Adani Group: ‘అదానీ’లో ఇప్పుడు వాటాలు కొన్నదెవరు? ఏ వ్యూహంతో?
Adani Group: ఇంతటి సంక్షోభ సమయంలో అదానీ వాటాలను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిన జీక్యూజీ కంపెనీ ఏం చేస్తుంటుంది? దీన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఈ పెట్టుబడుల వెనుక వారి లక్ష్యం ఏంటి? వంటి వివరాలు చూద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ (Adani Group) గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో గ్రూప్ (Adani Group)నకు చెందిన నాలుగు నమోదిత సంస్థల్లో అమెరికా సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ (GQG Partners) మైనారిటీ వాటాలను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ రూ.15,446 కోట్లు. సెకండరీ మార్కెట్ బ్లాక్ లావాదేవీల ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises), అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీల్లో వాటాలను జీక్యూజీ కొనుగోలు చేసింది.
ఇలాంటి కష్టకాలంలో వాటాలను కొనుగోలు చేయడానికి జీక్యూజీ ముందుకు రావడం అదానీ గ్రూప్ (Adani Group)నకు ఊరటనిచ్చే విషయం. ఇన్వెస్టర్లు, నియంత్రణా సంస్థల్లో విశ్వాసం నింపేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది మద్దతుగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అదానీ షేర్లు శుక్రవారం భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇంతకీ ఇంతటి సంక్షోభ సమయంలో అదానీ వాటాలను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిన జీక్యూజీ కంపెనీ ఏం చేస్తుంటుంది? దీన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఈ పెట్టుబడుల వెనుక వారి లక్ష్యం ఏంటి? వంటి వివరాలు చూద్దాం..
జీక్యూజీ ఏం చేస్తుంది?
జీక్యూజీ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ సంస్థ. ఇది ఆస్ట్రేలియా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో ఈ కంపెనీ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. గ్లోబల్ ఈక్విటీ, ఇంటర్నేషనల్ ఈక్విటీ, ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ, యూఎస్ ఈక్విటీ వంటి ఫండ్లను నిర్వహిస్తోంది. దీర్ఘకాలంలో తమ క్లయింట్లకు భారీ రాబడులు అందించినట్లు ఈ కంపెనీ చెబుతోంది.
నడిపిస్తుంది భారతీయుడే..
జీక్యూజీ పార్ట్నర్స్ను భారత సంతతికి చెందిన రాజీవ్ జైన్ 2016 జూన్లో స్థాపించారు. ప్రస్తుతం ఆయన ఈ కంపెనీకి ఛైర్మన్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. జీక్యూజీకి ముందు వోంటోబెల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో జైన్ వివిధ హోదాల్లో పనిచేశారు. దాదాపు 22 సంవత్సరాలు అదే సంస్థలో ఉన్నారు. అంతకంటే ముందు స్విస్ బ్యాంక్ కార్పొరేషన్లో ఇంటర్నేషనల్ ఈక్విటీ అనలిస్ట్గా పనిచేశారు. భారత్లోనే పుట్టి పెరిగిన జైన్.. ‘యూనివర్సిటీ ఆఫ్ మియామీ’లో ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్లో ఎంబీఏ పూర్తి చేశారు. ఇప్పటికీ ఆయనకు ట్విటర్ ఖాతా లేదు. పెద్దగా టీవీ షోల్లోనూ కనిపించరు. కానీ, తనదైన పెట్టుబడి వ్యూహాలతో జీక్యూజీని 92 బిలియన్ డాలర్ల ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ సంస్థగా నిలబెట్టారు.
పెట్టుబడి మంత్రం..
‘ఫార్వర్డ్ లుకింగ్ క్వాలిటీ’ అనే పెట్టుబడి మంత్రంతో తాము పనిచేస్తున్నట్లు రాజీవ్ జైన్ గతంలో ఓ సందర్భంలో తెలిపారు. క్లయింట్ల పెట్టుబడులను గణనీయంగా పెంచడమే దీని ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వృద్ధి, విలువ ఆధారిత సంప్రదాయ పెట్టుబడులకు భిన్నంగా తమ వ్యూహం ఉంటుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లు ఆ తర్వాత విజయవంతంగా నడుస్తుందనే వ్యాపారంలోనే తాము పెట్టుబడులు పెడతామని వివరించారు. దానికి అనుగుణంగానే తమ మదుపు వ్యూహాలు ఉంటాయని పేర్కొన్నారు.
నిజానికి చాలా ఈక్విటీ సంస్థలు టెక్ ఆధారిత సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. సాంకేతిక రంగంలో వస్తోన్న, రాబోతోన్న అనూహ్య మార్పులను దృష్టిలో ఉంచుకొని దానిలోని అవకాశాలను రాబడులుగా మార్చుకునే వ్యూహంతో ఆయా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ, భవిష్యత్లో అత్యధిక వృద్ధికి అవకాశం ఉన్న రంగం టెక్నాలజీ ఇక ఏమాత్రం కాదని జైన్ గత ఏడాది ఓ ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇందుకే ‘అదానీ’ వాటాల కొనుగోలు..
జైన్ ప్రధానంగా ఇంధన రంగంపై దృష్టి సారించారు. యావత్ ప్రపంచం సహజ ఇంధన వనరుల నుంచి కర్బన ఉద్గార రహిత ఇంధనంవైపు మారుతున్న నేపథ్యంలో ఆయన ఈ రంగంపై బుల్లిష్గా ఉన్నారు. వీటితో పాటు బ్యాంకింగ్ రంగంలో కూడా ఆయన పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్లో వాటాల కొనుగోలుకు జైన్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. గ్రీన్ ఎనర్జీ, సౌర, పవన విద్యుత్ వంటి శుద్ధ ఇంధన రంగంలో అదానీ గ్రూప్ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే.
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఆరోపణల ప్రభావం భారత విపణిపై పెద్దగా ఉండదని ఇటీవల బ్లూమ్బర్గ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైన్ తెలిపారు. అదానీ గ్రూప్లో బ్యాంకుల ఎక్స్పోజర్ 1 శాతం కంటే తక్కువే ఉన్న నేపథ్యంలో దేశ బ్యాంకింగ్ వ్యవస్థకు ఎలాంటి ముప్పు లేదన్నారు. పైగా అదానీ గ్రూప్ కంపెనీలన్నీ నియంత్రణా సంస్థల పరిధిలోనే ఉన్న కారణంగా ముప్పు పెద్దగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అదానీ వ్యవహారం పూర్తిగా ప్రత్యేక అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.
(గమనిక: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. పైన తెలిపిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.