Paytm- Zomato: పేటీఎం, జొమాటో, నైకా.. ఈ ‘లక్ష’ కోట్ల కంపెనీలకేమైంది?
Paytm- Zomato: ఈ ‘లక్ష’ కోట్ల కంపెనీల షేర్ల విలువ రికార్డు గరిష్ఠాల నుంచి పాతాళానికి చేరాయి. లక్ష కోట్ల విలువ దాదాపు సగానికి పడిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: అది 2021.. స్టాక్ మార్కెట్పై పెద్దగా అవగాహన లేని వారు కూడా దలాల్ స్ట్రీట్పై ఓసారి కన్నేసేలా చేసిన రోజులవి. కారణం వరుస ఐపీఓలు. ఆ ఏడాది చాలా కంపెనీలు పబ్లిక్ ఆఫర్కు వచ్చాయి. కొన్ని పేరు మోసిన కంపెనీలకు ఆరంభం నుంచే పెద్ద ఎత్తున ప్రచారం లభించగా.. చిన్న కంపెనీలు మాత్రం లిస్టింగ్లో అదరగొట్టి అందరినీ ఆకర్షించాయి. అలాంటి వాటిలో పేటీఎం, జొమాటో, నైకా ముఖ్యమైనవి. పేటీఎం, జొమాటో సామాన్య ప్రజానీకానికి ముందు నుంచే తెలిసినవి కాగా.. సైలెంట్గా వచ్చిన నైకా మాత్రం లిస్టయిన తొలి రోజే మార్కెట్ విలువ పరంగా లక్ష కోట్లు దాటి రికార్డు సృష్టించింది. కానీ ఇప్పుడు ఈ ‘లక్ష’ కోట్ల కంపెనీల షేర్ల విలువ రికార్డు గరిష్ఠాల నుంచి పాతాళానికి చేరాయి. లక్ష కోట్ల విలువ దాదాపు సగానికి పడిపోయింది.
జొమాటో పయనం ఎటో..?
ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్గా ప్రజలకు బాగా చేరువైన జొమాటో ఐపీఓకు వస్తుందన్న వార్త సామాన్యులను సైతం మార్కెట్ వైపు తిప్పుకొనేలా చేసింది. రూ.76 షేరు విలువకు పబ్లిక్ ఇష్యూకు వచ్చిన జొమాటో 2021 జులై 24న స్టాక్ఎక్స్ఛేంజీల్లో నమోదైనప్పుడు 51.6 శాతం అధికంగా రూ.115కు చేరింది. ఆ రోజు గరిష్ఠంగా రూ.138కి చేరిన షేరు, చివరకు రూ.125.85 వద్ద ముగిసింది. తొలిరోజు రూ.లక్ష కోట్ల మార్కెట్ విలువను అధిగమించడంతో పాటు అత్యధిక మార్కెట్ విలువ కలిగిన 50 సంస్థల జాబితాలోనూ చేరింది. నవంబర్ 16న కంపెనీ షేరు విలువ అత్యధికంగా రూ.169 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాతే కథ మొదలైంది. అక్కడి నుంచి షేరు విలువ పడుతూ వచ్చింది. మార్కెట్లు మంచి జోరు మీద ఉన్న సమయంలో జొమాటో ఐపీఓకు వచ్చింది. ఆ తర్వాత ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు పడడం మొదలైంది. దీనికి తోడు జొమాటోకు స్విగ్గీ నుంచి గట్టి పోటీ ఉండడమూ మరో కారణం. దీంతో ఎక్కడో రూ.150 స్థాయి నుంచి ఇటీవల రూ.70కి చేరిన సమయంలో బ్లింకిట్ను కొనుగోలు చేయడం జొమాటోను మరింత నష్టాల్లోకి నెట్టింది. ప్రస్తుతం లిస్టింగ్ ధర నుంచి షేరు విలువ దాదాపు సగానికి పైగా పడిపోయింది. శుక్రవారం నాటికి కంపెనీ షేరు విలువ రూ.54.80 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.41,625 కోట్లకు చేరింది.
పేటీఎం మొదటి నుంచీ అదే కథ
వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తూ దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా స్టాక్మార్కెట్లలోకి అడుగుపెట్టిన పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ గతేడాది నవంబర్ 18న మార్కెట్లో లిస్ట్ అయ్యింది. ఇష్యూ ధర రూ.2,150గా నిర్ణయించినప్పటికీ తొలి రోజే నిఫ్టీలో 9 శాతం నష్టంతో రూ.1,950 వద్ద షేరు లిస్టయ్యింది. 1,950 వద్ద ప్రారంభమైన షేరు విలువ ట్రేడింగ్ ముగిసే నాటికి 27.34 శాతం క్షీణించి రూ.1562కి పరిమితమైంది. అక్కడి నుంచి ఏ రోజూ పేటీఎం పెద్దగా కోలుకున్న దాఖలాల్లేవు. తొలి రోజే షేర్ల ధర తగ్గినప్పటికీ.. కంపెనీ మార్కెట్ విలువ మాత్రం రూ.లక్ష కోట్లు దాటడం విశేషం. అయితే, షేరు విలువను అధికంగా పెట్టడమే పేటీఎం నష్టాలకు కారణమన్నది మార్కెట్ నిపుణులు చెప్పేమాట. పేటీఎం ఉన్న వ్యాపారంలో గట్టి పోటీ ఉండడం, లాభదాయకతకు పెద్దగా అవకాశం లేకపోవడంతో కంపెనీ షేరు విలువ పతనానికి ప్రధాన కారణం. దీంతో శుక్రవారం నాటికి కంపెనీ షేరు విలువ రూ.698కి చేరింది. లిస్టింగ్ ధరతో పోలిస్తే ఇది 64 శాతం తక్కువ. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.44,821 కోట్లకు చేరింది.
వాటితో పాటే నైకా..
నైకా బ్రాండుపై సౌందర్య ఉత్పత్తులను విక్రయించే ఎఫ్ఎస్ఎన్ ఇ-కామర్స్ వెంచర్స్ షేర్లు గతేడాది నవంబర్ 10న స్టాక్ఎక్స్ఛేంజీల్లో నమోదైన తొలి రోజే అదరగొట్టాయి. ఇష్యూ ధర రూ.1,125 కాగా.. దీనికి 77.86 శాతం అధికంగా రూ.2,001 వద్ద బీఎస్ఈలో షేర్లు నమోదయ్యాయి. అదే జోరు కొనసాగిస్తూ 99.83% పెరిగి రూ.2,248.10కు చేరాయి. చివరకు ఇష్యూ ధర కంటే 96.15% అధికంగా రూ.2,206.70 వద్ద ముగిశాయి. షేర్ల దూకుడుతో బీఎస్ఈలో తొలి రోజే కంపెనీ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లకు చేరింది. ఐపీఓలో షేర్లు దక్కించుకున్న మదుపరులకు తొలి రోజే డబుల్ లాభాన్ని ఆర్జించి పెట్టిన నైకా.. తర్వాత తిరోగమన బాట పట్టింది. నైకా షేర్ల పతనానికి మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. కంపెనీ ఇటీవల ఫ్లిప్కార్ట్ మార్కెటింగ్ హెడ్ను తమ బీ2బీ విభాగానికి సీఈఓగా నియమించింది. దీంతో లాభాల వృద్ధిని పణంగా పెట్టి విస్తరణ దిశగా కంపెనీ అడుగులు వేస్తోందన్న సంకేతాలు మార్కెట్లోకి వెళ్లాయి. మరోవైపు ప్రీమియం సెగ్మెంట్ నుంచి కంపెనీ క్రమంగా సాధారణ కస్టమర్లను ఆకట్టుకునే దిశగా పయనిస్తోందన్న వాదనా వినిపిస్తోంది. దీనివల్ల ప్రీమియం బ్రాండ్గా ఉన్న విలువ కాస్తా పడిపోయే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీనికితోడు 2021 మార్కెట్ బూమ్లో లిస్టయిన టెక్ ఆధారిత కంపెనీల షేర్లన్నీ భారీ ఎత్తున నష్టాలు చవిచూస్తున్నాయి. నైకాను కూడా మదుపర్లు అదే గాటన కట్టి విక్రయాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు విలువ రూ.1393 వద్ద ముగిసింది. లిస్టింగ్ ధరతో పోలిస్తే ఇది 30.33 శాతం తక్కువ. కంపెనీ మార్కెట్ విలువ సైతం రూ.68,925 కోట్లకు చేరింది. ఇలా లక్ష కోట్ల కంపెనీలుగా పేరొందిన ఈ మూడు కంపెనీలే కాదు.. గతేడాది వచ్చిన పాలసీ బజార్, మ్యాప్ మై ఇండియా, కార్ ట్రేడ్ కంపెనీ షేర్లు సైతం మదుపరులకు నష్టాన్ని మిగిల్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