Hindenburg: భారత మార్కెట్లను వణికిస్తున్న అంబులెన్స్ డ్రైవర్..!
38 ఏళ్ల ఓ యువకుడు భారత మార్కెట్లలో కల్లోలం రేపాడు. అతడి సంస్థ ఇచ్చిన నివేదిక దెబ్బకు మార్కెట్లలో రూ. 10 లక్షల కోట్లు ఆవిరైపోయాయి.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
భారతీయ స్టాక్ మార్కెట్లు ఓ కంపెనీ ఇచ్చిన నివేదికతో చలిజ్వరం వచ్చినట్లు వణుకుతున్నాయి. కేవలం రెండు ట్రేడింగ్ సెషన్లలో రూ.10 లక్షల కోట్లను పోగొట్టుకొన్నాయి. ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా 7వ స్థానానికి పడిపోయాడు. ఇక దేశంలో కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకటైన అదానీ గ్రూప్ విలువ ఏకంగా రూ. 4 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఇంతటి ఆర్థిక ప్రకంపనలకు కారణం న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ‘హిండెన్బర్గ్ రీసెర్చి’ సంస్థ ఇచ్చిన నివేదిక.
ఏమిటీ హెండెన్బర్గ్ రీసెర్చి..?
న్యూయార్క్ కేంద్రంగా హిండెన్బర్గ్ రీసెర్చి సంస్థ పనిచేస్తోంది. 2017లో నాథన్ అండర్సన్ దీనిని స్థాపించాడు. ఆర్థిక రంగంలో మానవ నిర్మిత కృత్రిమ విపత్తులను గుర్తిస్తామని తన వెబ్సైట్లో స్వయంగా వెల్లడించింది. పెట్టుబడులు, రుణాలు, డెరివేటీవ్లను ఇది విశ్లేషిస్తుంది. ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ రీసెర్చి సేవలు అందిస్తుంది. కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం, రహస్య కార్యకలాపాలను గుర్తిస్తుంది. ఈ కంపెనీ షార్ట్సెల్లింగ్లో కూడా పెట్టుబడులు పెడుతుంది.
మార్కెట్లోని ప్రతి లావాదేవీలో ‘ముందు కొనడం- తర్వాత అమ్మడం’ లేదా ‘ముందు అమ్మడం - తర్వాత కొనడం’ జరుగుతాయి. షేర్లను కొని.. విలువ పెరిగాక విక్రయించి లాభాలు ఆర్జించవచ్చు. ఇక రెండో విధానంలో షేర్లను అధిక ధర వద్ద విక్రయించి.. తక్కవ ధర వద్ద కొని లావాదేవీని ముగించి లాభాలు ఆర్జించవచ్చు. సంక్షిప్తంగా ఈ రెండో విధానాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు.
ఎవరీ నాథన్ అండర్సన్..?
నాథన్ అండర్సన్ గురించి పెద్దగా వివరాలు బయటకు తెలియవు. అమెరికాలోని కనెక్టికట్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ వాణిజ్యంపై డిగ్రీ పట్టా అందుకొన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లు ఇజ్రాయెల్లోని జెరూసలెంలో స్వచ్ఛందంగా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేశాడు. పరిస్థితులు చేజారిపోతున్న సమయంలో కూడా ధైర్యంగా ఎలా పనిచేయాలో అక్కడే నేర్చుకొన్నట్లు అండర్సన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అతడు తిరిగి అమెరికా వచ్చాక ఫ్యాక్ట్ సెట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాడు. తర్వాత వాషింగ్టన్లో ఓ బ్రోకర్ డీలర్ వద్ద పనిచేసినట్లు 2021లో ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. హిండెన్ ప్రారంభించడానికి ముందు హారీ మార్కోపోలోస్తో కలిసి ప్లాటినం పార్ట్నర్స్ అనే సంస్థపై దర్యాప్తు కోసం పనిచేశాడు. హారీ గతంలో బెర్నీ మాడాఫ్ అనే మోసపూరిత పథకం గుట్టు విప్పేందుకు పనిచేశాడు.
హిండెన్బర్గ్ ఏదైనా కంపెనీపై గురిపెడితే తొలుత ఆరు నెలలకు పైగా పబ్లిక్ రికార్డులు, అంతర్గత కార్పొరేట్ పత్రాలను పరిశీలించి, కంపెనీ ఉద్యోగులతో మాట్లాడి సమాచారం సేకరిస్తుంది. ఆ తర్వాత హిండెన్బర్గ్తో కలిసి పనిచేసే భాగస్వాములకు వాటిని చేరవేస్తుంది. తర్వాత ఆ బృందం మొత్తం సదరు కంపెనీ షేర్లలో షార్ట్ పొజిషన్లు తీసుకొంటాయి. ఆ కంపెనీ విలువ పతనమైన సమయంలో హిండెన్బర్గ్కు ఆదాయం లభిస్తుంది.
