Inflation: ఆల్టైం గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం.. ఏప్రిల్లో ఏకంగా 15.08 శాతం
నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు మండిపోవడంతో గత నెలలో టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం ఆల్టైం రికార్డు స్థాయిలో నమోదైంది. ఏప్రిల్ నెలలో ఈ ద్రవ్యోల్బణం 15.08 శాతానికి చేరినట్లు
దిల్లీ: నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు మండిపోవడంతో గత నెలలో టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం ఆల్టైం రికార్డు స్థాయిలో నమోదైంది. ఏప్రిల్ నెలలో ఈ ద్రవ్యోల్బణం 15.08 శాతానికి చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. అంతక్రితం మార్చి నెలలో టోకు ద్రవ్యోల్బణం 14.55శాతంగా ఉండగా.. గతేడాది ఏప్రిల్ నెలలో ఇది 10.74శాతంగా నమోదైంది.
టోకు ద్రవ్యోల్బణం రెండంకెల్లో నమోదు కావడం వరుసగా ఇది 13వ నెల కాగా.. ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతకుముందు 2021 నవంబరులో 14.87శాతంగా నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి ఏకంగా 15శాతాన్ని దాటింది. ఏప్రిల్ నెలలో చమురు ధరలతో పాటు ఆహార, ఆహారేతర పదార్థాలు, రసాయనాలు ఇలా అనేక వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం ఆల్టైం గరిష్ఠానికి చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ పేర్కొంది. గత నెలలో కూరగాయలు, గోధుమలు, పండ్ల ధరలు పెరగడంతో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 8.35శాతానికి ఎగబాకింది.
అటు వినియోగదారుల సూచీ ఆధారిత (సీపీఐ) రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఏప్రిల్లో 8 నెలల గరిష్ఠానికి చేరిన విషయం తెలిసిందే. గత నెలలో ఇది 7.79శాతంగా నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2014 మే నెలలో రికార్డు స్థాయిలో 8.33శాతంగా నమోదు కాగా.. ఆ తర్వాత అదే స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి.
ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో సామాన్యులపై ధరల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా పేర్కొంటూ నాలుగేళ్ల తర్వాత తొలిసారి ఆర్బీఐ రెపో రేటును పెంచాల్సి వచ్చింది. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో ప్రస్తుతం అది 4.40 శాతానికి చేరింది. అయితే ప్రస్తుతం టోకు ద్రవ్యోల్బణం కూడా విపరీతంగా పెరగడంతో ఆర్బీఐ వచ్చే నెలలో జరగబోయే పరపతి విధాన సమీక్షలో మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు