Russian Oil: భారత్పై ఆంక్షలు విధించబోం.. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా
Russian Oil: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని అమెరికా స్పష్టం చేసింది. భారత్పై ఎలాంటి ఆంక్షలు విధించబోమని చెప్పింది.
దిల్లీ: రష్యా (Russia) నుంచి చమురు దిగుమతుల్ని (Oil Imports) భారత్ గణనీయంగా పెంచుకుంటోంది. ఈ విషయంలో పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గకుండా వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధం (Russia-Ukraine War) నేపథ్యంలో ఆయా దేశాలు రష్యా చమురు (Russian Oil)పై విధించిన ఆంక్షల్ని భారత్ అవకాశంగా మార్చుకుంది. పలు దేశాల నుంచి వ్యక్తమైన విమర్శలకు స్వతంత్ర విదేశాంగ విధానంతో గట్టిగా బదులిస్తోంది. తాజాగా అమెరికా ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇబ్బందేమీ లేదు..
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. భారత్పై ఆంక్షలు విధించే ఆలోచనేమీ లేదని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖలో ఐరోపా, యురేషియా వ్యవహారాలను పర్యవేక్షించే అసిస్టెంట్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ కరెన్ డాన్ఫ్రైడ్ బుధవారం విలేకరులతో చెప్పారు. భారత్- అమెరికా మధ్య సంబంధాలు చాలా బలమైనవని తెలిపారు. ఉక్రెయిన్ ప్రజలకు భారత్ అందిస్తున్న మానవతా సాయాన్ని డాన్ఫ్రైడ్ కొనియాడారు. ఇది యుద్ధాలకు సమయం కాదని.. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలన్న ప్రధాని మోదీ హితవును సైతం స్వాగతిస్తున్నామన్నారు.
అందుకే ఆంక్షలు విధించబోం..
మాస్కో నుంచి న్యూదిల్లీ చమురు కొనుగోళ్లపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ దశాబ్దం చివరికల్లా రష్యా చమురు (Russian Oil), గ్యాస్ 50 శాతానికి తగ్గిపోతుందని డాన్ఫ్రైడ్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలపై ప్రత్యేక ఆంక్షల వల్ల అంతర్జాతీయంగా పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చునని తెలిపారు. అందుకే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. రష్యా చమురు (Russian Oil)పై విధించిన ఆంక్షల ఫలితం ఇప్పటికే కనిపిస్తోందన్నారు. ఆ దేశ బడ్జెట్లో లోటు ద్వారా ఈ విషయం స్పష్టమవుతోందన్నారు.
రష్యా నుంచే 28 శాతం..
రష్యా (Russia) నుంచి మన దేశానికి ముడిచమురు దిగుమతులు (Oil Imports) అంతకంతకూ పెరుగుతున్నాయి. జనవరి నెలలో ఎప్పుడూ లేని స్థాయికి చేరాయి. ఒకప్పుడు ఒక శాతం కూడా లేని దిగుమతులు ఇప్పుడు ఏకంగా 28 శాతానికి చేరినట్లు ఎనర్జీ కార్గో ట్రాకర్ వొర్టెక్సా ఇటీవల వెల్లడించింది. ఉక్రెయిన్పై సైనిక చర్యకు ముందు రష్యా (Russia) నుంచి మన క్రూడాయిల్ దిగుమతులు కేవలం 0.2 శాతం మాత్రమే. ఉక్రెయిన్పై దాడి తర్వాత పశ్చిమ దేశాలు ఆ దేశంపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆదాయం కోసం ముడి చమురును రాయితీ ధరకే ఆ దేశం అందిస్తోంది. దీంతో చైనా, భారత్ ఆ దేశం నుంచి తక్కువ ధరకే ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జనవరిలో రష్యా ముడి చమురు వాటా 28 శాతానికి చేరింది. డిసెంబర్లో ఈ వాటా 26 శాతంగా ఉంది. రష్యా తర్వాత ఇరాక్ (20 శాతం), సౌదీ అరేబియా (17 శాతం), అమెరికా (9 శాతం), యూఏఈ (8 శాతం) అత్యధికంగా మన దేశానికి చమురును సరఫరా చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 599, నిఫ్టీ 151 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
నారాయణమూర్తి మనవడు జాక్పాట్ కొట్టాడు. ఇన్ఫీ ప్రకటించిన డివిడెండ్తో ఒక్క రోజులోనే రూ.4 కోట్లు ఆర్జించనున్నాడు. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
Nestle: వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందంటూ నెస్లేపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని ఎఫ్ఎస్ఎస్ఏఐకి సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి.
తాజా వార్తలు (Latest News)
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల