పన్ను రిటర్నులు ఈ తప్పులు చేయొద్దు
గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే తరుణం వచ్చేసింది. ఆదాయపు పన్ను విభాగం రిటర్నుల పత్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఇప్పటికే వెల్లడించింది.
గత ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే తరుణం వచ్చేసింది. ఆదాయపు పన్ను విభాగం రిటర్నుల పత్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి (2023-24 మదింపు సంవత్సరం) రిటర్నులు దాఖలు చేసేటప్పుడు తప్పులు లేకుండా చూసుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
ఆదాయపు పన్ను విభాగం ఇప్పటి వరకూ తెలియజేసిన సమాచారం ప్రకారం ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కొన్ని కార్యాలయాల్లో ఫారం-16 అందించారు. వీటి ఆధారంగా సులభంగానే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుంది.
సరైన పత్రంలో..
పన్ను చెల్లింపుదారులు చేసే అత్యంత సాధారణ పొరపాట్లలో ఒకటి ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకోవడం. సరైన ఫారంలోనే వివరాలను దాఖలు చేయడం కచ్చితంగా అవసరం. ఆదాయపు పన్ను రిటర్నుల ఫారాలు మొత్తం ఏడు రకాలుగా ఉంటాయి. వ్యక్తులకు రూ.50లక్షల వరకూ వేతనం, ఒక ఇంటిపై ఆదాయం, వడ్డీ తదితర మార్గాల్లో ఆదాయం వస్తున్నప్పుడు ఐటీఆర్-1 దాఖలు చేయొచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలకు రూ.50లక్షలకు పైగా ఆదాయం ఉన్నప్పుడు ఐటీఆర్-4ను ఎంచుకోవచ్చు. ఐటీఆర్-2ను రూ.50లక్షలకు పైగా ఆదాయం ఉండి, ఒకే ఇంటి ద్వారా ఆదాయం ఉన్నప్పుడు దాఖలు చేయాలి. వృత్తి నిపుణులు, ఐటీఆర్-1, ఐటీఆర్-2ల విషయంలో అనుమానం ఉన్నవారు ఐటీఆర్-3ని ఎంచుకోవచ్చు. షేర్లలో క్రయవిక్రయాలు చేసినప్పుడు మీరు నిర్వహించిన లావాదేవీల ఆధారంగా ఐటీఆర్-2 లేదా ఐటీఆర్ 3ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మిగతా పత్రాలు కంపెనీలు, వ్యాపార సంస్థలకు వర్తిస్తాయి. వ్యక్తులకు వీటితో సంబంధం ఉండదు.
ఆదాయాలన్నీ..
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు అన్ని ఆదాయాలనూ తప్పనిసరిగా నివేదించాలి. కొంతమంది కొన్ని ఆదాయాలను పేర్కొనరు. ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్లే. ఆదాయపు పన్ను శాఖ దీన్ని గుర్తిస్తే నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. చాలామంది వ్యక్తులు తమ వేతనాన్ని మాత్రమే నమోదు చేస్తారు. బ్యాంకు పొదుపు ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమా పాలసీల నుంచి వచ్చిన ఆదాయం, పీపీఎఫ్ వడ్డీలను పట్టించుకోరు. మినహాయింపు పరిధిలోకి వచ్చే ఆదాయ వివరాలనూ రిటర్నులలో చూపించాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి. మైనర్ పిల్లల పేరుతో పెట్టుబడులు ఉండి, వాటి ద్వారా ఆదాయం వస్తుంటే.. ఆ మొత్తాన్నీ అసెసీ ఆదాయంలో భాగంగానే పరిగణిస్తారు.
మినహాయింపులు చూసుకోండి..
ఆదాయపు పన్ను మినహాయింపుల్లో సెక్షన్ 80సీ ప్రధానం. నిబంధనల ప్రకారం ఈ సెక్షన్ కింద వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేసి, రూ.1,50,000 వరకూ మినహాయింపు పొందవచ్చు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, గృహరుణం అసలు, పిల్లల ట్యూషన్ ఫీజులు, జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియం తదితరాలన్నీ ఈ సెక్షన్ పరిధిలోకే వస్తాయి. సెక్షన్ 80డీలో ఆరోగ్య బీమా ప్రీమియం వివరాలు నమోదు చేయాలి. పన్ను ఆదా కోసం మీరు పెట్టిన అన్ని రకాల పెట్టుబడులనూ రిటర్నులలో సరిగ్గా పేర్కొనాలి.
టీడీఎస్ జమ చేశారా?
కొన్నిసార్లు ఆదాయపు పన్ను దగ్గర ఉన్న వివరాలకూ, మీ ఫారం-16కూ సరిపోకపోవచ్చు. మీ వద్ద వసూలు చేసిన పన్నును ఆదాయపు పన్ను విభాగానికి జమ చేయకపోవడం వల్ల ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. రిటర్నులు దాఖలు చేసేముందు మీ ఫారం-16, ఫారం 16ఏ, 26ఏఎస్, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లను పూర్తిగా పరిశీలించండి. ఏదైనా తేడా ఉంటే మీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, సరిచేసుకోండి. పొరపాట్లతో రిటర్నులు సమర్పిస్తే నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Education News
TSPSC: టీఎస్పీఎస్సీ గ్రూప్-1 హాల్టికెట్లు విడుదల
-
India News
Odisha Train Accident: ప్రమాదం జరగడానికి కారణమిదే: రైల్వే మంత్రి
-
Movies News
keerthy suresh: పెళ్లి కుదిరితే నేనే స్వయంగా ప్రకటిస్తాను..: కీర్తి సురేశ్
-
Sports News
WTC Final: అలాంటి బంతులను సంధించాలి.. లేదంటే గిల్ చేతిలో శిక్ష తప్పదు: గ్రెగ్ ఛాపెల్
-
India News
Odisha Train Accident: ఎన్డీఆర్ఎఫ్ను తొలుత అప్రమత్తం చేసింది అతడే..
-
World News
Odisha Train Accident: నా హృదయం ముక్కలైంది.. రైలు ప్రమాదంపై బైడెన్ దిగ్భ్రాంతి