OPEC: చమురు ఉత్పత్తికి కోతలు.. ఒపెక్+ దేశాలకు ఏంటి లాభం?
ముడి చమురు (Crude Oil) ధరల్ని పెంచుకోవడానికి ఒపెక్+ దేశాలు ఉత్పత్తికి కోత పెడుతున్నాయి. ఈ నిర్ణయం ఆ దేశాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది? భారత (India) దిగుమతులపై ప్రభావం ఉంటుందా? తదితర అంశాల గురించి తెలుసుకోండి.
రోజురోజుకు తగ్గిపోతున్న ముడి చమురు ధరల్ని (Crude Oil) అదుపు చేసేందుకు సౌదీ అరేబియా (Saudi Arabia) రోజుకు మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి కోతలను ప్రకటించింది. జులై నుంచి కోతలు అమల్లోకి రానున్నాయి. 23 సభ్య దేశాల ఒపెక్ (OPEC) సమావేశం ఆదివారం వియన్నాలోని ప్రధాన కార్యాలయంలో జరిగింది. 2024 చివరి వరకు ప్రస్తుత ఉత్పత్తి కోతలను కొనసాగించడానికి మిగతా ఒపెక్+ దేశాలు అంగీకరించాయి. అయితే ఈ కోతలతో ముడి చమురు ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే విషయాన్ని పరీశీలించండి.
ఏంటీ ఒపెక్ +..?
‘ఒపెక్ +’ అనేది 23 చమురు ఎగుమతి దేశాల సమూహం. ప్రపంచ మార్కెట్కు ఎంత ముడి చమురు విక్రయించాలనే విషయంపై ఈ దేశాలు తరచూ సమావేశం అవుతుంటాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్)లో 13 దేశాలున్నాయి. అవి ఎక్కువగా పశ్చిమాసియా, ఆఫ్రికన్ దేశాలు. ఒపెక్ అనేది 1960లో ఒక వ్యాపార సంస్థల బృందంగా ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరా చేయడం, వాటి ధరలు నిర్ణయించడం అప్పట్లో దాని లక్ష్యం. అలా ఒపెక్ దేశాలన్నీ కలిసి ప్రపంచానికి 30 శాతం ముడిచమురును సరఫరా చేసే స్థాయికి చేరుకున్నాయి . ఇందులో సింహభాగం వాటా సౌదీ అరేబియాది. ఆ దేశం రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల కన్నా ఎక్కువ ముడిచమురును ఉత్పత్తి చేస్తోంది.
2016లో ముడి చమురు ధరలు అమాంతం పడిపోయాయి. దాంతో చమురును విక్రయించి ఆదాయం గడించే దేశాల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఒపెక్లోకి మరో 10 దేశాలు చేరాయి. అప్పటి నుంచి ఒపెక్ కాస్తా ఒపెక్+గా రూపాంతరం చెందింది. అలా కొత్తగా చేరిన దేశాల్లో రష్యా కూడా ఒకటి. ఆ దేశం రోజుకు 10 మిలియన్ల బారెళ్ల కన్నా ఎక్కువ చమురును తోడేస్తోంది. ఒపెక్+ ఏర్పాటుతో ప్రపంచ చమురు విక్రయాల్లో ఈ దేశాల వాటా 40 శాతానికి చేరింది. ఇవన్నీ కలిసి ముడి చమురు ధరలు పతనమైన సందర్భంలో సరఫరాలో కోత విధించడం, ధరలు ఆకాశాన్నంటుతున్నప్పుడు సరఫరా పెంచడం చేస్తున్నాయి.
ఇప్పుడు కోత ఎందుకంటే..?
సౌదీ అరేబియా ప్రకటించిన రోజుకు మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి కోత ప్రభావం జులై నుంచి ఉంటుంది. గత ఏప్రిల్లోనే రోజుకు 1.16 బ్యారెళ్ల ముడిచమురు కోత విధించాలని ఒపెక్+ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. కోతలు పెంచడం ద్వారా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరను 80 డాలర్లకు పెరుగుతుందని సౌదీ అరేబియా ఆశిస్తోంది. దాంతో ఆ ప్రభుత్వానికి ఖర్చుల భారం కొంత మేర తగ్గుతుందని భావిస్తోంది. 2020లో కొవిడ్, లాక్డౌన్ కారణంగా ముడి చమురు ధరలు విపరీతంగా పడిపోయాయి. దాంతో ఒపెక్ + దేశాలు ఉత్పత్తి తగ్గించి ధరలను పెంచేశాయి.
గతేడాది ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర చేసిన పరిణామాల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 130 డాలర్లకు చేరింది. ఈ ఏడాది మార్చి నాటికి అది 70 డాలర్లకు పడిపోయి.. 15 నెలల కనిష్ఠానికి చేరింది. తాజా కోతల ద్వారా బ్యారెల్ ధర కనీసం 80 డాలర్లకు చేరుతుందని ఒపెక్+ దేశాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో చమురుకు డిమాండ్ లేదని, ఇప్పట్లో అంతకు మించి ధర రావడం కష్టమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల ఆర్థికవృద్ధి ప్రస్తుతం మందగమనంలో సాగుతోంది. చైనా, భారత్ వంటి దేశాలకు చమురు బాగా అవసరం అయినప్పటికీ ధరలు పెంచే స్థాయిలో అక్కడ దిగుమతులు ఉండబోవని అభిప్రాయపడుతున్నారు.
రష్యా నుంచి పెరిగిన దిగుమతులు
ఉక్రెయిన్తో యుద్ధానికి దిగిన కారణంగా ఐరోపా సమాఖ్యలోని దేశాలు రష్యా నుంచి చమురు కొనడం ఆపేశాయి. అమెరికా, బ్రిటన్ ఒక్కమాట మీద నిలబడి కొనుగోళ్లను నిరాకరించాయి. అందువల్ల రష్యా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించింది. ఆ ప్రక్రియలో భాగంగా భారత్, చైనాలకు తమ ముడి చమురును విక్రయిస్తోంది. భారత ముడి చమురు దిగుమతులు రష్యా నుంచి గత నెలలో మరింతగా పెరిగాయి. మేలో రష్యా నుంచి రోజుకు 1.96 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మన దేశం దిగుమతి చేసుకుందని ఎనర్జీ కార్గో ట్రాకర్ వొర్టెక్సా డేటా చెబుతోంది. ఇటీవల కొన్నేళ్లలో ఒక దేశం నుంచి అత్యధికంగా భారత్ ముడి చమురు దిగుమతి చేసుకోవడం ఇదే ప్రథమం. ఒపెక్ యేతర దేశాల లీడర్గా ఉన్న రష్యా మాత్రం ఉత్పత్తి కోతలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని తాజాగా సంకేతాలు ఇవ్వడం భారత్కు కొంత సానుకూల అంశం.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM