పార్టనర్ల ఫీజును పెంచిన జొమాటో

దేశంలో పెద్దయెత్తున ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ (యాప్‌) జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ డెలివరీ భాగస్వాముల

Published : 26 Feb 2021 22:13 IST

ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రకటించిన సంస్థ సీఈవో

దిల్లీ: దేశంలో పెద్దయెత్తున ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ (యాప్‌) జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ డెలివరీ భాగస్వాముల రెమ్యునిరేషన్‌ను పెంచుతున్నట్లు జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో వరుస ట్వీట్లు చేశారు. ‘‘ప్రస్తుతం పెరిగిన ఇంధన ధరలతో మా డెలివరీ పార్టనర్లకు అదనంగా సుమారు ఆరు నుంచి ఎనిమిది వందలు ఖర్చవుతోంది. అది వారి జీతంలో మూడు శాతం. అందుకే రవాణా ఖర్చులను దృష్టిలో పెట్టుకొని వారికి ఇచ్చే రెమ్యునిరేషన్‌ను పెంచాలని నిర్ణయించుకున్నాం. దీన్ని ఇప్పటికే కొన్ని నగరాల్లో ప్రారంభించాం’’ అని దీపిందర్‌ గోయల్‌ తెలిపారు.

ఈ అంశంపై జొమాటో సంస్థ ఒక ప్రకటన చేసింది. ‘‘ పెరిగిన ధరల నేపథ్యంలో మా డెలివరీ పార్టనర్ల జీతం ప్రభావితం కాకుండా ఉండేందుకు దూరాన్ని బట్టి వారికి చెల్లింపులు చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ ఈ మార్పు కస్టమర్లపై ఎటువంటి భారం మోపదు. భవిష్యత్తులో ఇంధన ధరల ఆధారంగా దీనిలో మార్పులు చేస్తాం.’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

పర్వతశ్రేణులు.. ఎన్నో అందాలు

లగేజ్‌ లేకపోతే.. విమాన టికెట్‌పై డిస్కౌంట్


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని