5G auction: 5Gపై అపోహలు.. అనుమానాలు.. వీటిలో వాస్తవమెంత?
Fears on 5G: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాల్లో 5జీ నెట్వర్క్లు వాణిజ్య ప్రాతిపదికపై ప్రారంభమయ్యాయి. భారత్లోనూ..
5G roll out: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాల్లో 5జీ నెట్వర్క్లు (5G) వాణిజ్య ప్రాతిపదికపై ప్రారంభమయ్యాయి. భారత్లోనూ రిలయన్స్, జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా 5జీ ప్రయోగాలను ప్రారంభించాయి. వాణిజ్యపరంగానూ ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నెల 26న 5జీ స్పెక్ట్రమ్ వేలం (5G auction) నిర్వహించబోతోంది. అయితే, 5జీ సాంకేతికతకు సంబంధించి ఇప్పటికే ప్రజల్లో అనేక అనుమానాలు, అపోహలు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా దీనివల్ల వెలువడే రేడియో ధార్మికత మానవులు, పశుపక్ష్యాదుల ఆరోగ్యానికి హానికరమన్నది ప్రధానమైన సందేహం. అయితే, ఈ భావన ఇంతవరకూ శాస్త్రీయంగా రుజువు కాకపోవడం గమనార్హం. ఇలాంటి భయాలకుతోడు అనేక విడ్డూరపు వార్తలూ ప్రజల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదీ చదవండి: 2G, 3G, 4G, 5G.. ఏమిటివి? స్పెక్ట్రమ్కి వేలం ఎందుకు?
- ప్రముఖ సినీ నటి, పర్యావరణ ఉద్యమకారిణి జూహీ చావ్లా భారత్లో 5జీ సాంకేతికతపై ఆందోళనపై వ్యక్తం చేస్తూ ఆ మధ్య దిల్లీ హైకోర్టులో దావా వేశారు. అసలు 5జీ వల్ల వెలువడే రేడియేషన్ ప్రమాదకరమా? కాదా? అన్నది తేల్చే పరిశోధనకు ఆదేశించాలని కోరారు. కోర్టు ఆమె వ్యాజ్యాన్ని కొట్టిపారేసినప్పటికీ.. ఇంకా కొన్ని వర్గాల్లో ఆమె వెలిబుచ్చిన సందేహాలు మాత్రం తొలగిపోలేదు.
- 4జీ, 3జీలకన్నా ఎంతో వేగంగా, సమర్థంగా సందేశాలు, సమాచారాలను పంపడానికి 5జీలో అధిక శక్తిమంతమైన విద్యుదయస్కాంత క్షేత్ర తరంగాలను (EMF- Electromagnetic field) వాడతారు. డ్రైవర్లేని కార్లు, వర్చువల్ రియాలిటీ సాధనాలు, సీసీటీవీలకు 5జీ పరిజ్ఞానం ఎంతో కీలకమైంది. దీనికోసం గతంలోకన్నా ఎంతో ఎక్కువగా 5జీ సెల్ టవర్లను, భూతల ట్రాన్స్మిటర్లను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. నగరాలు పట్టణాలు వీటితో కిక్కిరిసిపోయే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: అసలు 2G స్పెక్ట్రమ్ రగడ ఏంటి? ఆరోజు కాగ్ ఏం చెప్పింది?
- అవన్నీ కలిసి వెలువరించే రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇందులో నిజమెంతో నిగ్గుతేల్చడానికి గతంలో పరిశోధనలు ప్రధానంగా ఎలుకలపై జరిగాయే తప్ప మనుషులపై కాదని గుర్తించాలి. 5జీతో సహా అన్ని మొబైల్ నెట్వర్కుల ద్వారా వెలువడే రేడియేషన్.. సూర్యకాంతితో ఏర్పడే రేడియేషన్ కన్నా తక్కువ శక్తిమంతమైనది. ఈ నెట్వర్కులతో పోలిస్తే ఎక్స్రే యంత్రాలు, స్కానర్లు ఎక్కువ శక్తిమంతమైన రేడియేషన్ను వెలువరిస్తాయి.
- నిజానికి మైక్రోవేవ్ ఓవెన్లు, కంప్యూటర్లు, విద్యుత్ సరఫరా లైన్ల్లతోపాటు కరెంటును ఉపయోగించే ఏ పరికరమైనా సరే విద్యుదయస్కాంత క్షేత్ర తరంగాలను (ఈఎంఎఫ్) వెలువరిస్తుంది. 5జీ టవర్లకన్నా ఇలాంటి పరికరాల సంఖ్యే ఎల్లప్పుడూ ఎంతో అధికంగా ఉంటుంది. 5జీ నెట్వర్కులు వాడే నిర్దిష్ట విద్యుదయస్కాంత క్షేత్ర తరంగాల కన్నా మొత్తం విద్యుదయస్కాంత క్షేత్రాల ప్రభావం మీదే ఎక్కువ పరిశోధనలు జరిగాయి. ఈఎంఎఫ్ వల్ల మానవ కణజాలం కాస్త వేడెక్కుతుందని, వయసు మీరిన వారిలో ఇది కొంత ఎక్కువగా సంభవిస్తుందని ఒక అధ్యయనం తెలిపింది. అయితే, ఇది తాత్కాలిక పరిణామం మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ప్రతిరోజూ ఎంతో కొంత ఈఎంఎఫ్ ప్రభావానికి లోనవుతూనే ఉంటారని వివరించారు.
- మొబైల్ ఫోన్ల వాడకం వల్ల గ్రహణ శక్తిపై పడే ప్రభావాన్ని పలు అధ్యయనాలలో పరిశీలించారు. ఈఎంఎఫ్లకూ గ్రహణ శక్తికీ మధ్య ఎలాంటి సంబంధమూ లేదని వీటిలో తేలింది. అయితే, శరీరానికి, మొబైల్ సాధనాలకు మధ్య కొంతదూరం పాటించడం మంచిదని మాత్రం సూచించాయి. 5జీ వల్ల మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఏ పరిశోధనలోనూ తిరుగులేకుండా నిర్ధారణ కాలేదు.
ఇదీ చదవండి: 5జీ దేశవ్యాప్తంగా ఎప్పుడు..?రేట్లు ఎంత ఉండబోతున్నాయ్?
- ఈఎంఎఫ్ ప్రభావం మీద మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అమెరికా జాతీయ టాక్సికాలజీ పరిశోధన కార్యక్రమం కింద రెండేళ్లపాటు ఎలుకల మీద రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ప్రభావాన్ని పరిశీలించారు. చివరకు మగ ఎలుకల్లో క్యాన్సర్ ప్రమాదాన్ని గుర్తించినా, ఆడ ఎలుకల్లో అది కనిపించలేదు. ఇక్కడ గమనించాల్సిన కీలకమైన అంశం ఏమిటంటే, జంతువులపై ప్రయోగాల్లో ఉపయోగించే రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఎక్కువసేపు సెల్ఫోన్లు ఉపయోగించే మనుషులు కూడా అంతటి రేడియేషన్కు గురయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ప్రయోగశాల ఫలితాలను యథాతథంగా మనుషులకు వర్తింపజేయలేమని నిపుణులు చెబుతున్నారు.
- మొబైల్, డిజిటల్ నెట్వర్కుల వల్ల దీర్ఘకాలంలో పడే ప్రభావాన్ని అంచనా వేయడానికి విస్తృత అధ్యయనాలు జరుగుతున్నాయి. వీటిలో ప్రముఖమైనది- కాస్మోస్. 2007 సంవత్సరం నుంచి ఆరు ఐరోపా దేశాల్లో జరుగుతున్న ఈ అధ్యయనంలో 2,90,000 మంది పాల్గొంటున్నారు. 20 నుంచి 30 ఏళ్లపాటు సెల్ఫోన్ల వాడకం వల్ల మానవ ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడమే లక్ష్యంగా కాస్మోస్ సాగుతోంది. ఈ దీర్ఘకాల ప్రయోగం కచ్చితమైన ఫలితాలను అందిస్తుందని ఆశించవచ్చు.
- అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ (ఐఏఆర్సీ) 2011లో వెలువరించిన ఒక నివేదిక 5జీ సాంకేతికత పట్ల భయానికి బీజం వేసింది. మొబైల్ ఫోన్లు వాడే విద్యుదయస్కాంత క్షేత్ర తరంగాలు (ఈఎంఎఫ్) మానవుల్లో ‘బహుశా’ క్యాన్సర్ కారకం కావచ్చునని ఆ నివేదిక అభిప్రాయపడింది. దాన్ని 14 దేశాలకు చెందిన 30 మంది శాస్త్రజ్ఞులు సమర్పించారు. 2017లో వెలువడిన మరో పరిశోధనా నివేదిక ఈఎంఎఫ్ వల్ల మెదడు క్యాన్సర్ రావచ్చునంటే, 2018లో వచ్చిన మరొక నివేదిక అలాంటిదేమీ నిర్ధారణ కాలేదని పేర్కొన్నది.
- ఇవన్నీ ఒక ఎత్తైతే.. 5జీ సాంకేతికత అమలులో ఉపయోగించే పరికరాలపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు పెద్ద ఎత్తున 5జీ నెట్వర్క్ పరికరాలను అందజేస్తున్న కంపెనీలు ఐదు మాత్రమే ఉన్నాయి. వాటిలో హువావే, జెడ్టీఈ.. చైనాకు చెందినవి. ఇప్పటికే వీటి నుంచి పరికరాల కొనుగోలుపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. వీటి వల్ల భవిష్యత్తుల్లో గూఢచర్యం జరిగే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశాయి. కీలక సమాచారం చైనా చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తపరిచాయి. ఈ క్రమంలో అత్యాధునిక 5జీ సాంకేతికత కోసం విదేశీ కంపెనీలపై ఆధారపడడంపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సున్నితమైన సమాచారాన్ని పరాయిదేశాలు తస్కరించే అవకాశం ఉందన్నది ప్రధాన సందేహం.
- మరోవైపు 5జీ సాంకేతికత తీసుకురాబోయే మార్పులూ ఓ వర్గాన్ని ఆందోళపరుస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న అనేక ఉద్యోగాల నిర్వహణ, సేవల అందజేత అత్యాధునికంగా మారిపోయే అవకాశం ఉంది. దీనికి ఎంతో నైపుణ్యం అవసరమవుతుంది. అది అందిపుచ్చుకోలేని వారంతా ఉద్యోగాలు కోల్పోయి నిరాశ్రయులవుతారన్నది ప్రధానమైన వాదన. కానీ, ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ ఉంటే ఎలాంటి సమస్యలూ ఉండవు. ఉత్తరాల నుంచి మెసేజింగ్ యాప్ల వరకు వచ్చినట్లుగానే ఇది కూడా ప్రజలను కొత్త జీవనశైలికి అలవాటుపడేలా సంసిద్ధుల్ని చేస్తుంది. వాటిని అందిపుచ్చుకునేందుకు మనం సిద్ధంగా ఉండాలి.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా