Crime: రూ.కోటి ఖర్చు అయినా ఫర్వాలేదు. అతడు చనిపోవడం నాకు కావాలి..

కర్ణాటక కాంగ్రెస్‌ నేత గోపాలకృష్ణ చిక్కుల్లో పడ్డారు. భాజపా నేత, కర్ణాటకలోని యలహంక ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ను చంపేయండి అంటూ గోపాల్‌ కృష్ణ వేసిన మర్డర్‌ ప్లాన్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో గోపాల్‌ కృష్ణ  సోఫా మీద కూర్చొని...

Published : 02 Dec 2021 01:52 IST

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ నేత గోపాలకృష్ణ చిక్కుల్లో పడ్డారు. భాజపా నేత, కర్ణాటకలోని యలహంక ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ను చంపేయండి అంటూ గోపాల్‌ కృష్ణ వేసిన మర్డర్‌ ప్లాన్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో గోపాల్‌ కృష్ణ  సోఫా మీద కూర్చొని... ‘‘ఆ ఎమ్మెల్యే విశ్వనాథ్‌ను చంపేయండి. రూ.కోటి ఖర్చు అయినా ఫర్వాలేదు. అతడు చనిపోవడం నాకు కావాలి. దీని గురించి ఎవరికీ తెలియకూడదు. ఈ రహస్యం మన మధ్యే ఉండాలి’’ అంటూ మరో వ్యక్తితో జరిపిన సంభాషణలు సంచలనంగా మారాయి. కాగా ఈ వీడియోని పరిశీలించిన పోలీసులు.. ఇది ఏ రోజున రికార్డు అయిందనే వివరాలు లేవని, గోపాల్‌కృష్ణపై తదుపరి విచారణ జరుపుతామన్నారు. ఈ ఘటనకు సంబంధించి కర్ణాటక హోంశాఖ మంత్రి  మాట్లాడుతూ.. ‘‘ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేస్తున్నారు. విశ్వనాథ్‌ కూడా దీని గురించి నాతో మాట్లాడారు. ఆయనకు భద్రత కల్పిస్తాం. అయితే భద్రతా ఇవ్వాలా వద్దా అనేది ఇంటలిజెన్స్‌ విభాగం చేతుల్లో ఉంది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’’ అని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని