దారుణం: ఒకోచోట 18 ఏనుగులు మృత్యువాత!
ఒకేసారి 18 ఏనుగులు మృత్యువాత పడిన దారుణ ఘటన అస్సాంలోని నాగావన్ జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడి అటవీ అధికారుల సమాచారం ప్రకారం, కత్తైటోలి రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో......
దర్యాప్తునకు అస్సాం ముఖ్యమంత్రి ఆదేశం
గుహవాటి: ఒకేసారి 18 ఏనుగులు మృత్యువాత పడిన దారుణ ఘటన అస్సాంలోని నాగావన్ జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడి అటవీ అధికారుల సమాచారం ప్రకారం, కత్తైటోలి రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఏనుగుల సమూహాలు విగత జీవులుగా పడివుండడాన్ని గుర్తించిన స్థానిక ప్రజలు అధికారులకు సమాచారమిచ్చారు. కొండ ప్రాంతంలో ఒకచోట 14 ఏనుగులు, మరోచోట నాలుగు ఏనుగులు మృత్యువాతపడ్డట్లు అధికారులు గుర్తించారు. పిడుగుపాటు వల్ల ప్రాణలు కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నప్పటికీ.. పోస్టుమార్టంలోనే పూర్తి కారణాలు తెలుస్తాయన్నారు. అయితే, అక్కడి ఏనుగుల నిపుణులు మాత్రం విషప్రయోగం వల్లే 18 ఏనుగులు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఏదేమైనా, పోస్టుమార్టం నివేదికలో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ఈ స్థాయిలో ఒకేసారి 18 ఏనుగులు మృత్యువాతపడడం దేశంలో ఇదే తొలిసారి అని అటవీశాఖ నిపుణులు చెబుతున్నారు.
ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. ఏనుగుల మృతికి గల కారణాలపై పూర్తి దర్యాప్తు జరపాలని అటవీశాఖ మంత్రి పరిమల్ శుక్ల బైద్యకు సూచించారు. సీఎం ఆదేశాల ప్రకారం ఘటనా ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకుంటామని మంత్రి వెల్లడించారు.
మరోవైపు, దేశంలో ఏనుగుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక తొలిస్థానంలో ఉండగా, అస్సాం రెండో స్థానంలో ఉంది. 2017 లెక్కల ప్రకారం, అస్సాంలో దాదాపు 5700 ఏనుగులు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఏనుగులను వేటాడడం, రైలు ప్రమాదాలు, విష ప్రయోగంతో పాటు విద్యుదాఘాతం వంటి కారణాల వల్ల ఏనుగుల ప్రాణాలు కోల్పోవడం గతకొన్నేళ్లుగా పెరిగిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