RBI: ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తూనే.. వృద్ధికి ఊతమిస్తాం: ఆర్బీఐ
కరోనా మూలంగా తలెత్తిన ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తూనే.. వృద్ధికి ఊతమివ్వాల్సిన అసవరం ఉందని ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)’ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆగస్టు 4-6 మధ్య జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వివరాలు శుక్రవారం విడుదలయ్యాయి....
ముంబయి: కరోనా మూలంగా తలెత్తిన ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తూనే.. వృద్ధికి ఊతమివ్వాల్సిన అసవరం ఉందని ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)’ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆగస్టు 4-6 మధ్య జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వివరాలు శుక్రవారం విడుదలయ్యాయి. కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే.
కమిటీ సమావేశంలో చర్చించిన అంశాల పూర్తి సమాచారం తాజాగా ‘మినిట్స్’ ద్వారా బయటకు వచ్చాయి. దీని ప్రకారం ఆర్బీఐ ముందు రెండు ప్రధాన మార్గాలున్నాయని శక్తికాంతదాస్ అభిప్రాయపడ్డారు. ఒకటి దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతును కొనసాగించడం కాగా.. మరొకటి మళ్లీ విజృంభిస్తున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం ఇంకా నెమ్మదిగానే కొనసాగుతోందని స్పష్టం చేశారు. దేశీయంగా గిరాకీ పుంజుకుంటున్నప్పటికీ.. అదీ నెమ్మదిగానే ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెపో, రివర్స్ రెపో రేట్లను మరోసారి యథాతథంగానే ఉంచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
గతేడాది నుంచి రెపో, రివర్స్ రెపో రేట్లను ఆర్బీఐ యథాతథంగానే ఉంచుతూ వస్తోంది. ఈ నెలలో జరిగిన సమీక్షలోనూ వాటి జోలికి వెళ్లలేదు. అయితే ద్రవ్యోల్బణం పెరుగుతుండడం ఆర్బీఐని కలవరపరుస్తోంది. దీంతో ద్రవ్య విధానాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ద్రవ్య వ్యవస్థలో కరెన్సీ ప్రవాహాన్ని ఆర్బీఐ రెపో, రివర్స్ రెపో రేటుల సవరణ ద్వారానే నియంత్రిస్తుందన్న విషయం తెలిసిందే. కానీ కరోనా కారణంగా రెపో రేటును తగ్గిస్తూ పోయిన ఆర్బీఐ.. చాలాకాలం నుంచి వాటిని తాకడం లేదు. ఫలితంగా అటు రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు హోల్సేల్ ద్రవ్యోల్బణం తిరిగి పెరుగుతున్నాయి. అయినప్పటికీ వృద్ధికి ఊతమిస్తామని శక్తికాంతదాస్ చెబుతుండడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్