Vodafine Idea: ఎయిర్టెల్, జియో 5జీ సేవలపై వొడాఫోన్ ఐడియా అభ్యంతరం!
దేశవ్యాప్తంగా జియో (Jio), ఎయిర్టెల్ (Airtel)లు అందిస్తున్న 5జీ (5G) సేవలపై వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) ట్రాయ్ (TRAI)కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా రెండు సంస్థలకు ట్రాయ్ నోటీసులు జారీ చేసింది. వీటిపై ఎయిర్టెల్, జియో స్పందించాయి.
దిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజ సంస్థలు రిలయన్స్ జియో (Reliance Jio), భారతీ ఎయిర్టెల్ (Airtel) ఉచితంగా 5జీ సేవలు (5G) అందివ్వడంపై మరో టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎయిర్టెల్, జియోపై ఫిర్యాదు చేస్తూ టెలికాం నియంత్రణ సంస్థకు (TRAI) వొడాఫోన్ ఐడియా లేఖ రాసింది. దీంతో ఎయిర్టెల్, జియోకు ట్రాయ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై రెండు సంస్థలు తమ వాదనను తెలియజేశాయి. ఇందులో తాము అందించే 5జీ సేవలు ఉచితం కాదని జియో, ఎయిర్టెల్లు చెప్పినట్లు ట్రాయ్ పేర్కొంది. కొన్ని ఎంపిక చేసిన 4జీ ప్లాన్లకు సబ్స్క్రైబ్ చేసుకున్న యూజర్లకు మాత్రమే వాటిని ఇస్తున్నట్లు చెప్పాయని తెలిపింది.
దేశంలో 5జీ సర్వీస్లను పరిచయం చేసే సమయంలో ‘ఎయిర్టెల్ 5జీ ప్లస్’ నెట్వర్క్ ద్వారా వినియోగదారులు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను పొందవచ్చని కంపెనీ తెలిపింది. 5జీ ఫోన్ ఉపయోగిస్తున్న పోస్ట్పెయిడ్, ₹ 239 కంటే ఎక్కువ మొత్తానికి రీఛార్జ్ చేసుకున్న ప్రీపెయిడ్ యూజర్లు ఎయిర్టెల్ 5జీ సేవలను పొందవచ్చని ప్రకటించింది. అయితే, తాము ఆశించినట్లుగా వినియోగదారులు 5జీ సేవలను ఉపయోగించుకోవడంలేదని రెండు సంస్థలు పేర్కొన్నట్లు ట్రాయ్ వెల్లడించింది. ‘‘వొడాఫోన్ ఐడియా ఫిర్యాదుపై జియో, ఎయిర్టెల్కు నోటీసులు జారీ చేశాం. రెండు సంస్థలు తమ వాదనను తెలియజేశాయి. వీటిపై ట్రాయ్ న్యాయ, ఆర్థిక, సాంకేతిక విభాగాల ప్రతినిధులు చర్చిస్తున్నారు. వారి సూచన మేరకు నిర్ణయం తీసుకుంటాం’’ అని ట్రాయ్ తెలిపింది.
టెలికాం ఆపరేటర్లు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం ఇదేం తొలిసారి కాదు. 2016లో జియో తక్కువ ధరకే టెలికాం సేవలు అందివ్వడంపై ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ట్రాయ్కు ఫిర్యాదు చేశాయి. కొద్దిరోజులు క్రితం జియో టీవీలో ఐపీఎల్ ప్రసారం చేయడాన్ని ఉద్దేశించి ఎయిర్టెల్ ట్రాయ్కు ఫిర్యాదు చేసింది. దీనిపై జియో ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే ఎయిర్టెల్ ఈ ఫిర్యాదు చేసిందని ట్రాయ్కు రాసిన లేఖలో జియో పేర్కొంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎయిర్టెల్, జియో 5జీ సేవలను అందిస్తుండగా, వొడాఫోన్ ఐడియా మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఈ సేవలను అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 22,401 దగ్గర కొనసాగుతోంది. -
రిలయన్స్ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసిక నికర లాభంలో పెద్దగా మార్పు కనిపించకపోయినా.. వార్షిక లాభంలో మాత్రం రికార్డులు తిరగరాసింది. ముడి చమురు, పెట్రోరసాయనాల వ్యాపారాలు గణనీయంగా రాణించడంతో పాటు.. టెలికాం, రిటైల్ విభాగాల్లో జోరు కొనసాగడం ఇందుకు నేపథ్యంగా నిలిచింది. -
ఆధ్యాత్మిక పర్యటనలకు చలో.. చలో
భారతీయులు తరచుగా ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తున్నట్లు మేక్మైట్రిప్ ఇండియా రూపొందించిన నివేదికలో తేలింది. అయోధ్య, ఉజ్జయిని, బద్రినాధ్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం, ఇంటర్నెట్లో వెతకడం పెరిగిందని పేర్కొంది. -
రెండో రోజూ లాభాల జోరు
ఆసియా, ఐరోపా సంకేతాలు సానుకూలంగా మారడంతో, వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు తీశాయి. ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణగడం.. ఫలితంగా ముడిచమురు ధరలు తగ్గడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు.. -
పేటీఎం దేశీయ 4జీ సౌండ్బాక్స్ల ఆవిష్కరణ
దేశీయ ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం, చెల్లింపుల కోసం వినియోగించే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), క్రెడిట్ కార్డ్ల కోసం దేశీయంగా తయారైన రెండు సౌండ్బాక్స్లను సోమవారం ఆవిష్కరించింది. -
పార్కిన్సన్ చికిత్సకు ‘మెడ్ట్రానిక్’ పరికరం
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే ‘న్యూరోస్మార్ట్’ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ (ఎంఈఆర్) నావిగేషన్ సిస్టమ్ను మనదేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. -
దేశీయ విమానాల్లో ఒక్కరోజులో 4.71 లక్షల మంది ప్రయాణం
దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ కొత్త గరిష్ఠాలకు చేరింది. ఈనెల 21న (ఆదివారం) దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 4,71,751గా నమోదైంది. -
ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలా పొడుల్లోని సుగంధ ద్రవ్యాల నాణ్యతా పరిశీలన
మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్ల మసాలా పొడుల నాణ్యతపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది. -
అదానీ గ్రూప్ ‘ఆఫ్షోర్ ఫండ్’ల నిబంధనల అతిక్రమణ!
అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 12 ఆఫ్షోర్ ఫండ్లు వెల్లడి నిబంధనలను అతిక్రమించాయని, పెట్టుబడుల పరిమితినీ దాటాయని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గుర్తించినట్లు తెలుస్తోంది. -
వీవీఐపీలకు సేవలందించిన బోయింగ్ 747కు ఎయిరిండియా వీడ్కోలు
దాదాపు అయిదు దశాబ్దాల పాటు ఎయిరిండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు (వీవీఐపీ), వాణిజ్య, అత్యవసర తరలింపు సేవలను ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. -
జొమాటో ప్లాట్ఫాం ఫీజు రూ.5కు పెంపు
ఎంపిక చేసిన నగరాల్లో, జొమాటో తన ప్లాట్ఫాం ఫీజును ఒక్కో ఆర్డరుకు రూ.5కు పెంచింది. ఇప్పటివరకు ఇది 4 రూపాయలుగా ఉంది. -
సంక్షిప్త వార్తలు(5)
అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కార్యకలాపాలు ప్రారంభించినట్లు ఓలా మొబిలిటీ సోమవారం వెల్లడించింది. అరైవల్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యాబ్ పికప్ జోన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి