పాక్‌లో ఘోర ప్రమాదం

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఓ బస్సు, వ్యాన్‌ పరస్పరం ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. లాహోర్‌కు........

Published : 30 Nov 2020 21:47 IST

లాహోర్‌: పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఓ బస్సు, వ్యాన్‌ పరస్పరం ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. లాహోర్‌కు 75కి.మీల దూరంలోని కలఖతే రోడ్ నారంగ్ మండి వద్ద జరిగిన ఈ ఘటనలో 13 మంది సజీవ దహనం కాగా.. 17మంది గాయపడ్డారు. పొగమంచు కారణంగా దారి కనబడకపోవడంతో వ్యాన్‌ బస్సును ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వ్యాన్‌ పూర్తిగా దగ్ధమైందన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై పంజాబ్‌ ప్రావిన్స్‌ ముఖ్యమంత్రి ఉస్మాన్‌ బజ్దార్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్య సేవలందించాలని అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని