WhastApp: త్వరలో వాట్సాప్ యాప్లో ట్రూకాలర్ సేవలు!
కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ (Truecaller) త్వరలో తన సేవలను మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp)లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్ (WhatsApp)లో వచ్చే స్పామ్/స్కామ్ కాల్స్ను సులువుగా గుర్తించేందుకు వీలుగా త్వరలో మరో అదనపు సర్వీస్ యాప్లో అందుబాటులోకి రానుంది. కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ (Truecaller) తన సేవలను వాట్సాప్ యాప్లో కూడా పరిచయం చేయనుంది. ఈ మేరకు ట్రూకాలర్ సీఈవో అలన్ మమేది (Alan Mamedi) వెల్లడించారు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ను మే తర్వాత ప్రపంచవ్యాప్తంగా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
2021 ఏడాదికి సంబంధించి ట్రూకాలర్ రూపొందించిన నివేదిక ప్రకారం భారత్ వంటి దేశాల్లో సగటున ఒక యూజర్కు రోజులో 17 టెలిమార్కెటింగ్ , స్కామింగ్ కాల్స్ వస్తున్నట్లు పేర్కొంది. వీటిని అడ్డుకునేందుకు మే 1 నుంచి టెలికాం నెట్వర్క్ ఆపరేటర్లు (AIrtel, Jio, Vodafone Idea, BSNL) ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్ సేవల్లో కృత్రిమ మేధ (AI) ఆధారిత స్పామ్ ఫిల్టర్స్ను ఉపయోగించాలని ట్రాయ్ (TRAI) సూచించింది. ఈ ఏఐ ఆధారిత ఫిల్టర్స్ వేర్వేరు వ్యక్తులు లేదా సంస్థల నుంచి వచ్చే నకిలీ, మార్కెటింగ్ కాల్స్తోపాటు మెస్సేజ్లను గుర్తించి అడ్డుకుంటాయి. దీంతో టెలీ మార్కెటింగ్ సంస్థలు వాట్సాప్ ద్వారా యూజర్లకు కాల్స్ చేయడం ప్రారంభించాయి. గత రెండు వారాలుగా దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని కట్టడి చేసేందుకు ట్రూకాలర్ సేవలను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అలన్ మమేది తెలిపారు. దీనికి సంబంధించి టెలికాం ఆపరేటర్లతో ట్రూకాలర్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు.
వాట్సాప్ యాప్కు భారత్లో పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నారు. ఈ యాప్ యూజర్లు తమకు తెలియని నంబర్ల నుంచి అభ్యంతరకర మెసేజ్లు, కాల్స్ వస్తే వాట్సాప్కు ఫిర్యాదు చేయొచ్చు. అనంతరం సదరు ఖాతాలపై వాట్సాప్ చర్యలు తీసుకుంటుంది. అలా ప్రతి నెలా యూజర్ల ఫిర్యాదు, ఏఐ స్పామ్ ఫిల్టర్ల ద్వారా వేల సంఖ్యలో ఖాతాలపై వాట్సాప్ నిషేధిస్తుంది. ట్రూకాలర్కు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. ఈ యాప్కు ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ యూజర్లు ఉంటే.. వారిలో 250 మిలియన్ యూజర్లు భారత్లోనే ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాపిల్ WWDC 2024 తేదీలు వచ్చేశాయ్..
WWDC 2024: యాపిల్ ఏటా నిర్వహించే వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ తేదీలను ప్రకటించింది. -
‘ఎక్స్’ ప్రీమియంలో కొత్త ఫీచర్.. ఏఐ చాట్బాట్ ‘గ్రోక్’కు యాక్సెస్
Social Media X: ఎక్స్ ప్రీమియం సబ్స్క్రైబర్ల కోసం ఎలాన్ మస్క్ మరో కొత్త ఫీచర్ను అందిస్తున్నారు. -
పోకో నుంచి ఎంట్రీ లెవల్ ఫోన్.. ఫీచర్లు ఇవే..
Poco C61: పోకో తన ‘‘సీ’’ సిరీస్లో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. మార్చి 28 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయని పేర్కొంది. -
లెనోవో నుంచి కొత్త ట్యాబ్.. ఫీచర్లు ఇవిగో..!
లెనోవో కంపెనీ కొత్త ట్యాబ్ను లాంచ్ చేసింది. దీని ధరను రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది. -
Airtel: ఏడాది వ్యాలిడిటీతో ఎయిర్టెల్ ప్లాన్లు ఇవే..
Airtel: ఎయిర్టెల్ త్వరలో టారిఫ్లను పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది వ్యాలిడిటీతో ఈ టెలికాం సంస్థ అందిస్తున్న ప్లాన్లు ఏంటో చూద్దాం. ప్లాన్ల ధరలు పెరగక ముందే వీటితో రీఛార్జ్ చేసుకుంటే ఎంతో కొంత ఆదా అయ్యే అవకాశం ఉంది. -
టిక్టాక్పై నిషేధం ముప్పు.. అమెరికాలో బైట్ డ్యాన్స్ ‘కొత్త’ ప్లాన్!
టిక్టాక్పై నిషేధం ముప్పు పొంచి ఉన్న వేళ.. దాని మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ కొత్త స్కెచ్ వేసింది. కొత్త యాప్ను విపరీతంగా ప్రమోట్ చేస్తోంది. -
Snapchat: హోలీ వేళ స్నాప్చాట్ పిచికారీ లెన్స్.. ఎలా పనిచేస్తుందంటే?
Snapchat: సందర్భానుసారంగా ఎప్పటికప్పుడు కొత్త లెన్స్లను తీసుకొచ్చే స్నాప్చాట్ తాజాగా హోలీ నేపథ్యంలో ఏఆర్ పిచికారీ అనే లెన్స్ను ప్రవేశపెట్టింది. -
Samsung: ఏఐ టూల్స్తో శాంసంగ్ కొత్త ల్యాప్టాప్
Samsung Laptop: ఫొటో రీమాస్టరింగ్, వీడియో ఎడిటింగ్ లాంటి ఏఐ టూల్స్తో శాంసంగ్ కొత్త ల్యాప్టాప్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి. -
Lava O2: బడ్జెట్ ధరలో లావా కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే
Lava O2: లావా బడ్జెట్ ధరలో కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. మార్చి 27 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయని కంపెనీ పేర్కొంది. -
Airtel: ఎయిర్టెల్ కొత్త ఆఫర్.. ఎమర్జెన్సీలో వ్యాలిడిటీ లోన్!
Airtel Validity Loan: ఇప్పటివరకు డేటాను మాత్రమే అప్పుగా ఇచ్చిన ఎయిర్టెల్ ఇకపై వ్యాలిడిటీని కూడా లోన్గా ఇవ్వనుంది. ప్లాన్ గడువు ముగిసిన వెంటనే రీఛార్జ్ చేసుకోలేని వారికి ఇది ఉపయోగకరంగా ఉండనుంది. -
Reliance Jio: ఐపీఎల్ వేళ జియో కొత్త ప్లాన్.. రూ.49తో 25జీబీ డేటా
Reliance Jio: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్ల కోసం కొత్త డేటా ప్లాన్ తీసుకొచ్చింది. -
WhatsApp: వాట్సప్ పిన్ ఫీచర్ మరింత మెరుగ్గా.. ఇకపై 3 మెసేజ్ల వరకు
WhatsApp: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందించే వాట్సప్ తాజాగా మరో అప్డేట్తో ముందుకొచ్చింది. పిన్ ఫీచర్ను మరింత మెరుగుపర్చినట్లు వెల్లడించింది. -
Ai pin: స్మార్ట్ డివైజ్తో మీ పనులు ఈజీ.. ఇక ఫోన్ అక్కర్లేదేమో!
Humane Ai Pin: హ్యూమన్ ఏఐ పిన్.. స్మార్ట్ఫోన్కు సవాలు విసురుతోంది. ఫోన్ చేయగలిగే అన్ని పనులూ చేసేస్తూ ఔరా అనిపిస్తోంది. -
Whatsapp: వాట్సప్ కొత్త ఫీచర్.. త్వరలో టెక్ట్స్ రూపంలోకి వాయిస్ మెసేజ్!
Whatsapp: వాట్సప్ వాయిస్ సందేశాలను కొన్ని సందర్భాల్లో వినలేం. దీనికి పరిష్కారంగా దాన్ని టెక్ట్స్ రూపంలోకి మార్చుకునేలా వాట్సప్ కొత్త ఫీచర్ను సిద్ధం చేస్తోంది. -
OnePlus 12R: వన్ప్లస్ 12ఆర్లో కొత్త వేరియంట్.. ధర, ఫీచర్లివే..!
OnePlus 12R: జనవరిలో విడుదలైన వన్ప్లస్ 12ఆర్లో తాజాగా మరో కొత్త వేరియంట్ వచ్చింది. దాని ఫీచర్లు, ధర వివరాలను చూద్దాం..! -
Vivo T3: వివో కొత్త ఫోన్.. T3 5జీ స్పెసిఫికేషన్స్ ఇవే!
Vivo T3: వివో టీ3 పేరిట కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభం అవుతుంది. మార్చి 27 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. -
AI జనరేటెడ్ వీడియోలు గుర్తించడం ఇకపై సులువు.. యూట్యూబ్ కొత్త రూల్స్
YouTube: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. వీటి సాయంతో యూజర్లు సులభంగా ఏఐ కంటెంట్, వాస్తవిక వీడియోల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవచ్చని తెలిపింది. -
Jio AirFiber: ఎయిర్ఫైబర్ యూజర్లకు జియో ఆఫర్.. ఫ్రీగా ట్రిపుల్ డేటా స్పీడ్
Jio AirFiber data offer: ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్న వేళ ఎయిర్ ఫైబర్ యూజర్లకు జియో ఆఫర్ ప్రకటించింది. అధిక డేటా స్పీడ్ను ఆఫర్ చేస్తోంది. -
WhatsApp: త్వరలో వాట్సప్ స్టేటస్లో నిమిషం వీడియో!
WhatsApp: వాట్సప్లో ప్రస్తుతానికి 30 సెకన్ల వీడియోను మాత్రమే అప్లోడ్ చేయగలం. సుదీర్ఘ నిడివి గల వీడియోలను సైతం పోస్ట్ చేసేందుకు త్వరలో ఈ సామాజిక మాధ్యమం అవకాశం ఇవ్వనుంది. -
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్తో నాయిస్ జట్టు.. స్మార్ట్వాచ్తోనే పేమెంట్స్
Smart Watch: ఎయిర్టెల్ పేమెంట్స్, మాస్టర్కార్డ్తో కలసి నాయిస్ కొత్త స్మార్ట్వాచ్ను లాంచ్ చేసింది. డిజిటల్ లావాదేవీలను మరింత సులభతరం చేయడం కోసం దీన్ని తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. -
Vodafone Idea: ₹169 రీఛార్జితో 90 రోజుల డిస్నీ సబ్స్క్రిప్షన్.. వొడా కొత్త ప్లాన్
Vodafone Idea: డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు