Artificial Intelligence: ‘కృత్రిమ మేధను నియంత్రిస్తాం..! డిజిటల్ వినియోగదారుల భద్రతే లక్ష్యం’
డిజిటల్ వినియోగదారులకు హాని కలిగించకుండా ఉండేలా భారత్లో కృత్రిమ మేధ (AI)ను నియంత్రిస్తామని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. దేశంలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.
దిల్లీ: ‘కృత్రిమ మేధ (Artificial Intelligence)’ కొత్త పుంతలు తొక్కుతోన్న విషయం తెలిసిందే. విద్య, వైద్యం నుంచి వ్యవసాయం వరకూ అనేక రంగాల్లో ప్రస్తుతం దీనిదే హవా! ‘చాట్జీపీటీ (ChatGPT)’ వంటివి ఈ సాంకేతికత ఆధారంగానే పనిచేస్తాయి. అయితే, కృత్రిమ మేధ ఎంత ఆసక్తి కలిగిస్తోందో.. అంతే ఆందోళనకూ గురిచేస్తోంది. ఉద్యోగాలు పోవడంతో పాటు భవిష్యత్తులో ఇది మానవాళి ఉనికికే ముప్పు తలపెట్టే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘ఏఐ’పై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో డిజిటల్ వినియోగదారులకు హాని కలిగించకుండా ఉండేలా కృత్రిమ మేధ (AI)ను కేంద్రం నియంత్రిస్తుందని తెలిపారు.
‘దేశంలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 85 కోట్లమంది వినియోగదారులు ఉండగా.. 2025 నాటికి ఈ సంఖ్య 120 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు.. అంతర్జాలంలో విద్వేష ఘటనలతో పాటు నేరాలు కూడా పెద్దఎత్తున పెరిగాయి. అయితే, వినియోగదారులకు హాని కలిగించే చర్యలను అడ్డుకుంటాం. సైబర్ స్పేస్లో భద్రతను నిర్ధారించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని కేంద్ర మంత్రి మీడియాతో తెలిపారు. దశాబ్ద కాలంలో డిజిటల్ టెక్నాలజీలో భారత్ మంది పురోగతి సాధించిందన్నారు. ఇదిలా ఉండగా.. చాట్జీపీటీని రూపకర్త ‘ఓపెన్ఏఐ’ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్మన్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. భారత టెక్ రంగాన్ని మరింత మెరుగుపర్చడంలో ఏఐ పాత్ర చాలా కీలకమని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
డెబిట్ కార్డు ఛార్జీలను పెంచిన ఎస్బీఐ
డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
Retail Brands: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాల ద్వారా దేశంలో ఆధ్యాత్మిక పర్యటకం అభివృద్ధి చెందుతోంది. దీంతో రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్