Budget 2023: బడ్జెట్పై ప్రైవేటు రంగ ఉద్యోగుల ఆశలు..!
ఈ సారి దేశ ఆర్థిక పరిస్థితులు చూస్తే ఆదాయ పన్ను మినహాయింపు శ్లాబ్లను పెంచే సూచనలు ఇప్పటి వరకు స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో ఎన్పీఎస్లో రాయితీలతో కేంద్రం ఉద్యోగులకు ఊరట కలిగిస్తుందనే ఆశలు ఉన్నాయి.
ఇంటర్నెట్డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఈ సారి ‘జాతీయ పింఛను పథకాని (NPS)’కి సంబంధించి కీలక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు రంగంలో పింఛను చందాదారులకు కొంత ఊరటనిచ్చే కబురును ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఈ బడ్జెట్ (Budget 2023)లో ప్రకటించే అవకాశం ఉంది. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నా.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఆదాయపన్ను శ్లాబులను మార్చే అవకాశాలు తక్కువ. ఈ క్రమంలో ఏదో ఒక రూపంలో వేతన జీవులకు మేలునందించి బుజ్జగించడానికి అవకాశం ఎక్కువగా ఉన్న మార్గాల్లో జాతీయ పింఛన్పై ఇచ్చే పన్ను మినహాయింపు ఒకటి.
2022 బడ్జెట్కు ముందు బేసిక్+డీఏ పై యజమాని ఇచ్చే ఎన్పీఎస్ చందా 14శాతం వరకు ఉన్నా.. సెక్షన్ 80సీసీడీ(2) కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ మేరకు పన్ను రాయితీ లభించేది. రాష్ట్ర, ప్రైవేటు రంగాల్లోని వారికి 10శాతం వరకే ఉండేది. కానీ, కిందటి బడ్జెట్లో దీనిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేస్తూ సవరణలు చేశారు. ప్రైవేటు రంగ ఉద్యోగులు మినహాయింపు పరిధి మాత్రం ఇంకా 10శాతం మాత్రమే ఉంది. పింఛను స్కీం విషయంలో ప్రభుత్వ-ప్రైవేటు రంగ ఉద్యోగుల పన్ను రేట్ల మధ్య తేడాలు పెరిగిపోయాయి. దీంతో వారు జాతీయ పింఛను పథకంపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఈ నేపథ్యంలో వారిని జాతీయ పింఛను పథకంలో భాగస్వాములను చేయాలంటే మార్పులు తప్పనిసరి. ప్రభుత్వం పింఛను చందా మినహాయింపును 14 శాతానికి పెంచి వారిని సామాజిక భద్రతలో భాగస్వామిని చేసే అవకాశం లభిస్తుంది. మరోవైపు ఎన్పీఎస్కు చందారూపంలో లభించే సొమ్ము వివిధ పెట్టుబడి మర్గాలకు మళ్లిస్తారు. అంటే ఈ చందా పెరిగితే దేశంలో పెట్టుబడికి అందుబాటులో ఉన్న నిధులు కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది.
అసలు ఏమిటీ ఎన్పీఎస్..?
2004లో కేంద్ర ప్రభుత్వం ‘ది నేషనల్ పెన్షన్ సిస్టమ్’(ఎన్పీఎస్)ను స్వచ్ఛందంగా ప్రవేశపెట్టింది. దీనిని ‘ది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరి అండ్ డెవలప్మెంట్ అథారిటీ’ (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రిస్తుంది. తొలుత దీనిని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేశారు. ఆ తర్వాత దీనిని ప్రైవేటు ఉద్యోగులకు కూడా వర్తింపజేశారు. భారత జాతీయులు, ఎన్ఆర్ఐ హోదా ఉన్న 18-70 ఏళ్ల లోపువారు దీనిలో చేరడానికి అర్హులు. ఉద్యోగి తరఫున జీతం నుంచి యజమానే దీనికి చెల్లింపులు చేయవచ్చు.
ఈ పథకానికి చందా చెల్లింపులపై ఉద్యోగి పన్ను మినహాయింపులు పొందవచ్చు. 1961 ఆదాయపుపన్ను చట్టం సెక్షన్ 80సీసీడీ(1)కింద ఈ చెల్లింపులపై మినహాయింపులు పొందవచ్చు. తొలుత ఈ మినహాయింపుల పరిధి బేసిక్+డీఏ పై 10శాతానికే పరిమితమైంది. ఇది రూ.1.5 లక్షల లోపే ఉండాలి. A అనే ఒక వ్యక్తి జీతం రూ.5,00,000 అనుకుందాం. అతడు రూ.50,000 పై 80సీసీడీ(1) కింద మినహాయింపు పొందగలడు. ఇక్కడ మరో విషయం అతడు పింఛన్ ఫండ్స్లో పెట్టే మొత్తాలన్ని కలిపి రూ. 1.5 లక్షలపై మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే సదరు వ్యక్తి జీవిత బీమా సంస్థలు ఆఫర్ చేసే ఇతర పింఛన్ పథకాల్లో పెట్టుబడులు, జాతీయ పింఛను పథకం పెట్టుబడులు కలిపి అన్నమాట. A రూ.50వేలు చెల్లించి ఎన్పీఎస్లో చేరిన తర్వాత కూడా మరో రూ.లక్ష మినహాయింపు పొందే అవకాశం ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అతడు ఇతర పింఛను పథకాలకు కూడా చందాలు చెల్లించవచ్చు.
యజమాని చెల్లించే ఎన్పీఎస్ వాటాపై తొలుత ఉద్యోగి జీతం నుంచే పన్ను వసూలు చేస్తారు. కానీ, దీనిని తర్వాత సెక్షన్ 80సీసీడీ(2) కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ, ఇది ప్రైవేటు ఉద్యోగి బేసిక్+డీఏలో 10శాతం లోపు ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14శాతం వరకు అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!