Mother: అమ్మ లేదని.. తిరిగి రాదని తెలియక: ఓ చిన్నారి కన్నీటి వ్యథ

‘ఆ చిన్నారికి తన తల్లి రాత్రే చనిపోయిందని తెలియని పరిస్థితి. ఉదయమే అమ్మా లే.. అమ్మా లే అంటూ ఆ బాలుడు తన తల్లిని పిలుస్తుంటే చూసినవారి కళ్లు చెమ్మగిల్లాయి.

Updated : 08 Sep 2021 09:13 IST

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: ‘ఆ చిన్నారికి తన తల్లి రాత్రే చనిపోయిందని తెలియని పరిస్థితి. ఉదయమే అమ్మా లే.. అమ్మా లే అంటూ ఆ బాలుడు తన తల్లిని పిలుస్తుంటే చూసినవారి కళ్లు చెమ్మగిల్లాయి. వివరాల్లోకి వెళితే.. అశ్వారావుపేట పట్టణం సంతపాకల వద్ద బుడగలు విక్రయిస్తూ ఉండే సంచార జాతికి చెందిన నిర్మల(45) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఉదయం నుంచి భారీ వర్షం రావడంతో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ చలి గాలుల్లోనే ఉండిపోయింది. రాత్రి తన కుమారుడైన కృష్ణని పక్కనే పడుకోబెట్టుకొని నిద్రపోయింది. తెల్లవారి లేచేసరికి చనిపోయి ఉంది. ఇది తెలియని బాలుడు ‘అమ్మా లే .. అమ్మా లే’ అంటూ కనిపించిన వారినల్లా ‘మా అమ్మకు ఏమైంది లేవడం లేదు’ అని అడగటంతో ఏమిచెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ సమాచారం అందుకున్న ఎస్‌ఐ చల్లా అరుణ ఘటనా స్థలానికి వచ్చి వారి వద్ద ఉన్న ఆధార్‌కార్డులు, ఇతర అడ్రసుల ఆధారంగా హైదరాబాద్‌, వరంగల్‌లో ఉంటున్న వారి బంధువులకు సమాచారం అందించారు. నిర్మల భర్తతో విడిపోయినట్లు సమాచారం. శవ పంచనామా నిర్వహించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు నిర్మలకు తెలిసిన మరో మహిళ వద్ద ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని