Crime news: ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించలేదని బాలిక హత్య
యూపీలో దారుణం చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమంలో ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించలేదనే ఆగ్రహంతో ఓ యువకుడు.. 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డుకోబోయిన ఆమె తల్లినీ గాయపర్చినట్లు పోలీసులు సోమవారం...
లఖ్నవూ: యూపీలో దారుణం చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమంలో ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించలేదనే ఆగ్రహంతో ఓ యువకుడు.. 16 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డుకోబోయిన ఆమె తల్లినీ గాయపర్చినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు. ముజఫర్నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే రవి అనే యువకుడు.. పెళ్లి కార్డు ఇచ్చేందుకు ఆదివారం రాత్రి ఇక్కడి నాగ్లా బోహ్రా గ్రామంలోని బాలిక ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలోనే కార్డు తీసుకునేందుకు బాలిక ముందుకు రాగా.. ఒక్కసారిగా అతను కత్తితో పొడిచి హత్య చేసినట్లు స్థానిక ఎస్పీ మార్తాండ్ ప్రకాశ్ సింగ్ తెలిపారు.
కుమార్తెను కాపాడేందుకు యత్నించిన తల్లిపైనా దాడికి పాల్పడినట్లు ఎస్పీ చెప్పారు. అనంతరం కత్తితో పొడుచుకుని తానూ ఆత్మహత్యకు యత్నించాడని వెల్లడించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ కౌశల్ తెలిపారు. ఫేస్బుక్లో తన ఫ్రెండ్ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేయలేదనే అక్కసుతోనే నిందితుడు తన కుమార్తెను హత్య చేశాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయపడిన తల్లి, నిందితుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!