2020లో అమెరికాలోని నికోలా కార్పొరేషన్ను ఇలానే లక్ష్యంగా చేసుకొంది. ఆ కంపెనీలో అవకతవకలు బయటపడటంతో కంపెనీ స్టాక్ విలువ 40 శాతం పతనమైంది. ఆ తర్వాత అమెరికా ఎస్ఈసీ దర్యాప్తులో కంపెనీలో మోసం జరిగినట్లు గుర్తించారు. 2017 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16 కంపెనీలను ఇది లక్ష్యంగా చేసుకొంది. వీటిల్లో ట్విటర్ వంటి దిగ్గజాలు కూడా ఉన్నాయి.
ఆ విపత్తు పేరు ఎందుకు..
హిండెన్బర్గ్ అనేది జర్మనీకి చెందిన ప్యాసింజర్ ఎయిర్ షిప్ పేరు. 1937లో న్యూజెర్సీలోని మాంచెస్టర్ టౌన్షిప్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మొత్తం 35 మంది మరణించారు. 62 మంది ప్రాణాలతో బయటపడ్డారు. హిండెన్బర్గ్ పేరును తమ సంస్థకు పెట్టడానికి కారణాన్ని కూడా వెబ్సైట్లో వెల్లడించారు. ‘‘హిండెన్బర్గ్ పూర్తిగా మానవుడు సృష్టించిన విపత్తు. విశ్వంలోనే అత్యధికంగా మండే స్వభావం ఉన్న హైడ్రోజన్ నింపిన బెలూన్లో 100 మందిని ఎక్కించారు. గతంలో ఇలాంటి ఎయిర్షిప్లకు ప్రమాదాలు జరిగినా.. అప్పట్లో నిర్వాహకులు భిన్నంగా ప్రయత్నించామని చెప్పారు. అయినా.. ప్రమాదం జరిగింది. మేము కూడా మానవులు సృష్టించిన ప్రమాదాలు మార్కెట్లలో తిరుగుతుంటే వాటిని అన్వేషిస్తాం. అవి బాధితులను ఆకర్షించడానికి ముందే వాటిని వెలుగులోకి తెస్తాం’’ అని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది. -
అధిక పింఛనుపై రోజుకో నిర్ణయం..
అధిక పింఛను అమలు, పెన్షన్ లెక్కింపు సూత్రంపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) రోజుకో నిర్ణయం తీసుకుంటుడడం అర్హులైనవారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
అమెరికాలో ఐటీ ఉద్యోగాలు ‘కట్’కట
‘ఫ్రంట్డెస్క్’.. అమెరికాలో ప్రాప్టెక్ అంకుర సంస్థ. ఈ సంస్థ సీఈఓ ఈ మధ్య ఉద్యోగులందరితో మాట్లాడాలని ‘గూగుల్ మీట్’ ఏర్పాటు చేశారు. -
Paytm: పేటీఎంకు ఏమైంది?
పేటీఎంను కష్టాలు చుట్టుముట్టాయి. వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. -
Satya Nadella: సాహో.. సత్య నాదెళ్ల
ఒక టెక్ కంపెనీలో విశేషమైన మార్పు తీసుకువచ్చిన ఘనత సత్య నాదెళ్లకు దక్కుతుంది. స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ఆవిష్కరణతో యాపిల్ కంపెనీని అగ్రగామిగా తీర్చిదిద్దిన ఉదంతంతో సత్య నాదెళ్ల సాధించిన ఘనతను పోల్చవచ్చు. -
సాగు సాయం అంతంతే!
వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2023-24లో రూ.1.25 లక్షల కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. -
కేంద్ర బడ్జెట్.. పలు రంగాలకు కేటాయింపులు ఇలా..
గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024-25 తాత్కాలిక బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.77 లక్షల కోట్లను కేటాయించింది. -
‘లఖ్పతి’తో లక్షార్జన!
స్వయం సహాయక సంఘా(ఎస్హెచ్జీ)లకు సంబంధించిన ‘లఖ్పతి దీదీ’ పథక లక్ష్యాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇకపై 3 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. -
ఆదాయపు పన్ను ఏం మారలే!
ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఉద్యోగులకు ఊరట కల్పించే అంశాలేమీ కనిపించలేదు. ‘గత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మధ్యంతర బడ్జెట్లో కొత్త పన్ను ప్రతిపాదనలేమీ తీసుకురావడం లేదని’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. -
కొత్త కారిడార్లు.. సరికొత్త బోగీలు
దేశంలో రైలు మార్గం ద్వారా జరిగే సరకు రవాణాను వేగవంతం చేయడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. -
రక్షణకు ఓ మోస్తరు పెంపు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రక్షణ శాఖకు ఒక మోస్తరు స్థాయిలో కేటాయింపులు పెంచారు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..