WhatsApp: ఇకపై వాట్సాప్లో గ్రూప్లు తాత్కాలికమే!
వాట్సాప్లో డిస్అప్పియరింగ్ మెసేజెస్ (Disappearing Messages), వ్యూ వన్స్ (View Once) ఫీచర్ల తరహాలోనే ఎక్స్పైరింగ్ గ్రూప్స్ (Expiring Groups) ఫీచర్ను పరిచయం చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: స్కూల్, కాలేజ్, ఆఫీస్ లేదా అపార్ట్మెంట్.. ఇలా ప్రతి చోటా ఒకే విషయాన్ని ఎక్కువ మందికి తెలియజేసేందుకు వాట్సాప్ (WhatsApp) గ్రూప్లను క్రియేట్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో బర్త్డే పార్టీ, కాలేజ్ టూర్ లేదా పండుగ సంబరాలు వంటి వాటి గురించి స్నేహితులు, సహోద్యోగులు తాత్కాలిక గ్రూప్లను క్రియేట్ చేసి చర్చిస్తారు. తర్వాత వాటిని డిలీట్ చేయడం మర్చిపోతుంటారు. అలాంటి వారి కోసమే వాట్సాప్ కొత్త ఫీచర్ను పరిచయం చేయనుంది.
డిస్అప్పియరింగ్ మెసేజెస్ (Disappearing Messages), వ్యూ వన్స్ (View Once) ఫీచర్ల తరహాలో ఎక్స్పైరింగ్ గ్రూప్స్ (Expiring Groups)పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్తో యూజర్లు తాత్కాలిక గ్రూప్లను క్రియేట్ చేయొచ్చు. యూజర్ ఎంపిక చేసిన నిర్ణీత కాల వ్యవధి తర్వాత వాటంతటవే ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ను త్వరలోనే సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఎలా పనిచేస్తుంది?
వాట్సాప్ గ్రూప్ (WhatsApp Groups) క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్లాలి. అందులో గ్రూప్ సెట్టింగ్స్ (Group Settings) ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఎక్స్పైరింగ్ గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై టాప్ చేయగానే రోజు (Day), వారం (Week), కస్టమ్ డేట్ (Custom Date), రిమూవ్ ఎక్స్పైరేషన్ డేట్ (Remove Expiration Date) అని నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. కస్టమ్ తేదీ ఆప్షన్తో ఏ రోజు వరకు గ్రూప్ లైవ్లో ఉండాలనుకుంటున్నారో ఆ తేదీని ఎంపిక చేయాలి. ఒకవేళ గ్రూప్ డిలీట్ అవ్వాల్సిన తేదీ ఎంపిక చేసి.. తర్వాత కూడా కొనసాగించాలనుకుంటే.. రిమూవ్ ఎక్స్పైరేషన్ డేట్పై క్లిక్ చేయాలి. దాంతో గ్రూప్ అడ్మిన్ డిలీట్ చేసే వరకు సదరు గ్రూప్ లైవ్లో ఉంటుంది.
ఇంకా కొత్త ఫీచర్లు!
ఇవేకాకుండా వాట్సాప్ మరికొన్ని కొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేయనుంది. వీటిలో సైలెన్స్ అన్నోన్ కాలర్స్ (Silence Unknown Callers), షెడ్యూల్ కాల్స్ (Schedule Calls), ట్రాన్స్క్రైబ్ వాయిస్ మెసేజెస్ (Transcribe Voice Messages) వంటి పీచర్లు ఉన్నాయి. సైలెన్స్ అన్నోన్ కాలర్స్ ఫీచర్తో ఎవరైనా కొత్త నంబర్ నుంచి కాల్ చేస్తే సదరు యూజర్కు రింగ్ రాకుండా ఈ ఫీచర్ నిరోధిస్తుంది. దీంతో స్కామ్/స్పామ్ కాల్స్ను నిరోధించవచ్చని వాట్సాప్ చెబుతోంది. వాట్సాప్ గ్రూప్లో వీడియో/ఆడియో కాల్స్ను షెడ్యూల్ చేసేందుకు షెడ్యూల్ కాల్స్ ఫీచర్ను తీసుకొస్తుంది. దీంతో సమావేశం పేరు, తేదీ, టైం వంటి వివరాలను ఎంటర్ చేసి క్రియేట్పై క్లిక్ చేస్తే కాల్ షెడ్యూల్ అవుతుంది. కాల్ ప్రారంభమైన వెంటనే గ్రూప్ సభ్యులందరికీ అలర్ట్ నోటిఫికేషన్ వెళుతుంది. ఇక ట్రాన్స్క్రైబ్ వాయిస్ మెసేజెస్ ఫీచర్తో వాయిస్ మెసేజ్లను టెక్స్ట్ రూపంలో చదవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది. -
‘ఎక్స్’లో లైక్ కొట్టాలన్నా.. పోస్టు పెట్టాలన్నా చెల్లించాల్సిందే!
