Adani Group: దేశంలో మరిన్ని ఎయిర్పోర్టులనూ నిర్వహిస్తాం: అదానీ ఎయిర్పోర్ట్స్
Adani Group: భవిష్యత్లో భారత విమానయాన రంగం గణనీయ వృద్ధి సాధించబోతోందని అదానీ ఎయిర్పోర్ట్స్ సీఈఓ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో మరిన్ని విమానాశ్రయాల నిర్వహణ తాము సిద్ధమవుతున్నాని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భవిష్యత్లో మరిన్ని ఎయిర్పోర్టులను నిర్వహించేందుకు బిడ్లు దాఖలు చేస్తామని అదానీ ఎయిర్పోర్ట్స్ (Adani Airports) సీఈఓ అరుణ్ బన్సల్ తెలిపారు. భారత్లో అతిపెద్ద విమానాశ్రయ నిర్వహణ సంస్థగా నిలవడమే తమ లక్ష్యమని బుధవారం ఓ కార్యక్రమంలో వెల్లడించారు. భారత్లో మరికొన్ని ఎయిర్పోర్టులను కూడా ప్రభుత్వం ప్రైవేటీకరించబోతోందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి కోసం జరిగే బిడ్డింగ్లో తాము కచ్చితంగా పాల్గొంటామని బన్సల్ స్పష్టం చేశారు.
భారత్లో విమానాశ్రయాల నిర్వహణ ఖర్చు 30- 50 శాతం దిగిరావాల్సి ఉందని బన్సల్ తెలిపారు. భవిష్యత్లో భారత విమానయాన రంగం గణనీయ వృద్ధి సాధించబోతోందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే మరిన్ని విమానాశ్రయాల నిర్వహణను చేపట్టడానికి తాము సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా అదానీ ఎయిర్పోర్ట్స్ వివిధ విభాగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోందన్నారు. తొలి దశలో భాగంగా నవీ ముంబయి ఎయిర్పోర్ట్లో 2024 డిసెంబరు కల్లా కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు.
ప్రస్తుతం అదానీ ఎయిర్పోర్ట్స్ దేశంలో ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. మరో విమానాశ్రయ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ను కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు బన్సల్ తెలిపారు. భారత్లో విమానయాన సంస్థలు భారీ విస్తరణ ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సంస్థలు భారీ ఎత్తున కొత్త విమానాలకు ఆర్డర్ చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.