ఆన్లైన్ బీమా పాలసీల క్లెయిమ్ పరిస్థితేంటి?
డిజిటల్ చెల్లింపుల వ్యాప్తిని నోట్ల రద్దు నిర్ణయం మరొక స్థాయికి తీసుకెళ్లింది. పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం, అత్యాధునిక సాంకేతికతలు సమాచార వ్యాప్తిని సులభతరం చేశాయి. ప్రస్తుత కాలంలో ప్రజలు చాలా సులభంగా, సౌకర్యవంతంగా ఆన్లైన్ చెల్లింపులను చేస్తున్నారు...
డిజిటల్ చెల్లింపుల వ్యాప్తిని నోట్ల రద్దు నిర్ణయం మరొక స్థాయికి తీసుకెళ్లింది. పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం, అత్యాధునిక సాంకేతికతలు సమాచార వ్యాప్తిని సులభతరం చేశాయి. ప్రస్తుత కాలంలో ప్రజలు చాలా సులభంగా, సౌకర్యవంతంగా ఆన్లైన్ చెల్లింపులను చేస్తున్నారు. గత 3 నుంచి 4 సంవత్సరాల కాలంలో డిజిటల్ చెల్లింపుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. డిజిటల్ చెల్లింపుల వ్యాప్తిని నోట్ల రద్దు నిర్ణయం మరొక స్థాయికి తీసుకెళ్లింది. ఆ సమయం నుంచి డిజిటల్ చెల్లింపులు మరింత వేగాన్ని పుంజుకున్నాయి. సామాన్య ప్రజలు సైతం డిజిటల్ చెల్లింపులపై ఆసక్తిని కనపరుస్తున్నారు. ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగానే ఆన్లైన్ ద్వారా బీమా పాలసీలను కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో ఆన్లైన్, ఆఫ్లైన్ పాలసీలకు మధ్య కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ద్వారా గానీ, ఆఫ్లైన్ ద్వారా గానీ కొనుగోలు చేసిన బీమా పాలసీకి సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో ఎలాంటి తేడా ఉండదు. పాలసీ కొనుగోలు విధానంతో సంబంధం లేకుండా క్లెయిమ్ సెటిల్మెంట్ డేటాను ఐఆర్డీఏ విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం క్లెయిమ్ సెటిల్మెంట్లో ఉన్న అన్ని విషయాలను వాస్తవ రూపంలో ప్రాసెస్ డాక్యుమెంట్లో తెలపవలసి ఉంటుంది. ఏదైనా తప్పుడు సమాచారం గుర్తించబడితే అది తిరస్కరణకు గురి అవుతుంది.
► బీమా సంస్థలు తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడానికి ఆన్లైన్ ద్వారా పాలసీలను విక్రయిస్తున్నారు.
► ఆన్లైన్ ద్వారా పాలసీలను కొనుగోలు చేస్తే కలిగే ప్రయోజనాలను కింద తెలియచేశాము.
► బీమా సంస్థల నిర్వహణ ఖర్చులు తగ్గడం వలన కొనుగోలు దారుల పాలసీ ప్రీమియం తగ్గుతుంది.
► మీరు తీసుకోవాలనుకుంటున్న పాలసీని ఇతర సంస్థల పాలసీలతో పోల్చుకుని, ఏది సరైనదో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
► బీమా సంస్థల కార్యాలయాలకు వెళ్లకుండా సౌకర్యవంతంగా ఇంట్లోనే కూర్చుని పాలసీ కొనుగోలు చేయచ్చు.
► ఎలాంటి అవాంతరం లేకుండా ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
► పాలసీ విక్రయాల్లో ఎలాంటి మోసాలు ఉండవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!