నష్టం ఏముంది అనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!
కొత్త ఫీచర్లు కోల్పోతాం: రోజులు మారుతున్న కొద్దీ సాంకేతికతలో మార్పులు సహజం. అలాగే మన మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటాయి. అలాగే పాత వాటిలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేసి మెరుగులు దిద్దుతుంటాయి. ఇందులో కొన్ని సెక్యూరిటీకి సంబంధించినవీ ఉంటాయి. ఈ కొత్త ఫీచర్లు అందుకోవాలీ అంటే మనకొచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.
ఫోన్ వేగం తగ్గొచ్చు: చాలా వరకు ఫోన్ తయారీ కంపెనీలు తరచూ సాప్ట్వేర్ అప్డేట్లను ఇస్తుంటాయి. ఇవి మొబైల్ పనితీరు మొరుగవ్వటానికి, ఫోన్ ఎక్కువ కాలం పనిచేయటానికి ఉపయోగపడతాయి. అప్పుడప్పుడు మన ఫోన్ వేగం తగ్గడం గమనిస్తూ ఉంటాం. సాప్ట్వేర్ అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ చేసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంటుంది.
బ్యాటరీ లైఫ్ మెరుగు: మొబైల్ కంపెనీలు విడుదల చేసే సాఫ్ట్వేర్ అప్డేట్స్లో కెమెరా పనితీరును మరింత మెరుగుపరచటంతో పాటు బ్యాటరీ లైఫ్నూ పెంచే అప్డేట్స్ ఉంటాయి. బ్యాటరీపై ఒత్తిడిని తగ్గించేందుకు మొబైల్ కంపెనీలు సాఫ్ట్వేర్ అప్డేట్ను ఇస్తుంటాయి. ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే బ్యాటరీ పనితీరుపై ప్రభావం పడి దాని జీవితకాలం తగ్గుతుంది.
సైబర్ దాడుల నుంచి రక్షణ: సెక్యూరిటీ అప్డేట్ అనేది మన ఫోన్పై జరిగే హానికరమైన దాడుల నుంచి రక్షణ కల్పించడానికి సాయపడుతుంది. మన ఫోన్లలో ఉండే బగ్స్ కారణంగా ఒక్కోసారి సైబర్ దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన స్మార్ట్ఫోన్ అప్డేట్గా లేకపోతే సైబర్ నేరగాళ్లు మాల్వేర్ను మన ఫోన్లో జొప్పించే ప్రమాదం ఉంటుంది. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్డేట్లను ఇస్తుంటాయి. దీనివల్ల ఇంటర్ఫేస్లో మార్పులు ఉండవు. కాబట్టి పదే పదే అప్డేట్లు వస్తున్నాయి కదా అని విసుక్కోకుండా అప్డేట్ చేసుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది. -
‘ఎక్స్’లో లైక్ కొట్టాలన్నా.. పోస్టు పెట్టాలన్నా చెల్లించాల్సిందే!
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్పై రూ.5,000 తగ్గింపు!
OnePlus 11 5G: వన్ప్లస్ 11 5జీ ధరను కంపెనీ మరింత తగ్గించింది. ఈ ఫోన్ ఫీచర్లు, అదనపు డిస్కౌంట్లు, కొత్త ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఈ పాపులర్ జియో ప్లాన్పై 20GB అదనపు డేటా
Jio Plans: కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపై జియో అదనపు డేటా అందిస్తోంది. అవేంటి? వాటిలోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం! -
మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రియల్మీ P సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవే!
రియల్మీ సంస్థ పి సిరీస్లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్లో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్