Credit Suisse Crisis: క్రెడిట్ సూయిజ్ సంక్షోభానికి బీజం పడింది అక్కడే..!
What happened to Credit Suisse: ప్రపంచంలోనే టాప్ బ్యాంక్ అయిన క్రెడిట్ సూయిజ్ ఎలా పతనం అయ్యింది? ఈ స్థితి ఎందుకు ఏర్పడింది?
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా బ్యాంకింగ్ రంగంలో వరుస పతనాలను మరిచిపోక ముందే స్విట్జర్లాండ్కు చెందిన అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన క్రెడిట్ సూయిజ్ (Credit Suisse) అంశం తెరపైకి వచ్చింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ బ్యాంక్.. ఇటీవల కాలంలో పతనావస్థకు చేరింది. 2008 నాటి సంక్షోభ పరిస్థితులు మరోసారి తలెత్తకూడదన్న ఉద్దేశంతో స్విట్జర్లాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్విస్ కేంద్రంగా పనిచేసే యూబీఎస్ గ్రూప్తో (UBS group) చర్చలు జరిపింది. దీంతో యూబీఎస్ గ్రూప్ 3.25 బిలియన్ డాలర్లకు క్రెడిట్ సూయిజ్ను దక్కించుకుంది. అసలు ఇంతకీ క్రెడిట్ సూయిజ్ ఎలా పతనావస్థకు చేరింది?
స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ కేంద్రంగా 1856లో క్రెడిట్ సూయిజ్ బ్యాంక్ ఏర్పాటైంది. తొలుత రైల్ నెట్వర్క్కు నిధులు సమకూర్చడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ బ్యాంక్ కాలక్రమంలో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్గా అవతరించింది. ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల్లో ఎనిమిదో స్థానానికి చేరింది. స్విట్జర్లాండ్లో యూబీఎస్ తర్వాత రెండో అతి పెద్ద బ్యాంక్గా నిలిచింది. దాదాపు 166 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బ్యాంక్ దాదాపు పతనావస్థకు చేరుకోవడంతో స్విట్జర్లాండ్ ప్రభుత్వం అప్రమత్తమై యూబీఎస్తో కొనుగోలుకు మధ్యవర్తిత్వం వహించాల్సి వచ్చింది.
Also Read: క్రెడిట్ సూయిజ్ పతనానికి ‘యూబీఎస్’తో విరుగుడు!
నష్టాలు.. జరిమానాలు.. మేనేజ్మెంట్ మార్పులు
క్రెడిట్ సూయిజ్ పతనానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న కంపెనీలు బోర్డులు తిప్పేయడం.. బ్యాంకుకు అవినీతి మరకలు.. డిపాజిటర్లలో విశ్వాసం నింపాల్సిన టాప్ మేనేజ్మెంట్ కొద్ది రోజుల వ్యవధిలోనే కుర్చీ దిగిపోవడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పాలి. వీటన్నింటికీ కొన్నేళ్ల క్రితమే బీజం పడింది.
- అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన ఆర్కిగోస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ కంపెనీకి క్రెడిట్ సూయిజ్ విరివిగా రుణాలు ఇచ్చింది. భారీగా రుణాలు తీసుకున్న ఆ కంపెనీ 2021లో కుప్పకూలింది. దీంతో క్రెడిట్ సూయిజ్కు 5.5 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది. గ్రీన్సిల్ క్యాపిటల్ అనే సప్లయ్ చైన్ నెట్వర్క్కు సైతం క్రెడిట్ సూయిజ్ భారీగా రుణాలు ఇచ్చింది. ఆ కంపెనీ సైతం దివాలా తీయడంతో మరోసారి భారీగా నష్టం వాటిల్లింది. ఈ రెండు ఎదురు దెబ్బల కారణంగా క్రెడిట్ సూయిజ్ ఏకంగా 10 బిలియన్ డాలర్లు నష్టపోయింది.
- 2004-08 మధ్యలో బల్గేరియాలోని మాదకద్రవ్యాల డీలర్లకు మనీలాండరింగ్లో సాయం చేసినట్లు ఈ బ్యాంక్పై క్రిమినల్ ఆరోపణలు 2022 జూన్లో న్యాయస్థానంలో నిర్ధారణ అయ్యాయి. దీంతో న్యాయస్థానం 2.1 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. మొజాంబిక్లో అవినీతి ఆరోపణలు, మాజీ ఉద్యోగులపై గూఢచర్యం ఆరోపణలు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్లలో కేసుల వల్ల భారీగా పరిహారాలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
- బ్యాంక్ను గాడిన పెట్టాల్సిన టాప్ మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు మారడం కూడా బ్యాంక్కు గట్టి దెబ్బగా మారింది. 2020లో బ్యాంక్ సీఈఓ తిడ్జానే థైమ్ గూఢచర్యం ఆరోపణలతో వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన సీఈవో అంటానియో హోర్టా ఒసారియో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పదవిని వీడారు. 8 నెలలే ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత సీఈఓగా ఉల్రిచ్ కోర్నర్ను నియమించినప్పటికీ ఈ చర్యలేవీ డిపాజిటర్లలో విశ్వాసాన్ని నింపలేకపోయాయి.
డిపాజిట్లకు రెక్కలు..
క్రెడిట్ సూయిజ్లో చోటుచేసుకున్న వరుస పరిణామాలు బ్యాంకింగ్ ఆర్థిక పరిస్థితిపై ఆందోళనలు పెంచాయి. డిపాజిటర్లలో విశ్వాసం నింపాల్సిన టాప్ మేనేజ్మెంట్ నెలల వ్యవధిలో మారడం వంటి కారణాలతో డిపాజిటర్లు తమ నిల్వలను వెనక్కి తీసుకోవడం మొదలు పెట్టారు. ఒక్క 2022లోనే 7.8 బిలియన్ ఫ్రాంక్ల నష్టాన్ని చవిచూసింది. దీనికి తోడు క్రెడిట్ సూయిజ్లో పెద్ద వాటాదారైనా సౌదీ నేషనల్ బ్యాంక్ తాము మరిన్ని నిధులను ఇవ్వలేమని తేల్చిచెప్పడం భయాలను మరింత పెంచింది. దీంతో ఒక్కరోజే క్రెడిట్ సూయిజ్ షేర్లు 67 శాతం పతనం అయ్యి మరోసారి బ్యాంకింగ్ సంక్షోభానికి ఆజ్యం పోశాయి. దీంతో స్విస్ ప్రభుత్వం రంగంలోకి దిగింది.
Also Read: నివురుగప్పిన ముప్పు..మరో పెను సంక్షోభాన్ని పొదుగుతున్న అమెరికా..!
యూబీఎస్ ఎందుకు?
స్విట్జర్లాండ్ వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూబీఎస్ గ్రూప్ దేశంలోనే అన్నికంటే పెద్ద బ్యాంక్. క్రెడిట్ సూయిజ్ తరహాలోనే వివిధ దేశాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్లోనూ ఈ బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ క్రెడిట్ సూయిజ్ దివాలా తీస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అదే జరిగితే యూబీఎస్పైనా ఆ ప్రభావం ఉంటుంది. మరోవైపు క్రెడిట్ సూయిజ్ షేర్లు పతనం మొదలవ్వగానే స్విస్ అధికారులు బుధవారం చర్యలు ప్రారంభించారు. ఆసియా మార్కెట్లు ప్రారంభం కాకముందే (సోమవారం) మార్కెట్లపై ఈ ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో యూబీఎస్తో కొనుగోలు చర్చలు ఓ కొలిక్కి తెచ్చి నిర్ణయాన్ని వెలువరించారు.
9000 ఉద్యోగాలకు ముప్పు
స్విస్ గ్రూప్ కొనుగోలు ఒప్పందం వల్ల 9 వేల మంది క్రెడిట్ సూయిజ్ ఉద్యోగులపై ప్రభావం పడనుంది. కొనుగోలు అనంతరం బ్యాంక్ను కాపాడడం కోసం దాదాపు 9వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని యూబీఎస్ నిర్ణయించింది. రెండు బ్యాంకులకు కలిపి ప్రస్తుతం లక్షా 25 వేలమంది ఉద్యోగులు ఉన్నారు. క్రెడిట్ సూయిజ్ను లాభదాయకతలోకి తీసుకురావాలంటే ఉద్యోగుల కోత తప్పదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు బ్యాంకింగ్ రంగంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు రేట్ల పెంపు విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