Budget 2023: డ్రాగన్ శక్తిని ఎదుర్కోవాలంటే..!
భారత్ ముంగిట చైనా ఆయుధాలను మోహరించి కూర్చొంది. ఈ పరిస్థితుల్లో మన దళాలను అత్యాధునిక ఆయుధాలతో బలోపేతం చేయకపోతే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇంటర్నెట్డెస్క్: భారత్ గతంలో ఎన్నడూ ఎదుర్కోనంత ముప్పును వాస్తవాధీన రేఖ వద్ద ఎదుర్కొంటోంది. ఎల్ఏసీ వద్ద పాగావేసిన చైనా దళాలు వెనక్కి తగ్గే ఆలోచనే చేయడం లేదు. అంతకంతకూ చొచ్చుకొస్తున్నాయి. చైనా వైపు 5జీ కమ్యూనికేషన్స్ నెట్వర్క్తో సహా అత్యాధునిక సాంకేతికతను కూడా మోహరిస్తోంది. చైనా ముప్పు కేవలం హిమగిరులకే పరిమితం అనుకొంటే పొరబడ్డట్లే. డ్రాగన్ నౌకలు బంగాళాఖాతంలోకి కూడా చొచ్చుకొస్తున్నాయి. భారత్ చుట్టూ నౌకాదళ స్థావరాలను ఏర్పాటు చేసుకొంటున్నాయి. 2025 నాటికి చైనా వద్ద 400 యుద్ధ నౌకలు ఉంటాయని అమెరికా అంచనా వేసింది. భారత్ వద్ద ప్రస్తుతం కేవలం 139 మాత్రమే ఉన్నాయి. వైమానిక దళం రష్యా తయారీ మిగ్ 21లతో ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గ్లోబల్ ఫైర్పవర్ ఇండెక్స్ ప్రకారం రక్షణ రంగంపై చైనా 230 బిలియన్ డాలర్లు వెచ్చించగా.. భారత్ కేవలం 54 బిలియన్ డాలర్లే కేటాయిస్తోంది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వత ఆయుధ పోటీకి దూరంగా జపాన్ కూడా చైనా దెబ్బకు రక్షణ బడ్జెట్ను గణనీయంగా పెంచుకొంది. చైనా ఎంత వేగంగా ప్రబల శక్తిగా మారుతోందో అన్న విషయానికి ఇదే ఉదాహరణ. ఈ నేపథ్యంలో 2023 బడ్జెట్లో సబ్మెరైన్లు, తేలికపాటి యుద్ధ ట్యాంకులు, ఫైటర్ విమానాల కొనుగోళ్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలున్నాయి.
- ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకను ఇప్పటికే హడావుడిగా నౌకాదళంలో ప్రవేశపెట్టారు. కానీ, దీనిపై వినియోగించేందుకు అవసరమైన విమానాల కొనుగోళ్లు మాత్రం ఇప్పటికీ పూర్తికాలేదు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఈ నౌకను వాడుకొనే పరిస్థితి లేదు. ఇప్పటికే దీనిపై 27 రఫేల్ మెరైన్ రకం విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ కొనుగోళ్ల కాంట్రాక్టుల ప్రక్రియ పూర్తికావాలంటే కనీసం ఏడాదైనా పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ విమానాల కొనుగోళ్లకు పచ్చజెండా ఊపేందుకు అవసరమైన నిధులను కేటాయించాలి.
- ప్రాజెక్టు 75ఐ కింద కొత్తగా ఆరు జలాంతర్గాములను నిర్మించాల్సి ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి దీని కాంట్రాక్టు చర్చలు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో నిధులను సిద్ధం చేసుకొంటే వేగంగా పనులను మొదలుపెట్టవచ్చు. ఒక వేళ ఈ ప్రాజెక్టు ముందుకు పోకపోతే మరిన్ని స్కార్పియన్ శ్రేణి సబ్మెరైన్ల కొనుగోళ్లు చేసేలా నేవీ ఇప్పటికే ప్లాన్-బీ సిద్ధంగా పెట్టుకొన్నట్లు సమాచారం.
- ఇండో-పసిఫిక్ వ్యూహానికి మరింత పదును రావాలంటే భారత్ నౌకాదళం డ్రోన్ల వినియోగం పెంచాలి. ఇప్పటికే ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోళ్లపై కూడా చర్చలు జరుగుతున్నాయి. సముద్ర నిఘా, శత్రు జలాంతర్గాముల కట్టడికి ఇవి చాలా అవసరం.
- తరచూ చోటుచేసుకొంటున్న యుద్ధ విమానాల ప్రమాదాల కారణంగా వాయుసేన బలం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఐఏఎఫ్ త్వరగా యుద్ధ విమానాలను సమకూర్చుకోవాలి. దీనికి సంబంధించి మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కాంట్రాక్టును ముందుకు తీసుకెళ్లడమో.. మరిన్ని రఫెల్స్ కొనుగోలు చేయడంమో చేయాలి. సరిహద్దుల్లో ఉద్రిక్తతల సమయంలో వాయుసేనను బలహీనంగా ఉంచడం ఏమాత్రం వాంఛనీయం కాదు.
- రక్షణ రంగ కేటాయింపులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి కేంద్రం నాన్లాప్సబుల్ ఫండ్ను ఈ సారైనా ఏర్పాటు చేస్తుందని దళాలు ఆశిస్తున్నాయి. ఎందుకంటే ఆయుధ కాంట్రాక్టులు పూర్తి కావాలంటే చాలా దశలను దాటాలి. ఇందుకు సమయం పడుతుంది. ఈ లోపు కేటాయింపులు మురిగిపోకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.
- ఇటీవల రక్షణ మంత్రత్వ శాఖలో జరిగిన కార్యక్రమంలో త్రివిధ దళాలు ఈ సారి కేటాయింపులు పెంచాలని బలంగా కోరాయి. గతేడాది బడ్జెట్లోనే మూలధన వ్యయాలను రూ.1.32 లక్షల కోట్ల నుంచి రూ.1.52 లక్షల కోట్లకు పెంచారు. ఈ సారి పెంపు మరింత ఎక్కువగా ఉండొచ్చు.
- వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానంలో మార్పులు చోటు చేసుకోవడంతో పింఛన్ బిల్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన బకాయిల చెల్లింపులకు సంబంధించి అదనంగా 8,450 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది.
- రక్షణ సంస్థల వద్ద అత్యధికంగా భూమి ఉంది. వీటిల్లో చాలా వరకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ హబ్లుగా మారాయి. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ కొంత భూమిని విక్రయించి నిధులను సమకూర్చుకొనే అంశంపై కూడా ప్రతిపాదనలు ఉండే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి