Retirement Fund: పదవీ విరమణ పథకాల మీద సర్వే.. టాప్-3లో ఇవే!
పదవీ విరమణకు 3 రంగాలను తమ డబ్బుని మదుపు చేయడానికి ఎంచుకుంటున్నారని ఒక సర్వే తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: పదవీ విరమణ జీవితానికి చాలా మంది చాలా ఆర్థిక ప్రణాళికలు అమలుచేస్తూ ఉంటారు. అయితే, పదవీ విరమణ తర్వాత ఎలా జీవించాలి అనే విషయమై ఏదైనా ఉపాధి ప్రారంభంలోనే (సంపాదిస్తున్నప్పుడే) ప్రణాళిక అమలు చేయడం మంచిది. చాలా మంది పదవీ విరమణకు 3 రంగాలను తమ డబ్బుని మదుపు చేయడానికి ఎంచుకుంటున్నారని ఓ సర్వే తెలిపింది.
డిజిటల్ వెల్త్ మేనేజర్ స్క్రిప్బాక్స్.. 34-55 సంవత్సరాల వయస్సు గల 1400 మందిని సర్వే చేసింది. వీళ్లందరూ అత్యధిక శాతం మంచి నమ్మకంతో స్థిరాదాయం గల రంగాలలో పెట్టుబడి పెడుతున్నామని తెలిపారు. 75% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడికి అగ్రస్థానం ఇచ్చారు. ఆ తర్వాత ఈపీఎఫ్కి 44% మంది అనుకూలంగా ఉన్నారు. పీపీఎఫ్లో పెట్టుబడికి 43% మంది ఆమోదం తెలిపారు. పదవీ విరమణకు పెట్టుబడి ఎంపికగా బీమాను 23% మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. బీమా అనేది పెట్టుబడి సాధనం కాదని, జీవిత రక్షణకు ఉపయోగపడే అంశం మాత్రమేనని చాలా మంది తెలపడం విశేషం.
మదుపు చేసే వారిలో చాలా మందికి దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి మంచి అవగాహన, జీవితంలో పదవీ విరమణ అనంతరం (2వ ఇన్నింగ్స్లో) ఆర్థిక స్వేచ్ఛను సాధించాలనే తపన చాలా ఎక్కువ ఉండటం కూడా ఈ సర్వే కనుగొంది. 75% కంటే ఎక్కువ మంది తమ జీవిత లక్ష్యాలను సాధించడంలో ఆర్థిక ప్రణాళికను కలిగి ఉండాలని, అవసరమైతే ఆర్థిక సలహాదారుని అవసరాన్ని గుర్తించారు. అయితే, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో 65% మంది తమ ఆర్థిక వ్యవహారాలను సొంతంగా నిర్వహించుకుంటున్నారని, 20% మంది మాత్రమే వృత్తిపరమైన సలహాలు పొందాలని ఆలోచిస్తున్నారని అధ్యయనం చెబుతుంది.
62% మంది 30 ఏళ్లు నిండిన తర్వాత పదవీ విరమణ కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తున్నారు. ఈ వయస్సులోనే పదవీ విరమణ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం మంచి పరిణామమే. ఆర్థిక రంగంలో వేగంగా పట్టు సాధించాలన్నా, పరిశోధన చేయాలన్నా, లెక్కల్లో కచ్చితత్వం, నిర్ణయాలు తీసుకోవడంలో వేగం పెరగాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ అవసరం ఉందని చాలా మంది మదుపుదారులు గుర్తించారు.
ఇవే ఎందుకంటే...?
మ్యూచువల్ ఫండ్స్: స్వల్పకాల పెట్టుబడులతో లాభాలను పొందడం అనేది మ్యూచువల్ ఫండ్లలో కుదరకపోవచ్చు. కానీ దీర్ఘకాలం వేచిచూస్తే మ్యూచువల్ ఫండ్లు కూడా మంచి ఆర్థిక పెట్టుబడి సాధనాలే. అనేక లార్జ్, మిడ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు 3 నుంచి 10 సంవత్సరాలలో 20% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి. అయితే, మ్యూచువల్ ఫండ్స్ మదుపునకు క్రమానుగత పెట్టుబడులు (SIP) చాలా ముఖ్యం. దీర్ఘకాలం వేచి చూసేవారికి ఈ మ్యూచువల్ ఫండ్స్లో మంచి రాబడి ఇచ్చిన చరిత్ర భారత స్టాక్ మార్కెట్లకు ఉంది. స్వల్ప కాలానికి మదుపు చేస్తే ఈ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది. ఇది గమనించడం చాలా ముఖ్యం.
