Crime news: మా డాడీ, అంకుల్‌ పలుమార్లు నన్ను రేప్‌ చేశారు.. బాలిక ఆరోపణ!

కంటికి రెప్పలా కాపాడాల్సిన కుటుంబ సభ్యులే ఓ బాలికను కాటేశారు. వావి వరుసలు మరిచి మృగాల్లా ప్రవర్తించి సొంత కూతురిపైనే పలు సందర్భాల్లో అఘాయిత్యం చేసి ఆమె జీవితాన్ని నాశనం చేశారు.

Published : 18 Nov 2022 01:43 IST

పుణె: కంటికి రెప్పలా కాపాడాల్సిన కుటుంబ సభ్యులే ఓ బాలికను కాటేశారు. వావి వరుసలు మరిచి మృగాల్లా ప్రవర్తించి సొంత కూతురిపైనే పలు సందర్భాల్లో అఘాయిత్యం చేసి ఆమె జీవితాన్ని నాశనం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి వచ్చి ప్రస్తుతం పుణెలో నివాసం ఉంటోన్న 17 ఏళ్ల బాలిక ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పడంతో ఈ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలో ప్రస్తుతం బాలిక చదువుతున్న కళాశాలలో లైంగిక వేధింపులపై కమిటీ సభ్యుల ముందు ఆమె హాజరై తన గోడును వినిపించడంతో భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుణె  పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఈ నిందితులపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, ఆమె తండ్రిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. 

2016, 2018 సంవత్సరాల్లో తాను యూపీలో ఉన్న సమయంలో తన అంకుల్‌ పలుమార్లు అత్యాచారం చేయగా.. తాతయ్య కూడా వేధింపులకు గురిచేసేవాడని బాలిక వాపోయింది. 2018లో పుణె వచ్చాక ఈ లైంగిక దాడి ఘటనల గురించి తన తండ్రికి ఓ చీటీలో రాసి ఇవ్వగా.. తనను హించేవారిపై చర్యలు తీసుకోవడానికి బదులుగా తల్లి ఇంట్లోలేని సమయంలో తనపై పలు సందర్భాల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై బాలిక తండ్రితో పాటు ఆమె అంకుల్‌, తాతయ్యలపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని