Inflammatory posts: సోషల్ మీడియాలో తాలిబన్లకు మద్దతు.. అస్సాంలో 14 మంది అరెస్టు
తాలిబన్లకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, కామెంట్లు పెట్టిన పలువురిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 14 మందిని అదుపులోకి తీసుకొని....
గువాహటి: అఫ్గానిస్థాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు అక్కడ తమ అరాచక పాలనకు నాంది పలికారు. మహిళా హక్కులను కాలరాస్తున్నారు. తమను వ్యతిరేకిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఆ తాలిబన్లకు భారత్లోని కొందరు మద్దతు పలుకున్నారు. తాలిబన్లకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, కామెంట్లు పెట్టిన పలువురిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటివరకు 14 మందిని అదుపులోకి తీసుకొని వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అస్సాంకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఉద్రేకపూరిత పోస్టులపై నిఘా ఉంచామని పేర్కొన్నారు. ఈ తరహా పోస్టులు పెట్టిన కామ్రూప్ మెట్రోపాలిటన్, బార్పేట్, ధుబ్రి, కరీంగంజ్ నుంచి ఇద్దరు చొప్పున అరెస్టు చేశామని పేర్కొన్నారు. దర్రాంగ్, కాచర్, హైలాకండి, దక్షిణ సల్మారా, గోల్పారా, హొజాయ్ ప్రాంతాల నుంచి ఒక్కొక్కరి చొప్పున అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. దేశ భద్రతకు హాని కలిగించేలా సోషల్ మీడియాలో తాలిబన్ అనుకూల వ్యాఖ్యలు, పోస్టులపై చట్టపరమైన, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్కుమార్(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. -
నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలు
నూడుల్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన వజ్రాలు, ప్రయాణికుల శరీర భాగాల్లో, బ్యాగేజీలో ఉంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకుంది. -
వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు
శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురికి గాయాలు
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన బస్సు అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దంపతులు వాటిని తీర్చే దారిలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భర్త మృతి చెందారు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లిలో జరిగింది. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్