యూపీలో పరువు హత్య!

ఇటీవల ఆడపిల్లలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌లోనే మరో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి కాకుండా గర్భవతి అయిందన్న కారణంతో ఓ తండ్రి మైనర్‌ బాలికను

Published : 08 Oct 2020 01:55 IST

లఖ్‌నవూ : ఇటీవల ఆడపిల్లలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌లోనే మరో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి కాకుండా గర్భవతి అయిందన్న కారణంతో ఓ తండ్రి మైనర్‌ బాలికను కిరాతకంగా హత్య చేశాడు. దీనికి తన పెద్ద కొడుకు సాయం తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని దుల్హాన్‌పూర్‌ గ్రామానికి చెందిన ఓ అమ్మాయి ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండి గర్భవతి అయ్యింది. కూతురు ఆరు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో గుర్తించిన తండ్రి దానికి కారణమైన వ్యక్తి గురించి ఆరా తీశాడు. అయితే ఎవరికైనా తన గురించి చెబితే గొంతు నులిమి చంపేస్తానని ఆ వ్యక్తి బాలికను బెదిరించాడు. దీంతో అతడి గురించి ఇంట్లో వాళ్లు ఎంత అడిగినా చెప్పలేదు. కూతురిపై కోపం పెంచుకున్న తండ్రి తన పెద్ద కొడుకు సాయంతో గత నెల 24న ఆమెను హత్య చేశాడు. అనంతరం తల నరికి దగ్గర్లోని కాలువలో పడేశాడు.

గ్రామానికి సమీపంలో మంగళవారం గ్రామస్థులకు బాలిక మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం తెలియజేశారు. రెండు వారాల నుంచి కూతురు కనిపించకపోయినా పోలీసులను ఆశ్రయించని తండ్రిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. దీంతో తనే నేరం చేసినట్లు తండ్రి ఒప్పుకున్నాడని స్థానిక ఎస్పీ తెలిపారు. అతడి పెద్ద కుమారుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలిక గర్భవతి కావడానికి కారణమైన వ్యక్తిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఈ కేసును పరువు హత్యగా భావించి బాలిక తండ్రిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని