Usa recession: అమెరికాది విచిత్ర పరిస్థితి..!
అమెరికాలో ఆర్థిక మాంద్యం ఉందా..? అనే ప్రశ్నకు సమాధానం కోసం అక్కడి ఆర్థికవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. కొందరు మాంద్యంలోనే ఉందంటే.. మరికొందరు త్వరలో మాంద్యలోకి జారుకొంటుందని చెబుతున్నారు. మరోవైపు మరికొందరు
మాంద్యంలో ఉన్నట్టా.. లేనట్టా
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
అమెరికాలో ఆర్థిక మాంద్యం ఉందా..? అనే ప్రశ్నకు సమాధానం కోసం అక్కడి ఆర్థికవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. కొందరు మాంద్యంలోనే ఉందంటే.. మరికొందరు త్వరలో మాంద్యంలోకి జారుకొంటుందని చెబుతున్నారు. పాలకులు మాత్రం ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉందని చెప్పేందుకు బలమైన జాబ్మార్కెట్ను ఆధారంగా చూపిస్తున్నారు. సాధారణంగా రెండు వరుస త్రైమాసికాలు ఆర్థిక వ్యవస్థ కుంగితే దానిని మాంద్యంగా పిలుస్తారు. అమెరికాలో గత 10 ఆర్థిక మాంద్యాల్లో 10 సార్లూ వరుసగా ఆర్థిక వ్యవస్థ రెండు త్రైమాసికాలు కుంగింది. అప్పుడే మాంద్యంగా ప్రకటించారు. వాటిల్లో చివరి ఏడు మాంద్యాల్లో భారీగా ఉద్యోగాలు కోల్పోయారు. కానీ, ఈ సారి ఆ పరిస్థితి లేకపోవడం విశేషం. ముఖ్యంగా అమెరికాలో మాంద్యం వస్తే మనకు ఏమవుతుందిలే అనుకోవడానికి లేదు.. భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా. అక్కడి ఆర్థిక వ్యవస్థ మందగిస్తే మన ఎగుమతిదారులకు ఆర్డర్లు లభించవు. ఇక సాఫ్ట్వేర్ కంపెనీల లాభాల్లో కూడా గతంలో వలే భారీ ఆదాయం కనిపించే అవకాశం ఉండదు.
వాస్తవానికి అమెరికాలో ఆర్థిక మాంద్యాన్ని నిర్వచించేందుకు కచ్చితమైన నిబంధనలు లేవు. ‘నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చి’ కింద పనిచేసే ‘బిజినెస్ సైకిల్ డేటింగ్ కమిటీ’ అనే సంస్థ దీనిని ప్రకటిస్తుంది. ప్రస్తుతానికి ఆ సంస్థ ‘మాంద్యం’ అనే పదం వాడలేదు. కానీ, చాలా సూచీలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందికర పరిస్థితిని మాత్రం తెలియజేస్తున్నాయి.
కంపెనీల కార్యకలాపాలు..
ఆర్థిక వ్యవస్థల హెచ్చుతగ్గుల్లో కంపెనీల కార్యకలాపాలు కీలకపాత్ర పోషిస్తాయి. కంపెనీల ఇన్వెంటరీల పెరుగుదల తగ్గడంతో ఆర్థికంగా తీవ్రమైన ప్రతికూల సంకేతాలు గత త్రైమాసికంలో కనిపించాయి. గతేడాది కొవిడ్ కారణంగా సప్లైఛైన్లలో ఇబ్బందులను, కొవిడ్ తర్వాత డిమాండ్ పెరుగుతుందని భావించి అధిక స్టాక్లను కంపెనీలు నిల్వ చేశాయి. ఇప్పుడవే వోవర్ స్టాక్ అయి కూర్చొని ఉండొచ్చని భావిస్తున్నారు.
వాస్తవానికి అమెరికా జీడీపీ 0.9శాతానికి తగ్గింది. అదే సమయంలో ఇన్వెంటరీల్లో మందగమనం కారణంగా ఉత్పాదకతలో 2 పాయింట్లు తగ్గాయి. అంటే.. కంపెనీలు ఇన్వెంటరీలను తగ్గించుకోకపోతే ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించే అవకాశం ఉంది. కన్జ్యూమర్ డిమాండ్ బలహీనంగా ఉండటం కూడా మాంద్యానికి చిహ్నమే.
ఉద్యోగ మార్కెట్ బలంగా..
అమెరికా ఉద్యోగ మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు బలమైన అండగా నిలిచింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్ని తప్పించుకోగలదని వాదించేవారందరికి ఇదే ప్రధాన ఆధారంగా మారింది. కరోనా కారణంగా కోల్పోయిన ఉద్యోగాల్లో జూన్ నాటికి 98శాతం మళ్లీ భర్తీలు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. 2022లో అమెరికాలో నిరుద్యోగ రేటు అతి స్వల్పంగా ఉంది. జనవరి నుంచి ఆర్థిక వ్యవస్థలోకి 22 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చి చేరాయి. మే నెలలో ప్రతి సరికొత్త అభ్యర్థికి రెండు ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి. ఆ నెల లే ఆఫ్లు కూడా అత్యంత తక్కువగా నమోదయ్యాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆ నెలకు 4,00,000 ఉద్యోగాలను సృష్టించింది. ఈ పరిస్థితి సాధారణంగా ఆర్థిక మాంద్యంలో కనిపించదు.
ద్రవ్యోల్బణం.. ధరల పెరుగుదల..
ఇక ద్రవ్యోల్బణం మాత్రం అమెరికాను గజగజలాడిస్తోంది. వినియోగదారుడి వద్ద ఉన్న వ్యయ శక్తి మొత్తాన్ని పీల్చి పిప్పి చేస్తోంది. జూన్ నాటికి 9.1శాతం వృద్ధిరేటును నమోదు చేసినట్లు బ్యూరో ఆఫ్ లేబర్ గణంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంస్థ లెక్కల ప్రకారం అమెరికా ప్రజల పొదుపులు కూడా గతేడాదితో పోలిస్తే గణనీయంగా పడిపోయాయి. అంటే.. వారు డబ్బుకు కటకటలాడతున్నట్లే లెక్క. మేలో వారు పన్నులు పోను మిగిలిన ఆదాయంలో 5.4శాతం మాత్రమే పొదుపు చేసినట్లు తేలింది. గతేడాది ఇది 12.4శాతంగా ఉంది. ఉద్యోగాలు పెరిగినా.. కొనుగోలుశక్తి పెరగకపోవడం ఇక్కడ గమనార్హం.
మరోవైపు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఫెడ్ వడ్డీ రేట్లను ఈ ఏడాది చివరి నాటికి 3.4శాతానికి చేర్చవచ్చని ముందస్తుగానే ప్రకటించింది. అధిక ధరలు ఉన్న సమయంలో ఆర్థిక వ్యవస్థను మందగింపజేస్తే ఫలితం ఉంటుందని భావిస్తోంది.
వినియోగదారుల వినిమయ శక్తి, సెంటిమెంట్..
అమెరికా ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల వ్యయందే అతిపెద్దభాగం. మే నెలతో పోల్చుకొంటే వినియోగదారుల వ్యయం 1.1శాతం పెరిగిందని అమెరికాలోని కామర్స్ డిపార్ట్మెంట్ గణంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ పెరుగుదల ద్రవ్యోల్బణం వల్ల పెరిగిన ధరల కారణంగా సంభవించి ఉండొచ్చని అంచనావేస్తున్నారు.
మరో వైపు ఆర్థిక వ్యవస్థపై వినియోగదారుల విశ్వాసం కూడా సన్నగిల్లింది. వరుసగా మూడో నెల కూడా ఇక్కడ వినియోగదారుల విశ్వాస సూచిక కుంగింది. దీనికి స్పందించిన వారిలో 43శాతం మంది వచ్చే ఏడాది మాంద్యం వచ్చే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు బాండ్ మార్కెట్లో ఇన్వెర్టెడ్ ఈల్డ్కర్వ్ (స్వల్పకాల బాండ్ల ఈల్డ్లు దీర్ఘకాలిక బాండ్ల ఈల్డ్లను మించి ఉండటం) కనిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి గత 60 ఏళ్లలో అమెరికా ట్రెజరీ నోట్లలో ఇన్వెర్ట్డ్ ఈల్డ్కర్వ్ కనిపించిన ప్రతిసారి మాంద్యం వచ్చింది. పెట్టుబడిదారుల్లో సమీప భవిష్యత్తుపై ఆందోళనను ఇది ప్రతిఫలిస్తుంది. అందుకే స్వల్పశ్రేణి బాండ్ల వడ్డీరేట్లు పెరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య