Doxxing: మస్క్ నోట ‘డాక్సింగ్’ మాట.. ఇంతకీ ఏమిటీ రూల్?
Doxxing In telugu: డాక్సింగ్ రూల్ను ఉల్లంఘించారంటూ కొన్ని ట్విటర్ ఖాతాలపై ట్విటర్ వేటు వేసింది. ఇంతకీ డాక్సింగ్ అంటే ఏమిటి? ఆ ఖాతాలను మస్క్ ఎందుకు సస్పెండ్ చేశారు?
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్ అధిపతి ఎలాన్ మస్క్ (Elon musk) ఏది చేసిన సంచలనమే. ట్విటర్ను కొంటానంటాడు.. అంతలోనే కొనబోనని ప్రకటిస్తాడు. వాక్ స్వాతంత్య్రానికి పెద్దపీట వేస్తానని చెప్తూనే.. మరోవైపు కొందరి ఖాతాలను నిలిపివేస్తాడు. ఈ క్రమంలోనే కొందరి జర్నలిస్టుల ఖాతాలనూ సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది. ఇందుకు గానూ ఆయన ఆయన వాడిన పదమే.. డాక్సింగ్ (Doxxing). దీంతో ఈ పదం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇంతకీ డాక్సింగ్ అంటే?
డ్రాపింగ్ డాక్స్ (dropping dox)ను సంక్షిప్తంగా డాక్సింగ్గా (Doxxing) పేర్కొంటారు. సింపుల్గా చెప్పాలంటే వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం అన్నమాట. ఒక వ్యక్తికి సంబంధించి సమాచారాన్ని అతడి అనుమతి లేకుండా ఆన్లైన్లో పోస్ట్ చేయడాన్ని డాక్సింగ్గా వ్యవహరిస్తారు. పేరు, అడ్రస్, చిరునామా, ఫోన్ నంబర్, ఇ-మెయిల్ అడ్రస్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని డాక్సింగ్గా పేర్కొంటారు.
ఈ రూల్ను మస్క్ ఎందుకు తీసుకొచ్చాడు?
- మస్క్కు ఇటీవల వ్యక్తిగతంగా ఎదురైన రెండు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా ట్విటర్లో డాక్సింగ్ రూల్ను తీసుకొచ్చారు. ఇటీవల ఎలాన్ మస్క్కు సంబంధించిన ప్రైవేట్ జెట్ విమానం రియల్టైమ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్న ‘ఎలాన్జెట్’ అనే ఖాతాను ట్విటర్ సస్పెండ్ చేసింది. లొకేషన్ వివరాలను జాక్ స్వీనీ అనే యువకుడు పోస్ట్ చేస్తుండడంపై మస్క్ వారించినప్పటికీ వినకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
- అలాగే తన తన రెండేళ్ల కుమారుడుతో కారులో వెళుతుండగా.. ఓ వ్యక్తి కారును వెంబడించినట్లు మస్క్ గుర్తించాడు. సంబంధిత వీడియోను మస్క్ పోస్ట్ చేస్తూ.. ముసుగు వేసుకున్న అపరిచితుడిని గుర్తించాలంటూ కోరాడు. ఈ నేపథ్యంలోనే ఎలాన్ మస్క్ డాక్సింగ్ నిబంధన గురించి ట్వీట్ చేశాడు. ఏదైనా ఖాతా వ్యక్తుల రియల్ టైమ్ డేటాను షేర్ చేస్తే అలాంటి ఖాతాలను ట్విటర్ నిలిపివేస్తుందని తెలిపారు.
ట్విటర్ కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయ్?
ఎవరైనా వ్యక్తి ప్రైవేట్ లేదా లైవ్ లొకేషన్ సమాచారం షేర్ చేస్తే అలాంటి ఖాతాలను కంటెంట్ తొలగించమని ట్విటర్ సదరు యూజర్ను కోరుతుంది. అదే సమయంలో తాత్కాలికంగా ఆ ఖాతాను నిలిపివేస్తుంది. అదే తప్పును మళ్లీ చేస్తే పూర్తిగా ఆ ఖాతాను నిలిపివేస్తుంది. ఎవరైనా వ్యక్తికి సంబంధించిన లొకేషన్ షేర్ చేస్తే ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతుందని ట్విటర్ తెలిపింది. అలాగే వ్యక్తుల ప్రైవేట్ మీడియాను వారి అనుమతి లేకుండా షేర్ చేస్తే సంబంధిత కంటెంట్ తొలగించమని చెప్పడంతో పాటు తాత్కాలికంగా ఆ ఖాతా నిలిపివేయనున్నట్లు ట్విటర్ తన కొత్త నిబంధనల్లో పేర్కొంది.
మరి మస్క్పై విమర్శలెందుకు?
డాక్సింగ్ రూల్స్ పేరిట తాత్కాలికంగా నిలిపివేసిన ఖాతాల్లో కొందరు జర్నలిస్టుల ఖాతాలు కూడా ఉన్నాయి. అందులో సీఎన్ఎన్, ది టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్కు చెందిన జర్నలిస్టులు ఉన్నారు. మస్క్ను విమర్శించినందుకే వారి ఖాతాలపై నిషేధం విధించారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, తన నిర్ణయాన్ని మస్క్ సమర్థించుకున్నారు. డాక్సింగ్ నిబంధనలు జర్నలిస్టులు సహా అందరికీ వర్తిస్తాయని పేర్కొన్న మస్క్.. తాజాగా ఆ ఖాతాలపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!