Foreign Investors: భారత్పై విదేశీ మదుపర్ల ఆసక్తికి కారణాలివేనా?
2021 అక్టోబరు - 2022 జూన్ మధ్య విదేశీ మదుపర్లు (FII) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అయితే, జులై నుంచి పరిస్థితి మారింది. పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. కారణాలేంటో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: 2021 అక్టోబరు - 2022 జూన్ మధ్య విదేశీ మదుపర్లు (FII) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దాదాపు 30 బిలియన్ డాలర్ల నిధుల్ని వెనక్కి తీసుకున్నారు. జులై నుంచి పరిస్థితులు మారాయి. జులైలో నికరంగా దాదాపు రూ.5,000 కోట్లు భారత మార్కెట్లలోకి తరలించగా.. ఆగస్టులో అది మరింత జోరందుకుంది. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.44,500 కోట్లు మన దేశ ఈక్విటీల్లోకి మళ్లించారు.
2022 ఆరంభం నుంచి చూసుకుంటే.. తైవాన్ తర్వాత అత్యధికంగా విదేశీ పెట్టుబడులు తరలివెళ్లింది భారత్ నుంచే. అదే బ్రెజిల్ మార్కెట్లలోకి మాత్రం 10 బిలియన్ డాలర్ల నిధులు వచ్చి చేరాయి. మరి ఇలా ఒక్కసారిగా భారత మార్కెట్లపై విదేశీ మదుపర్లకు మక్కువ పెరగడానికి కారణమేంటి? అనే దానిపై పలువురు ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేయనున్న భారత్లో అవకాశాలను చేజార్చుకుంటున్నామనే అభిప్రాయం విదేశీ మదుపర్లలో కలిగి ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో 2021లో భారీగా పెరిగిన సూచీలు ఈ మధ్య కాలంలో దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో భారత స్టాక్స్ ధరలు ఆకర్షణీయంగా మారాయని కూడా ఎఫ్ఐఐలు భావించి ఉండొచ్చని మరో విశ్లేషణ.
అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండడంతో రానున్న నెలల్లో రేట్ల పెంపు వేగాన్ని తగ్గించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విదేశీ మదుపర్ల వైఖరిని మార్చిందని నిపుణులు చెబుతున్నారు. వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన వృద్ధిరేటు నమోదు చేసే అవకాశం ఉండడం; కమొడిటీ, చమురు ధరలు దిగిరావడం; వర్ధమాన దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలంగా ఉండడం కూడా విదేశీ పెట్టుబడులు తిరిగి భారత్లోకి రావడానికి కారణమని బీఓఎఫ్ఏ సెక్యూరిటీస్ తమ నివేదికలో తెలిపింది.
ఈ పరిణామాలకు దేశీయ సంస్థాగత మదుపర్లు, రిటైల్ మదుపర్ల కొనుగోళ్లు జత కావడం నిఫ్టీ, సెన్సెక్స్ సూచీల రాణింపునకు ప్రధాన కారణమని బీఓఎఫ్ఏ సెక్యూరిటీస్ పేర్కొంది. జులై ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఈ రెండు ప్రధాన సూచీలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఇక నుంచి విదేశీ మదుపర్ల భారీ అమ్మకాలు ఉండకపోవచ్చునని బీఓఎఫ్ఏ తెలిపింది. అయితే, మధ్యలో స్వల్ప దిద్దుబాటు మాత్రం ఎదురయ్యే అవకాశం ఉందని మరికొంత మంది మార్కట్ విశ్లేషకులు వెల్లడించారు. దాన్ని కొనుగోళ్లకు అవకాశంగా ఉపయోగించుకోవాలని సూచించారు. తైవాన్-చైనా ఉద్రిక్తతలు, అంచనాలకు భిన్నంగా రేట్ల పెంపు విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వు దూకుడుగా వ్యవహరించడం సూచీలకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!