ఈపీఎఫ్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరికీ ఈ పథకంలో సభ్వత్వం ఉంటుంది. అంతేకాకుండా ఏ ఇతర ప్రభుత్వ పొదుపు పథకాల కన్నా కూడా ఇందులోనే ఎక్కువగా వడ్డీ రేటు (8.10%) ఉంటుంది. ఉద్యోగ విరమణ పొందేవరకు ఈ పథకంలో కొనసాగవచ్చు. రాబడికి పన్ను లేదు. రుణాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.
పీపీఎఫ్: పీపీఎఫ్ ఖాతాను పోస్టాఫీసులో గానీ, ప్రభుత్వ రంగ బ్యాంకులో గానీ ప్రారంభించవచ్చు. ఇది దీర్ఘకాల పొదుపు పథకం అవ్వడంతో పెట్టుబడిదారుడు పదవీ విరమణ నిధిని కూడా కూడబెట్టొచ్చు. పీపీఎఫ్ ఖాతా 100% రిస్క్ లేనిది. పీపీఎఫ్ వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. పీపీఎఫ్లో మెచ్యూరిటీపై పొందే అసలు, వడ్డీ మొత్తం కూడా పన్ను రహితం. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ వ్యవధి 15 ఏళ్లు అయినా కూడా దీర్ఘకాలం పొడిగించుకోవచ్చు. పీపీఎఫ్ డిపాజిట్లకు ప్రభుత్వ హామీ ఉంటుంది. ఖాతాదారుడు వేరే ఏవైనా ఆర్థిక లావాదేవీలో విఫలం చెందినా, పీపీఎఫ్ రుణాన్ని చెల్లించడానికి ఖాతాలో సొమ్మును మళ్లించలేరు. ఆఖరికి కోర్టు డిక్రీ ఆర్డర్ ద్వారా కూడా పీపీఎఫ్ సొమ్ముని ముట్టుకోలేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విప్రో లాభం రూ.2,835 కోట్లు
‘ఐటీ రంగానికి 2023-24 సవాళ్లతో కూడిన సంవత్సరంగా నిలిచింది. విప్రో పనితీరుపైనా ప్రభావం పడింది. ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నాయి. స్వల్పకాలంలో మరిన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. -
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు
పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. -
ఎన్నికల ఏడాదిలోనూ భారత ఆర్థిక క్రమశిక్షణ భేష్
ఎన్నికల సంవత్సరంలోనూ భారత్ ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) ప్రశంసించింది. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తున్నందున, ప్రపంచానికి ఆశల చుక్కానిగా కొనసాగగలదని ప్రశంసించింది. -
ద్రవ్యోల్బణంపై నియంత్రణ కొనసాగాలి
‘ద్రవ్యోల్బణంపై నియంత్రణ సాధించాం. ఈ విజయాన్ని కొనసాగించి 4 శాతం లక్ష్యాన్ని చేరాల’ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. -
నష్టాల నుంచి లాభాల్లోకి
సూచీల నాలుగు రోజుల వరుస నష్టాలకు శుక్రవారం విరామం ఏర్పడింది. బ్యాంకింగ్, వాహన షేర్లకు దిగువ స్థాయుల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్నాయి. -
నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు
భారత్లో విక్రయమవుతున్న నెస్లే సెరిలాక్ ఉత్పత్తులపై దర్యాప్తు చేపట్టాలని ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐను కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
26 శాతం పెరిగిన ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.36,300.62 కోట్లుగా నమోదయ్యాయి. -
మహీంద్రా యూనివర్సిటీతో రాక్వెల్ ఆటోమేషన్ భాగస్వామ్యం
పర్యావరణ రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం రాక్వెల్ ఆటోమేషన్తో మహీంద్రా యూనివర్సిటీ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. -
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభం రూ.311 కోట్లు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.311 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
అమరరాజా ఇన్ఫ్రాకు గ్రీన్కో సౌరవిద్యుత్తు కాంట్రాక్టు
గ్రీన్కో గ్రూపు నుంచి 700 ఎండబ్ల్యూపీ (మెగావాట్ పీక్) సోలార్ బీఓఎస్ (బ్యాలెన్స్ ఆఫ్ సిస్టమ్) కాంట్రాక్టును అమరరాజా గ్రూపు దక్కించుకుంది. -
హిందుస్థాన్ జింక్ ఆదాయాలు తగ్గాయ్
జనవరి- మార్చి త్రైమాసికంలో వేదాంతా గ్రూపు సంస్థ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 21% తగ్గి రూ.2,038 కోట్లకు పరిమితమైంది. 2022-23 ఇదే త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.2,583 కోట్లుగా నమోదైంది. -
సంక్షిప్తవార్తలు (2)
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లలో మైనారిటీ వాటాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. -
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
దేశంలో 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అమెరికా సంస్థతో కలిసి ఇండిగో సంస్థ దీన్ని ప్రారంభించనుంది.