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్పై రూ.5,000 తగ్గింపు!
OnePlus 11 5G: వన్ప్లస్ 11 5జీ ధరను కంపెనీ మరింత తగ్గించింది. ఈ ఫోన్ ఫీచర్లు, అదనపు డిస్కౌంట్లు, కొత్త ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఈ పాపులర్ జియో ప్లాన్పై 20GB అదనపు డేటా
Jio Plans: కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపై జియో అదనపు డేటా అందిస్తోంది. అవేంటి? వాటిలోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం! -
మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రియల్మీ P సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవే!
రియల్మీ సంస్థ పి సిరీస్లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్లో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. -
జీ-మెయిల్లో లార్జ్ ఫైల్స్ను సెండ్ చేయడం ఎలా?
Tech Tip- Gmail: నిత్యం వినియోగించే జీ- మెయిల్లో కూడా లార్జ్ డేటా ఫైల్స్ను ఎలా సెండ్ చేయొచ్చు. -
108 ఎంపీ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయంతో ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్లు
Infinix Note 40 Pro series: వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయంతో ఇన్ఫినిక్స్ రెండు కొత్త మొబైల్స్ని భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
వాట్సప్లో ఈ ఐకాన్ మీకూ కనిపించిందా? ఆ కొత్త ఫీచర్ ఇదే..!
వాట్సప్ మరో కొత్త ఫీచర్ను టెస్ట్ చేస్తోంది. త్వరలోనే వాట్సప్కు ఏఐ ఫీచర్లను జోడించనుంది. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియరాలేదు. -
గూగుల్ ఫొటోస్ గుడ్న్యూస్.. పిక్సెల్ ఫోన్లలోని ఈ టూల్స్ ఇకపై అందరికీ!
Google Photos: తమ యూజర్లందరికీ ఏఐ టూల్స్ను అందించనున్నట్లు గూగుల్ ఫొటోస్ ప్రకటించింది. ఇప్పటి వరకు పిక్సెల్ 8, 8ప్రో స్మార్ట్ఫోన్లలో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నాయి. -
ట్రూకాలర్లో వెబ్ వెర్షన్.. పీసీలోనూ ఇక నంబర్లు వెతకొచ్చు
ట్రూకాలర్ కొత్త సదుపాయం తీసుకొచ్చింది. వెబ్ వెర్షన్ను లాంచ్ చేసింది. తద్వారా కొత్త నంబర్లను వెబ్లోనూ వెతకొచ్చు. -
సరైన ఎయిర్ కూలర్ ఎంపిక ఎలా?.. కొనే ముందు ఇవి తెలుసుకోండి
ఈ వేసవిలో కూలర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే కొనే ముందు ఏమేం చూడాలి? -
బోట్ యూజర్లకు షాక్.. రిస్క్లో 75 లక్షల మంది డేటా
బోట్ వేరియబుల్ బ్రాండ్కు సంబంధించిన యూజర్ల డేటా ప్రమాదంలో పడింది. 75 లక్షల మంది డేటా లీకైనట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. -
45W ఫాస్ట్ ఛార్జింగ్ శాంసంగ్ ఎం55.. ₹12 వేలకే ఎం 15
Samsung Galaxy M55: శాంసంగ్ కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. ఎం సిరీస్లో 55 5జీ, 15 5జీ ఫోన్లను తీసుకొచ్చింది. అమెజాన్లో విక్రయాలు ప్రారంభమయ్యాయి. -
అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్తో జియో కొత్త ప్లాన్
Jio Prepaid Plan: జియో రూ.857తో కొత్త ప్లాన్ను ఇటీవల ప్రవేశపెట్టింది. దీంట్లో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్స్క్రిప్షన్ ఉంది. -
హోమ్ రోబోటిక్స్ విభాగంలో యాపిల్..?
Apple: ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ హోమ్ రోబోటిక్స్ విభాగంలో అడుగుపెట్టినట్లు బ్లూమ్బర్గ్ ఓ కథనాన్ని ప్రచురింది.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!