Russian Oil: భారత్పై ఆంక్షలు విధించబోం.. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా
Russian Oil: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని అమెరికా స్పష్టం చేసింది. భారత్పై ఎలాంటి ఆంక్షలు విధించబోమని చెప్పింది.
దిల్లీ: రష్యా (Russia) నుంచి చమురు దిగుమతుల్ని (Oil Imports) భారత్ గణనీయంగా పెంచుకుంటోంది. ఈ విషయంలో పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గకుండా వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధం (Russia-Ukraine War) నేపథ్యంలో ఆయా దేశాలు రష్యా చమురు (Russian Oil)పై విధించిన ఆంక్షల్ని భారత్ అవకాశంగా మార్చుకుంది. పలు దేశాల నుంచి వ్యక్తమైన విమర్శలకు స్వతంత్ర విదేశాంగ విధానంతో గట్టిగా బదులిస్తోంది. తాజాగా అమెరికా ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇబ్బందేమీ లేదు..
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. భారత్పై ఆంక్షలు విధించే ఆలోచనేమీ లేదని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖలో ఐరోపా, యురేషియా వ్యవహారాలను పర్యవేక్షించే అసిస్టెంట్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ కరెన్ డాన్ఫ్రైడ్ బుధవారం విలేకరులతో చెప్పారు. భారత్- అమెరికా మధ్య సంబంధాలు చాలా బలమైనవని తెలిపారు. ఉక్రెయిన్ ప్రజలకు భారత్ అందిస్తున్న మానవతా సాయాన్ని డాన్ఫ్రైడ్ కొనియాడారు. ఇది యుద్ధాలకు సమయం కాదని.. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలన్న ప్రధాని మోదీ హితవును సైతం స్వాగతిస్తున్నామన్నారు.
అందుకే ఆంక్షలు విధించబోం..
మాస్కో నుంచి న్యూదిల్లీ చమురు కొనుగోళ్లపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ దశాబ్దం చివరికల్లా రష్యా చమురు (Russian Oil), గ్యాస్ 50 శాతానికి తగ్గిపోతుందని డాన్ఫ్రైడ్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలపై ప్రత్యేక ఆంక్షల వల్ల అంతర్జాతీయంగా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చునని తెలిపారు. అందుకే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. రష్యా చమురు (Russian Oil)పై విధించిన ఆంక్షల ఫలితం ఇప్పటికే కనిపిస్తోందన్నారు. ఆ దేశ బడ్జెట్లో లోటు ద్వారా ఈ విషయం స్పష్టమవుతోందన్నారు.
రష్యా నుంచే 28 శాతం..
రష్యా (Russia) నుంచి మన దేశానికి ముడిచమురు దిగుమతులు (Oil Imports) అంతకంతకూ పెరుగుతున్నాయి. జనవరి నెలలో ఎప్పుడూ లేని స్థాయికి చేరాయి. ఒకప్పుడు ఒక శాతం కూడా లేని దిగుమతులు ఇప్పుడు ఏకంగా 28 శాతానికి చేరినట్లు ఎనర్జీ కార్గో ట్రాకర్ వొర్టెక్సా ఇటీవల వెల్లడించింది. ఉక్రెయిన్పై సైనిక చర్యకు ముందు రష్యా (Russia) నుంచి మన క్రూడాయిల్ దిగుమతులు కేవలం 0.2 శాతం మాత్రమే. ఉక్రెయిన్పై దాడి తర్వాత పశ్చిమ దేశాలు ఆ దేశంపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆదాయం కోసం ముడి చమురును రాయితీ ధరకే ఆ దేశం అందిస్తోంది. దీంతో చైనా, భారత్ ఆ దేశం నుంచి తక్కువ ధరకే ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జనవరిలో రష్యా ముడి చమురు వాటా 28 శాతానికి చేరింది. డిసెంబర్లో ఈ వాటా 26 శాతంగా ఉంది. రష్యా తర్వాత ఇరాక్ (20 శాతం), సౌదీ అరేబియా (17 శాతం), అమెరికా (9 శాతం), యూఏఈ (8 శాతం) అత్యధికంగా మన దేశానికి చమురును సరఫరా చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న