Card tokenisation: జులై 1 నుంచి కార్డు చెల్లింపులకు కొత్త రూల్.. ఇంతకీ టోకనైజేషన్ చేశారా?
card tokenisation explained in telugu: ఆన్లైన్లో క్రెడిట్/ డెబిట్ కార్డుతో చెల్లింపులకు సంబంధించి ఆర్బీఐ తీసుకొచ్చిన టోకనైజేషన్ విధానం జులై 1 నుంచి అమల్లోకి రానుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆన్లైన్లో క్రెడిట్/ డెబిట్ కార్డుతో చెల్లింపులకు సంబంధించి కొత్త రూల్ అమల్లోకి రానుంది. వినియోగదారుల సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు చిక్కకుండా ఉండేందుకు ఆర్బీఐ (RBI) తీసుకొచ్చిన టోకనైజేషన్ (Card tokenisation) విధానం జులై 1 నుంచి అమలు కానుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ విధానం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న వేళ.. అసలేమిటీ టోకనైజేషన్? చేయకపోతే ఏమవుతుంది? వంటి వివరాలు తెలుసుకుందాం..
అమెజాన్, ఫ్లిప్కార్ట్.. స్విగ్గీ, జొమాటో.. ఉబర్, ఓలా.. అమెజాన్, నెట్ఫ్లిక్స్.. ఇలా నిత్యం చాలా యాప్స్/వెబ్సైట్లు వాడుతూ ఉంటాం. వాటిలో మన క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు వివరాలను ఉపయోగించి లావాదేవీలు చేస్తుంటాం. కొత్తగా కొనుగోలు చేసే వారు కార్డుకు సంబంధించిన అన్ని వివరాలూ (కార్డు నంబర్, ఎక్స్పైరీ డేట్, సీవీవీ) ఇచ్చి, తర్వాత ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా లావాదేవీ పూర్తి చేస్తుంటారు. మరోసారి అదే యాప్/వెబ్సైట్లో లావాదేవీ చేసినప్పుడు మన కార్డు వివరాలు నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి ఆ వివరాలేవీ ఎంటర్ చేయకుండానే పని పూర్తి చేసేయొచ్చు.
ఇకపై అన్ని వివరాలూ ఇవ్వాల్సిందేనా?
ఇలా మనం కార్డు వివరాలు ఇచ్చినప్పుడు మన సున్నితమైన సమాచారం ఆయా సంస్థల వద్ద నిక్షిప్తమై ఉంటుంది. దీనివల్ల సైబర్ నేరగాళ్లు ఆయా సంస్థల వెబ్సైట్లలోకి చొరబడినప్పుడు మన వివరాలు వారి చేతికి చిక్కుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ ఈ టోకనైజేషన్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఒకసారి టోకనైజ్ చేస్తే కేవలం సీవీవీ, ఓటీపీ ఎంటర్ చేసి లావాదేవీని పూర్తి చేయొచ్చు. ఒకవేళ టోకనైజ్ చేసేందుకు సదరు సంస్థకు అనుమతి ఇవ్వకుంటే మీరు లావాదేవీ జరిపే ప్రతిసారీ కార్డు వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది.
మరి, కొత్తగా ఏం మారింది?
మునుపు కార్డు వివరాలు ఇస్తే ఆ వివరాలన్నీ సంస్థల వద్ద నమోదయ్యేవి. టోకనైజేషన్ పద్ధతిలో అలా నమోదు కావు. టోకనైజేషన్ విధానంలో కార్డు వివరాలేమీ మర్చంట్ ప్లాట్ఫామ్లు, పేమెంట్ గేట్వేలు నిక్షిప్తం చేయడానికి వీలుండదు. ‘టోకెన్’గా వ్యవహరించే ప్రత్యామ్నాయ కోడ్ సాయంతో లావాదేవీని పూర్తి చేయొచ్చు. ఈ టోకెన్ పొందాలంటే చెల్లింపు జరిపే సైట్లో టోకెన్ రిక్వెస్టర్కు వినతి పెట్టుకోవాలి. వినియోగదారు నుంచి కార్డు టోకనైజేషన్ వినతులను స్వీకరించే సంస్థను టోకెన్ రిక్వెస్టర్గా వ్యవహరిస్తారు. ఈ సంస్థ వినియోగదారు వినతిని కార్డ్ నెట్వర్క్ సంస్థకు పంపిస్తుంది. కార్డు జారీదారు సమ్మతితో కార్డు, టోకెన్ రిక్వెస్టర్, డివైజ్ కాంబినేషనల్లో టోకెన్ను కార్డ్ నెట్వర్క్ సంస్థ జారీ చేస్తుంది. ఇలా కార్డు వివరాలకు బదులుగా ‘టోకెన్’ ఇవ్వడాన్ని టోకనైజేషన్ అంటారు. టోకనైజ్డ్ కార్డు లావాదేవీలు సురక్షితమైనవి. లావాదేవీ జరిపే సమయంలో వ్యాపారులకు కార్డు వివరాలు పంచుకోవాల్సిన అవసరం లేకపోవడమే ఇందుకు కారణం. వేర్వేరు చెల్లింపు ప్లాట్ఫామ్లకు ప్రత్యేక టోకెన్ ఉంటుంది. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫోన్పే.. ఇలా ఒక్కో సంస్థకు ఒక్కో టోకెన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆ యాప్ నుంచి వైదొలిగితే మీ టోకెన్ను క్యాన్సిల్ చేయాల్సిందిగా సదరు సంస్థను కోరొచ్చు. దీన్నే డీ-టోకనైజేషన్ అంటారు.
తప్పనిసరిగా చేయాల్సిందేనా?
టోకనైజేషన్ విషయంలో తుది నిర్ణయం వినియోగదారునిదే. కంపెనీలేవీ టోకనైజ్ చేయాలని ఒత్తిడి చేయడానికి వీల్లేదు. టోకనైజ్ చేసేందుకు గానూ కార్డు జారీ సంస్థ ఎలాంటి రుసుమూ వసూలు చేయకూడదు.
ఈ సారైనా అమలయ్యేనా?
టోకనైజేషన్ విధానం అమలు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తొలుత ఈ విధానాన్ని ఆర్బీఐ 2020 మేలో ప్రతిపాదించింది. తొలుత 2021 జూన్ 30వ తేదీని గడువుగా నిర్ణయించారు. అనంతరం పేమెంట్ అగ్రిగేటర్లు, వ్యాపారులు, బ్యాంకులు సన్నద్ధత వ్యక్తం చేయకపోవడంతో ఆ గడువు తేదీని 2021 డిసెంబర్ 31కి మార్చారు. అప్పటికీ మరోసారి గడువు పొడిగించాలని వినతులు రావడంతో ఆర్బీఐ మరో ఆరు నెలలు గడువు పొడిగించింది. దీంతో జులై 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇప్పటికే చాలా మంది వినియోగదారులు టోకనైజేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. దీంతో నిర్దేశించిన గడువు తేదీ నుంచి అమల్లోకి రావడం పక్కా అని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు