Home Loan: హోంలోన్ ఈఎంఐలు చెల్లించలేకపోతే?
Home Loan: వరుసగా మూడు హోమ్ లోన్ EMIలను చెల్లించలేకపోతే ఎలాంటి పరిణామాలుంటాయో చూద్దాం...
ఇంటర్నెట్ డెస్క్: గృహ రుణాన్ని ఎగవేస్తే మీ ప్రస్తుత, భవిష్యత్తు ఆర్థిక వ్యవహారాలపై తీవ్ర పరిణామాలుంటాయి. మీ రుణ యోగ్యత దెబ్బతింటుంది. భవిష్యత్తులో అప్పు పుట్టడం కష్టతరంగా మారుతుంది. వరుసగా మూడు హోమ్ లోన్ EMIలను చెల్లించలేకపోతే ఎలాంటి పరిణామాలుంటాయో చూద్దాం..
తొలి వాయిదా చెల్లించకపోతే..
మొదటి EMI సకాలంలో చెల్లింకపోతే.. వెంటనే బ్యాంక్ మీకు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ ద్వారా గుర్తు చేస్తుంది. ఆన్లైన్లో చెల్లింపు చేయడానికి కావాల్సిన లింక్ను కూడా పంపుతుంది. చెల్లించాల్సిన EMIతో పాటు బకాయి ఉన్న లోన్ మొత్తంపై 1-2% అపరాధ రుసుమును వసూలు చేయవచ్చు. ఒకసారి వాయిదాను చెల్లించేస్తే తిరిగి రుణ ఖాతాను పునరుద్ధరిస్తారు.
రెండో ఈఎంఐ కూడా కట్టకపోతే..
రెండో EMI కూడా చెల్లించలేకపోతే.. బ్యాంకు ఈసారి మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఆలస్య రుసుములతో సహా EMIల మొత్తాన్ని వెంటనే చెల్లించమని కోరుతుంది. మీ ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఈ చెల్లింపు చేయడానికి కొంత సమయం ఇచ్చే అవకాశం ఉంది. అయితే, మూడో EMI కూడా డిఫాల్ట్ అయితే, చట్టపరమైన చర్యలను ప్రారంభిస్తామని కఠిన హెచ్చరిక జారీచేస్తుంది. అక్కడి వరకు వెళ్లొద్దంటే అప్పటి వరకు ఉన్న బకాయిలన్నింటినీ చెల్లించేసేయండి.
చివరకు మొండి బకాయిగా..
చివరకు మీరు మూడో ఈఎంఐ కూడా కట్టలేకపోతే.. మీ రుణాన్ని మేజర్ డీఫాల్ట్ కింద వర్గీకరిస్తారు. అప్పటికీ మీకు బ్యాంకు నుంచి హెచ్చరిక సందేశాలు వస్తూనే ఉంటాయి. బకాయిల చెల్లింపునకు ఇంకా 90 రోజుల గడువుంటుంది. అయినా, చెల్లించకపోతే రుణదాతలు మీ ఇంటిని వేలంలో విక్రయించి రుణ మొత్తాన్ని వసూలు చేసుకునే ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ దశకు చేరిందంటే మీ లోన్ను మొండి బకాయిల జాబితాలో చేరుస్తారు. దీనికంటే ముందు నోటీసులు పంపుతారు. అదే సంస్థ వద్ద ఇతర రుణాలేమైనా ఉంటే వాటిని కూడా నిరర్థక ఆస్తుల (NPA) పరిధిలోకి తీసుకొస్తారు.
క్రెడిట్ స్కోర్పై..
మీ హోంలోన్ ఒకసారి మేజర్ డిఫాల్ట్ కిందకు వెళ్లిందంటే.. అది మీ క్రెడిట్ స్కోర్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీ క్రెడిట్ రిపోర్ట్లో ఎగవేతదారు అనే రిమార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో భవిష్యత్తులో రుణాలు తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. మీ క్రెడిట్ స్కోర్ అమాంతం పడిపోతుంది. దీని ఆధారంగానే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణాలను మంజూరు చేస్తాయి. మీ స్కోర్ మెరుగ్గా లేకపోతే.. వడ్డీరేటు అధికంగా ఉంటుంది.
మరి ఏం చేయాలి?
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి మీరు ఈఎంఐ చెల్లించలేకపోతే.. బ్యాంకుతో చర్చించి లోన్ కాలపరిమితి పెంచమని కోరండి. తద్వారా ఈఎంఐ మొత్తం తగ్గుతుంది. తర్వాత నిధులు సమీకరించుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. బంధువులు, సన్నిహితుల దగ్గరి నుంచి చేబదులు తీసుకునే అవకాశం ఉంటే ఉపయోగించుకోవాలి. మీ పెట్టుబడులను ఉపసంహరించుకునే మార్గాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అప్పటికీ.. కష్టంగా ఉంటే మీ ఇతర ఆస్తులేమైనా ఉంటే లీజుకు ఇవ్వడమో లేక అమ్మడమో చేయాలి. ఆ ప్రత్యామ్నాయం లేకపోతే.. చివరగా ఇంటిని మీరే విక్రయించి లోన్ పూర్తిగా చెల్లించే మార్గాన్ని పరిశీలించాలి. అయితే, దీనికి ముందు కచ్చితంగా బ్యాంకును సంప్రదించాలి. వారితో మీ పరిస్థితిని చర్చించాలి. ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. ఎప్పుడైనా లోన్ తీసుకునేటప్పుడు అత్యవసర నిధి కింద ఒక ఆరు నెలల ఈఎంఐలకు సరిపడా డబ్బును జమ చేసి పెట్టుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వైడ్ బాడీ విమానాలకు ఆర్డర్ పెట్టింది. తద్వారా ఎయిరిండియాకు గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. -
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
టెలికాం మార్కెట్లో తిరిగి పుంజుకుంటామని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పారు. వీఐ 2.0 ప్రస్థానం ప్రారంభం కాబోతోందన్నారు. -
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
Tech Mahindra: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా మార్చితో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. లాభంలో భారీ క్షీణతను నమోదు చేసుకుంది. -
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
Credit card: క్రెడిట్ కార్డు ద్వారా జరుపుతున్న లావాదేవీలు 2024 మార్చిలో సరికొత్త మైలురాయిని చేరాయి. -
15 లక్షల వాహనాల ఉత్పత్తే టార్గెట్.. హ్యుందాయ్ మోటార్ గ్రూప్
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ భారత్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని, మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 486, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
Bank charges: సేవింగ్స్ ఖాతాకు సంబంధించిన పలు సేవలపై విధించే ఛార్జీలను ఐసీఐసీఐ, యెస్ బ్యాంకులు సవరించాయి. మే 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. -
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
Zomato: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు అందించడంలో భాగంగా కొత్తతరహా సేవలకు శ్రీకారం చుట్టనుంది. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం భారీగా నష్టపోయాయి. -
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
Audi: భారత్లో విక్రయిస్తున్న అన్ని రకాల కార్లపై గరిష్ఠంగా రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ఆడి ఇండియా ప్రకటించింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట